Pakistan: మా దేశం దివాలా తీయాలని కొన్ని అంతర్జాతీయ సంస్థలు కోరుకుంటున్నాయి: పాక్ ఆర్థిక మంత్రి
పాకిస్థాన్ (Pakistan) దివాలా కోసం కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఎదురుచూస్తున్నాయని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అన్నారు. నిధుల విడుదలలో ఆలస్యానికి గల కారణాన్ని ఐఎమ్ఎఫ్ (IMF) ఇప్పటి వరకు వెల్లడించలేదని మంత్రి తెలిపారు.
ఇస్లామాబాద్: భౌగోళిక రాజకీయాల కారణంగానే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) నుంచి పాకిస్థాన్ (Pakistan)కు సాయం అందడంలేదని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) ఆరోపించారు. శ్రీలంక తరహాలోనే పాకిస్థాన్ కూడా దివాలా తీయాలని కొన్ని అంతర్జాతీయ సంస్థలు కోరుకుంటున్నాయని పరోక్షంగా ఐఎమ్ఎఫ్ను ఉద్దేశించి దార్ వ్యాఖ్యానించారు. దానివల్ల పాక్తో సంప్రదింపులు మరింత సులువుగా పూర్తి చేయొచ్చని భావిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. గతేడాది నవంబరు నుంచి బెయిలౌట్ ప్యాకేజీపై తొమ్మిదో సమీక్ష నిర్వహణలో ఆలస్యానికి గల కారణాన్ని ఐఎమ్ఎఫ్ ఇప్పటి వరకు వెల్లడించలేదని తెలిపారు.
ఐఎమ్ఎఫ్ నుంచి బెయిలౌట్ ప్యాకేజీ అందకున్నా.. పాకిస్థాన్ దివాలా తీయదని స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకల్లా ఐఎమ్ఎఫ్ తొమ్మిదో సమీక్ష కూడా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్కు ఆరు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ఐఎమ్ఎఫ్ 2019లో ఒప్పందం చేసుకుంది. ఇందుకు పాకిస్థాన్కు కొన్ని షరతులు విధించింది. అయితే, ఐఎమ్ఎఫ్ విధించిన షరతులను పాకిస్థాన్ పూర్తిగా అమలు చేయకపోడంతో నిధుల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే తమ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగిన దేశాలు మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి హామీ ఉండేందుకు ముందుకువచ్చాయని దార్ తెలిపారు. దీంతో వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లు మరో మూడు బిలియన్ డాలర్ల సాయం అందించేందుకు అంగీకరించాయని చెప్పారు. ఎలాంటి కారణం లేకుండా నిధుల విడుదలను ఆలస్యం చేయడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను చైనా గ్రహించిందని, అందుకే ఆ దేశ బ్యాంకులు పాకిస్థాన్కు రుణాలు మంజూరు చేసేందుకు ముందుకొచ్చాయని దార్ తెలిపారు.
మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయానికి సంబంధించి సౌదీ అరేబియా, యూఏఈలు ఐఎమ్ఎఫ్కు హామీ ఇచ్చాయని, RISE ప్రాజెక్ట్ కింద వరల్డ్ బ్యాంక్ 400 మిలియన్ డాలర్లు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరో 250 మిలియన్ డాలర్ల ఆర్థికం సాయం అందించనున్నాయని చెప్పారు. కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అనంతరం, పాకిస్థాన్ అవకాశాన్ని కోల్పోయిందని.. బడ్జెట్ను ఉద్దేశించి ఐఎమ్ఎఫ్ వ్యాఖ్యానించింది. దీనిపై పాక్ ఆర్థిక మంత్రి స్పందిస్తూ తాజా వ్యాఖ్యలు చేశారు.
‘‘బడ్జెట్లో ఐఎమ్ఎఫ్ సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, ఐటీ, వ్యవసాయం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వంటి రంగాలకు కేటాయింపులు చేయకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యంకాదు. ప్రస్తుతం దేశ ఆర్థికాభివృద్ధి రేటు 0.29 శాతంగా ఉంది. ఈ ఏడాది ఐటీ పరిశ్రమ 2.5 బిలియన్ డాలర్ల వృద్ధిని సాధిస్తుందని, వచ్చే ఏడాది నాటికి ఇది 4.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. ఐటీ పరిశ్రమను వృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మిగిలిన రంగాలకు కేటాయింపుల్లో మినహాయింపులు ఇచ్చాం’’ అని ఇషాక్ దార్ తెలిపారు. గత కొన్నేళ్లుగా పాక్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉంది. దీంతో నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాకిస్థాన్ ఐఎమ్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
ఉక్రెయిన్ తీరప్రాంత నగరమైన ఒడెస్సాలోని హ్యారిపోటర్ కోట(Harry Potter Castle)గా పేరున్న భవనాన్ని రష్యా క్షిపణి ధ్వంసం చేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
Columbia University: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా విద్యార్థులు చేస్తున్న నిరసనలను పోలీసులు క్రమంగా అదుపులోకి తీసుకొస్తున్నారు. తాజాగా కొలంబియా వర్సిటీలో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!