Pakistan: అత్యాచారాలతో వణుకుతోన్న పాకిస్థాన్.. ఎమర్జెన్సీ విధింపునకు సిద్ధం
మహిళలపై అఘాయిత్యాలతో పాకిస్థాన్లోని (Pakistan) పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్సులో (Punjab Province) మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి.
పంజాబ్ ప్రావిన్సు అధికారుల నిర్ణయం
లాహోర్: మహిళలపై అఘాయిత్యాలతో పాకిస్థాన్లోని (Pakistan) పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్సులో (Punjab Province) మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజూ అక్కడ నాలుగైదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా మహిళలపై జరుగుతోన్న దాడులను నియంత్రించేందుకు ఉపక్రమించిన ప్రావిన్సు అధికారులు.. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ (Emergency) విధించాలని నిర్ణయించారు.
‘పంజాబ్ ప్రావిన్సులో నిత్యం నాలుగు నుంచి ఐదు రేప్ కేసులు నమోదవుతున్నాయి. ఇలా ప్రావిన్సులోని మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసులు గణనీయంగా పెరగడం ఆందోళనకర విషయం. ఈ పరిణామం ప్రభుత్వంతోపాటు సమాజానికి అత్యంత తీవ్రమైన అంశం. ఈ నేపథ్యంలో అత్యాచారాలు, మహిళలపై దాడుల కేసులన్నింటినీ కేబినెట్ సబ్కమిటీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది’ అని పంజాబ్ హోంమంత్రి అత్తా తరార్ పేర్కొన్నారు. మరోవైపు ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు ఉన్న అవకాశాలపై పౌర సమాజం, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, సైనికాధికారులతో సంప్రదింపులు జరుపుతామన్నారు.
అత్యాచార వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిందన్న ఆయన.. మహిళలపై దాడులకు పాల్పడే వారిని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. లైంగిక వేధింపుల విషయంపై పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కేసులను త్వరితగతిన విచారణ పూర్తిచేయడంలో కీలకమైన పంజాబ్ ప్రావిన్సు ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీని కూడా మరింత బలోపేతం చేస్తున్నామని పంజాబ్ ప్రావిన్సు హోంమంత్రి వెల్లడించారు. ఇక రాష్ట్రంలో స్కూళ్లు, పాఠశాలల్లో డ్రగ్స్ తీసుకోవడం ఫ్యాషన్గా మారడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంపై చింతిస్తున్నానని అన్నారు. ఇక భద్రత గురించి ప్రాముఖ్యతను తమ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. యుక్తవయసు పిల్లల్ని ఇళ్లల్లో ఒంటరిగా వదిలివేయకూడదని.. వారిపై ఎప్పటిప్పుడు పర్యవేక్షణ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
ఆస్ట్రేలియాలోని ఓ మహిళా ఎంపీకి కొందరు దుండగులు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. -
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ హతమయ్యాడు. -
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి