Odisha Mystery: ఒకే హోటల్లో.. ఇద్దరు రష్యన్ల మృతి.. అసలేం జరిగింది..?
భారత్లో పర్యటిస్తోన్న రష్యాకు చెందిన ఓ చట్టసభ సభ్యుడితోపాటు మరో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. మిత్రుడి మరణం తట్టుకోలేకనే మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యన్లు చనిపోవడం చర్చనీయాంశమయ్యింది.
మాస్కో: భారత్ పర్యటనలో ఉన్న ఇద్దరు రష్యన్లు (Russians) రెండు రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. రష్యా చట్టసభ సభ్యుడు, వితరణశీలి పావెల్ ఆంటోవ్ ఇటీవల ఒడిశా (Odisha)లోని రాయగడలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. స్థానిక హోటల్లో బస చేసిన ఆయన మూడో అంతస్తు నుంచి కిందపడి చనిపోయినట్లు భావిస్తున్నారు. అంతకు రెండురోజుల క్రితం.. అదే హోటల్లో ఆయన స్నేహితుడూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. అయితే, వీరిలో చట్టసభ సభ్యుడు పావెల్ ఆంటోవ్.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అధ్యక్షుడు పుతిన్పై కొన్ని నెలల క్రితం విమర్శలు చేశారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రష్యాలో సంపన్నుడిగా పేరొందిన పావెల్ ఆంటోవ్(65) తన పుట్టిన రోజును చేసుకునేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి డిసెంబరు 21న ఒడిశాలోని రాయగడకు చేరుకున్నారు. పావెల్ మిత్రుడు వ్లాదిమిర్ బిదెనోవ్(61) డిసెంబర్ 22న అనుమానాస్పద స్థితిలో హోటల్ ప్రాంగణంలో మరణించారు. గుండెపోటు కారణంగా మరణించి ఉండొచ్చని భావించిన పోలీసులు.. కుటుంబ సభ్యుల అనుమతితో అంత్యక్రియలు పూర్తిచేశారు. రెండు రోజుల తర్వాత అదే హోటల్లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో రక్తపు మడుగులో పావెల్ అంటోవ్ కనిపించారు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..? లేక మూడో అంతస్తు నుంచి జారిపడ్డారా..? అనే విషయంపై స్పష్టత లేదని హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. బాల్య స్నేహితుడి (వ్లాదిమిర్ బిదెనోవ్) మరణాన్ని తట్టుకోలేకనే ఆంటోవ్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యన్లు భారత్లో ప్రాణాలు కోల్పోవడంపై ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. పుతిన్పై విమర్శలు గుప్పించేవారు రష్యాలో ఇలాగే అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై భారత్లోని రష్యా ఎంబసీ తాజాగా స్పందించింది. ఒడిశాలో జరిగిన విషాద ఘటన తమకు తెలిసిందని పేర్కొంది. అందులో పావెల్ ఆంటోవ్.. రష్యాలోని ‘వ్లాదిమిర్ ఒబ్లాస్ట్’ అసెంబ్లీ సభ్యుడని వెల్లడించింది. వారు బస చేస్తున్న హోటల్ గది కిటికీ నుంచి కిందపడి చనిపోయినట్లు తమకు తెలిసిందని పేర్కొంది. ఇప్పటివరకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం అందులో నేరపూరిత కోణం ఏమీ లేదని రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు