Pakistan: ‘మాదే అతిపెద్ద పార్టీ..’ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు నవాజ్ ప్రయత్నాలు!
పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ‘పీఎంఎల్-ఎన్’ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని నవాజ్ షరీఫ్ ప్రకటించడం గమనార్హం.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల (Pakistan Elections) ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (PTI) పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు సమాచారం. వారు ఇప్పటివరకు 61 స్థానాల్లో గెలుపొందినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) నేతృత్వంలోని ‘పీఎంఎల్-ఎన్’ పార్టీకి 43 సీట్లు, ‘పీపీపీ’కి 34 సీట్లు వచ్చినట్లు వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఇలా ఒకవైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగానే.. ‘పీఎంఎల్-ఎన్’ పాకిస్థాన్లో అతిపెద్ద పార్టీగా అవతరించిందని నవాజ్ షరీఫ్ ప్రకటించడం గమనార్హం.
మాతో చేతులు కలపండి.. నవాజ్ పిలుపు
ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా నవాజ్ షరీఫ్ పావులు కదుపుతున్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలను గౌరవిస్తున్నానని, దేశ పునర్నిర్మాణం దిశగా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగానూ ఇతర పార్టీలు తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. సంక్షోభ పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తీసుకురావడంలో అన్ని సంస్థలు కలిసి సానుకూల పాత్ర పోషించాలని కోరారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు.. పీపీపీ, జేయూఐ-ఎఫ్, ఎంక్యూఎం-పీ తదితర పార్టీలతో సంప్రదింపులు జరపాలని తన సోదరుడు షెహబాజ్కు సూచించినట్లు చెప్పారు.
పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్ ‘అభ్యర్థుల’ హవా?
పాకిస్థాన్లో 265 స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించగా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడి జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకే ఎన్నికలు నిర్వహించారు. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్పై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఆయన పార్టీ పీటీఐ అధికారిక చిహ్నం క్రికెట్ బ్యాట్ను ఎన్నికల్లో ఉపయోగించుకునేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా బరిలోకి దిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.