Ukraine Crisis: ఈ ఖాళీ స్ట్రోలర్స్ వెనుక.. కనిపించని కడుపుకోత..!
లివీవ్ ప్రాంతంలోని రినోక్ స్క్వేర్... నేతల యుద్ధకాంక్షకు చెల్లించుకున్న భారీ మూల్యానికి నిలువెత్తు నిదర్శనం. నిర్జీవంగా మారిన బిడ్డను తలుచుకుంటూ తల్లడిల్లుతోన్న తల్లుల కన్నీటికి సజీవ సాక్ష్యం.
కీవ్: లివీవ్ ప్రాంతంలోని రినోక్ స్క్వేర్... నేతల యుద్ధకాంక్షకు చెల్లించుకున్న భారీ మూల్యానికి నిలువెత్తు నిదర్శనం. నిర్జీవంగా మారిన బిడ్డలను తలుచుకుంటూ తల్లడిల్లుతోన్న తల్లుల కన్నీటికి సజీవ సాక్ష్యం. అక్కడ వరుసలు తీరిన స్ట్రోలర్స్.. ఈ ప్రపంచానికి వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నాయి. పుతిన్ను నిలువరించాలని రష్యన్ తల్లులను సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మూడు వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నడుస్తుండగా.. ఇన్ని రోజుల్లో ఎన్నో పసిప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ స్ట్రోలర్స్.. తల్లులు పడుతోన్న వేదనను ప్రపంచానికి చెప్తున్నాయి. ఈ సంతాప దృశ్యాలను లివీవ్ మేయర్ ఆండ్రియ్ సడోవియ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
‘109 మంది పసిబిడ్డలు. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టిన దగ్గరి నుంచి ఇంత మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇది భయంకరమైన యుద్ధమూల్యం. ఉక్రెయిన్ పిల్లలను రక్షించుకునేందుకు, వారికి భవిష్యత్తును అందించేందుకు ఈ ప్రపంచంలోని పెద్దలంతా ఒక కవచంలా నిలవాలని మేం అభ్యర్థిస్తున్నాం’ అంటూ మేయర్ ఈ చిత్రాలను షేర్ చేశారు. ముక్కుపచ్చలారని ఆ 109 మంది చిన్నారుల మృతికి సంతాపంగా ఈ స్ట్రోలర్స్ను లివీవ్లోని రినోక్ స్క్వేర్ వద్ద ఉంచారు.
ఈ చిత్రాలను చూసి చలించని హృదయం లేదు. మీ పిల్లలు అలా స్ట్రోలర్స్లో తిరిగిన విషయాన్ని ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకోండంటూ రష్యన్ తల్లులను కొందరు సూటిగా అడుగుతున్నారు. ‘ఆ చిన్నారులు చనిపోవడంతో ఇక స్ట్రోలర్లో ఉంచలేం. అక్కడ మీ పిల్లలున్నట్లు ఒక్క నిమిషం ఊహించుకోండి. మీ బిడ్డల పట్ల మీరెలా స్పందిస్తారో గుర్తు తెచ్చుకోండి. నేను ఇక ఖాళీ స్ట్రోలర్ను చూడదల్చుకోలేదు’ అని ఉక్రెయిన్ మహిళ ఒకరు తీవ్ర ఆవేదన చెందారు.
ఇదిలా ఉండగా.. ఈ దురాక్రమణ కారణంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్తూ.. గాయపడిన చిన్నారులున్నారు. తమ శరీర భాగాలు కోల్పోయి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారున్నారు. వారికి చికిత్స అందించే క్రమంలో వైద్య సిబ్బందీ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇప్పటివరకూ 130 మంది పిల్లలు గాయపడి ఉంటారని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కలు ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. దాడులు తీవ్రంగా ఉండటంతో వాస్తవ గణాంకాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు