Maldives: ‘మాది చిన్న దేశం.. శతృత్వాలు పెట్టుకోలేం’: మాల్దీవులు కొత్త అధ్యక్షుడు
భారత్, చైనా సహా అన్ని దేశాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మయిజ్జు అన్నారు. పొరుగు దేశాలతో రాజకీయ పరమైన ఘర్షణల్లో తాము చిక్కుకోలేమన్నారు.
మాలే: అధికార బాధ్యతలు చేపట్టగానే తమ ద్వీప దేశం నుంచి భారత బలగాలను పంపిస్తామని చెప్పిన మాల్దీవుల (Maldives) కొత్త అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది చాలా చిన్న దేశమని, పొరుగువారితో శతృత్వాలు పెట్టుకోలేమని అన్నారు. భారత్ (India), చైనా (China) సహా అన్ని దేశాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
నవంబరు 17న మయిజ్జు మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఇతర దేశాలతో విభేదాల గురించి స్పందించారు. ‘‘ఇతర దేశాలతో ఘర్షణల్లో చిక్కుకోవడానికి మాల్దీవులు చాలా చిన్న దేశం. ఇతర దేశాలతో ఘర్షణల కోసం మా విదేశాంగ విధానాన్ని వినియోగించుకునే ఆసక్తి లేదు’’ అని మయిజ్జు వ్యాఖ్యానించారు. తమ దీవుల్లో మోహరించిన భారత బలగాలను పంపిస్తామని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత దళాల స్థానంలో చైనా దళాలను మయిజ్జు అనుమతిస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. దీనిపై మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
అంతేగాక, భారత దళాలను వెళ్లిపొమ్మనడం అంటే.. వాటి స్థానంలో ఇతర దేశాల బలగాలకు అనుమతిస్తామనే ఉద్దేశం కాదని మయిజ్జు మరోసారి స్పష్టం చేశారు. తమ భూభాగంలో చైనా, లేక ఇతర దేశాలు దళాలు మోహరించేందుకు అనుమతించబోమని తెలిపారు. తాము పూర్తి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘భారత్, చైనా సహా మేం అంతర్జాతీయంగా అన్ని దేశాలతో కలిసి పనిచేస్తాం’’ అని మయిజ్జు ఈ సందర్భంగా వెల్లడించారు. చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్కు మయిజ్జు సన్నిహితుడు. దీంతో మయిజ్జు రాకతో మాల్దీవులు.. చైనా వైపు మొగ్గుచూపేందుకు ప్రయత్నించవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షదీవులకు కింద ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే కీలకమైన సముద్రమార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులు పలుదీవులతో కూడిన చిన్న దేశం కావడంతో భారత్ సాయంపైనే ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే అక్కడ భారత బలగాలు మోహరించాయి. ఈ దళాలు.. భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తున్నాయి. మాల్దీవుల్లో ప్రస్తుతం 50 నుంచి 75 మంది వరకు భారత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రమాణస్వీకారానికి కిరణ్ రిజిజు..
ఇదిలా ఉండగా.. మయిజ్జు ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీకి ఆహ్వానం అందింది. అయితే, ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. మాల్దీవులతో తమ బంధం కొనసాగుతుందని, ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన
రఫాలో వైద్య కార్యకలాపాల నిర్వహణకు మూడు రోజులకు సరిపడా మాత్రమే ఇంధన నిల్వలు ఉన్నట్లు ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన వ్యక్తంచేసింది. -
రన్వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు
ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం రన్వేపై జారిపడిన ఘటన సెనెగల్లో చోటుచేసుకుంది. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
సౌదీ అరేబియా నిర్మించనున్న కలల నగరం నియోమ్ వెనుక చీకటి కోణం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశం నుంచి పారిపోయిన కర్నల్ ఒకరు ఆంగ్లవార్తా సంస్థకు వెల్లడించారు. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ.. మన దేశానికి రష్యా(Russia) అండగా నిలిచింది. అంతేగాక, భారత ఎన్నికల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మాస్కో దుయ్యబట్టింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
Barron Trump: వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్న బ్యారన్ ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారు. పార్టీ కన్వెన్షన్కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు. -
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో మా నిబద్ధత మారదు: మాల్దీవుల మంత్రితో జైశంకర్
-
ప్రయాణికుల రద్దీ.. 22 రైళ్లకు అదనపు కోచ్లు
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన