రూ.1600 కోట్ల విల్లాను కొనుగోలు చేసిన భారత వ్యాపారవేత్త.. ఆ విల్లాను చూస్తారా..?
Expensive Home: ప్రపంచంలోనే ఖరీదైన ఇళ్లలో ఒక దానిని భారత సంతతికి చెందిన ఓస్వాల్ కుటుంబం సొంతం చేసుకుంది. అందుకోసం వారు భారీ మొత్తం వెచ్చించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్కు చెందిన ఓ జంట ఓ ఖరీదైన ఇంటి( Expensive Home)ని సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్( Switzerland)లోని ప్రకృతి అందాలకు సమీపంలో నిర్మించిన ఆ భవంతికి వెచ్చించిన ఖర్చు సుమారు 200 మిలియన్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో 1,600 కోట్ల రూపాయల పైమాటే. ఆ కుటుంబం షేర్ చేసిన దృశ్యాల్లో ఆ ఖర్చు ఉట్టిపడుతోంది.
పంకజ్ ఓస్వాల్(Pankaj Oswal), రాధికా ఓస్వాల్( Radhika Oswal).. ఇటీవల స్విట్జర్లాండ్లోని గింగిన్స్ గ్రామంలో విల్లాను కొనుగోలు చేశారు. అది జెనీవాకు 15 నిమిషాల దూరంలో.. మంచుతో కప్పిఉండే ఆల్స్ప్ పర్వతశ్రేణికి సమీపంలో ఉంది. మొత్తం 4,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతి ఖర్చు అక్షరాలా రూ.1,639 కోట్లు. ఈ ఇంటిని ప్రముఖ డిజైనర్ జెఫ్రీ విల్కెస్.. సుందరీకరించారు. ప్రైవేటు జిమ్, స్పా, వెల్నెస్ వింగ్ వంటి సౌలభ్యాలున్నాయి. ఇంట్లో వేలాడదీసిన షాండ్లియర్లను టర్కీ, మొరాకో దేశాల నుంచి తెప్పించారు. ప్రకృతి అందాలను, మంచు పర్వతాలను వీక్షించేందుకు భారీ ఫ్రెంచ్ విండోస్ను అమర్చారు. అంతకుముందు గ్రీక్ షిప్పింగ్ మొగల్ అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె క్రిస్టినా ఒనాసిస్ ఈ ఇంటి యజమానిగా ఉన్నారు.
ఇంతటి ఖరీదైన ఇంటిని సొంత చేసుకున్న ఓస్వాల్ కుటుంబం.. 2013లో ఆస్ట్రేలియా నుంచి స్విట్జర్లాండ్( Switzerland)కు మకాం మార్చింది. ఓస్వాల్ గ్రూప్ గ్లోబల్(Oswal Group Global)కు పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాలున్నాయి. ఇక ఈ విల్లా పేరు.. వరి(Villa Vari). పంకజ్ తన ఇద్దరు కుమార్తెలు వసుంధర ఓస్వాల్, రిధి ఓస్వాల్ పేర్ల మీదుగా భవంతికి ఆ పేరు పెట్టారు. వసుంధర.. పీఆర్ఓ ఇండస్ట్రీస్ పీటీఈ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, యాక్సిస్ మినరల్స్లో డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. చిన్నకుమార్తె లండన్లో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు.
ఇటీవల రిధి.. ఇంటికి సంబంధించిన దృశ్యాలను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. ‘ఒక భారతీయురాలిగా విదేశాల్లో ఉన్నప్పుడు.. మన సంస్కృతికి సంబంధించిన కొన్ని విషయాలను మిస్ అవుతుంటాం. భారత్కు వెలుపల ఒక మినీ భారత్ను సృష్టించాలన్నది మా కుటుంబం కల. ఆ స్వప్నం సాకారమైనందుకు సంతోషంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్