Israel: హమాస్ మారణహోమంలో ఐరాస ఉద్యోగుల పాత్ర..! ఇజ్రాయెల్ స్పందన ఇదే..
యుద్ధం ముగిసిన తర్వాత ‘ గాజా’లో యూఎన్ఆర్డబ్ల్యూఏ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరతామని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి కాట్జ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
జెరూసలెం: పాలస్తీనా యుద్ధబాధితుల అభివృద్ధి, సహాయం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి (United Nations) ఏజెన్సీ ‘యూఎన్ఆర్డబ్ల్యూఏ’ (UNRWA ) విషయంలో ఇజ్రాయెల్ (Israel) కీలక అంశాన్ని లేవనెత్తింది. యుద్ధం ముగిసిన తర్వాత ‘గాజా’లో ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపేయాలని కోరతామని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి కాట్జ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అవసరమైతే అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU) దేశాల మద్దతు కూడగడతామని చెప్పారు. దీనిపై హమాస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాలస్తీనియన్ల రక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ ఏజెన్సీలను భయపెట్టాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని విమర్శించింది.
అక్టోబర్ 7న హమాస్ జరిపిన మారణహోమంలో ‘యూఎన్ఆర్డబ్ల్యూ’ ఏజెన్సీకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇజ్రాయెల్ ఆ ఏజెన్సీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాడి ఘటనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పలువురు ఉద్యోగులను తొలగించారు. మానవతా సాయం అందించే యూఎన్ ఏజెన్సీని రక్షించే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎన్ఆర్డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారిని పేర్కొన్నారు.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఏజెన్సీకి అదనపు నిధుల మంజూరును అమెరికా నిలిపివేసింది. పూర్తిస్థాయిలో సమీక్ష చేసిన తర్వాతనే ఆర్థిక సాయంపై ముందుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపింది. దాదాపు 12 మంది ఉద్యోగులకు హమాస్ దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానాలున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా యూఎన్ఆర్డబ్ల్యూఏకి నిధుల విడుదలను ఆపేశారు. ఈ నేపథ్యంలో కాట్జ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి ఘటనలో సుమారు 1200 మంది చనిపోయారు. 250 మందిని హమాస్ బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ బలగాలు హమాస్ లక్ష్యంగా గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 26,083 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్