Covid-19: ఆ వ్యక్తికి వరుసగా 505 రోజులు కరోనా పాజిటివ్..
బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి శరీంలో కరోనా ఏకంగా ఏడాదిన్నరకుపైగా ఉందన్న విషయం విస్తుగొలుపుతోంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న ఆ వ్యక్తి శరీరంలో 505 రోజులపాటు......
తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాల వెల్లడి
లండన్: ఓ వ్యక్తికి కరోనా సోకితే అతడి శరీరంలో వైరస్ ఐదు రోజులు, వారం, లేదా మహా అయితే 15-30 రోజులు ఉంటుంది. కానీ, బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి శరీరంలో కరోనా ఏకంగా ఏడాదిన్నరకు పైగా ఉందన్న విషయం విస్తుగొలుపుతోంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న ఆ వ్యక్తి శరీరంలో 505 రోజులపాటు కరోనా వైరస్ సజీవంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 2020 ఆరంభంలో వైరస్ బారినపడిన ఆ రోగికి.. రెమిడెసివిర్ సహా మరెన్నో ఔషధాలతో చికిత్స అందించినా 2021లో మృతిచెందినట్లు వెల్లడైంది.
ఇతర వ్యాధుల కారణంగా ఆ వ్యక్తి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అప్పటికే తీవ్రంగా బలహీనపడిందని.. అందుకే ఏడాదిన్నరకుపైగా కరోనా అలానే ఉందని లండన్ కేంద్రంగా పనిచేసే గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్లో అంటువ్యాధుల నిపుణుడు డా.లూక్ బ్లాగ్డాన్ స్నెల్ వివరించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా కరోనా పాజిటివ్ ఉన్న కేసు ఇదేనా అని కచ్చితంగా చెప్పడం కష్టమని ఆయన పేర్కొన్నారు. అన్ని కేసుల్లోనూ ఇలా క్రమబద్ధంగా టెస్టులు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు.
ఇదే తరహాలో సుదీర్ఘకాలం పాటు 9 కరోనా పాజిటివ్ కేసులపైనా స్నెల్ బృందం అధ్యయనం చేసింది. అవయవ మార్పిడి, హెచ్ఐవీ, క్యాన్సర్ లేదా ఇతర రోగాలకు చికిత్స తీసుకుంటూ ఉండడం కారణంగా ఆ 9 మంది రోగనిరోధక వ్యవస్థలు తీవ్రంగా బలహీనపడినట్లు గుర్తించారు. ఇలా సూపర్లాంగ్ ఇన్ఫెక్షన్లు ఉన్న వారి శరీరంలోనే కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయా అనే కోణంలో వీరి పరిశోధనలు జరగగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ 9 మందికి సగటున 73 రోజులు కరోనా పాజిటివ్గా వచ్చింది. ఇద్దరు బాధితులు సంవత్సరం కన్నా ఎక్కువకాలం వైరస్తో పోరాడారు. ఇలాంటి వారి నుంచి ఇతరులకు కొవిడ్ వ్యాపిస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు కరోనా బారినపడకుండా చూసుకోవడం సహా అలాంటి వారికోసం ప్రత్యేక చికిత్స విధానాలు తయారు చేయాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన తెలియచెబుతోందని స్నెల్ అన్నారు. జనసమూహంలో ఉన్నప్పుడు మాస్కులు ధరించాలని సూచించారు. అధ్యయనంలోని మరిన్ని విషయాలను ఈ వారాంతంలో పోర్చుగల్లో జరిగే ఓ సదస్సులో స్నెల్ బృందం వివరించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!