ప్లీజ్.. మా వాళ్లను సైన్యంలోకి తీసుకోవద్దు: రష్యాను కోరిన నేపాల్
రష్యా(Russia) సైన్యంలో పోరాడుతూ తన దేశీయులు ఆరుగురు మృతి చెందడంపై నేపాల్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ వాళ్లను సైన్యంలో చేర్చుకోవద్దని రష్యాను కోరింది.
కాఠ్మాండూ: తన దేశీయులను సైన్యంలోకి తీసుకోవద్దని రష్యా(Russia)ను నేపాల్ కోరింది. ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వర్తిస్తోన్న వారిని తిరిగి తమ దేశానికి పంపివేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగశాఖ వెల్లడించింది.
నేపాల్(Nepal)కు చెందిన గూర్ఖాలకు ధైర్యసాహసాలు ఎక్కువంటారు. వారిని పోరాట యోధులుగా పిలుస్తారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నేపాలీ గూర్ఖా యువకులు రెండు పక్షాల తరఫునా పోరాడుతున్నారు. రష్యా ఆర్మీలో సేవలు అందిస్తోన్న ఆరుగురు గూర్ఖాలు మృతి చెందడంతో నేపాల్ నుంచి ఈ అభ్యర్థన వచ్చింది. ‘వెంటనే ఆ మృతదేహాలను స్వదేశానికి పంపించాలని మేం రష్యా ప్రభుత్వాన్ని కోరాం. అలాగే వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడిగాం’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా సైన్యంలో పనిచేస్తూ.. ఉక్రెయిన్ చేతిలో బందీగా మారిన నేపాల్ పౌరుడి విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. యుద్ధంలో పాల్గొంటున్న ఏ దేశ సైన్యంలోనూ చేరొద్దని తన పౌరుల్ని కోరింది. నేపాల్ ప్రకటనపై ప్రస్తుతం రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
హమాస్ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు..!
రష్యా సైన్యం తరఫున 150-200 మంది నేపాలీలు పోరాడుతున్నట్లు సమాచారం. నెలకు మూడు నుంచి నాలుగు లక్షల నేపాలీ రూపాయల వేతనం, ఏడాది పాటు పోరాడితే రష్యన్ పౌరసత్వం ఇస్తామంటూ అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన హామీ వారిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. పేద హిమాలయ దేశమైన నేపాల్ నుంచి గూర్ఖాలు 200 ఏళ్లుగా బ్రిటిష్, భారత సైన్యాల్లో సేవలందిస్తున్నారు. ఆ మేరకు మూడు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అయితే రష్యాతో నేపాల్కు అలాంటి ఒప్పందమేమీ లేదు. అయితే స్వదేశంలో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్న నేపాలీ సర్కారు- విదేశీ అవకాశాలను వెతుక్కోవద్దని యువతకు చెప్పలేకపోతోంది.
కొవిడ్ సమయంలో, అనంతర కాలంలో నేపాలీ పర్యాటక రంగం కుదేలైంది. దాంతో యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటోంది. పశ్చిమాసియా, దక్షిణకొరియా, మలేసియా వంటి దేశాల్లో వారు కూలీలుగా పనిచేస్తున్నారు. మరోపక్క యుద్ధంలో మరణించిన నేపాలీలను ఖననం(వారిది దహనం చేసే సంప్రదాయం) చేస్తున్నారనే వార్తలు, హామీ ఇచ్చిన వేతనాల్లో నాలుగో వంతే చెల్లించడం వంటి కారణాలతో అక్కడి వారిని వెనక్కి తీసుకురావాలంటూ ప్రభుత్వంపై సైనికుల తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకువస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!