Imran Khan: ప్రధానిగా ఇమ్రాన్ను తప్పించాలని అమెరికా సూచించింది!
పాకిస్థాన్ రాయబారికి, అమెరికా ప్రభుత్వాధికారులకు మధ్య కీలక సమావేశం జరిగిన మరుసటి రోజు ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.
వాషింగ్టన్/ఇస్లామాబాద్: ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను తప్పించాలని పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వాన్ని అమెరికా (USA) ప్రోత్సహించిందని ఓ అంతర్జాతీయ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. దీనిని ధ్రువీకరించేలా.. పాకిస్థాన్ ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికాలో పాకిస్థాన్ రాయబారికి, అమెరికా ప్రభుత్వాధికారులకు మధ్య ఓ సమావేశం జరిగిన మరుసటి రోజు ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాక్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్ ఖాన్ తటస్థ వైఖరి కారణంగానే ఆయన్ను ప్రధాని పదవి నుంచి తప్పించాలని అమెరికా నిర్ణయించినట్లు తెలిపింది.
ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్తో అమెరికా హోంశాఖలోని ఇద్దరు ముఖ్య అధికారులతోపాటు దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ మే 7, 2022న సమావేశమయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజు.. మే 8, 2022న ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని తెలిపింది. ఏప్రిల్ 10, 2022న ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ నుంచి వైదొలిగారు. అనంతరం షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
జైల్లో ఉండలేను.. ఇక్కడి నుంచి తీసుకెళ్లండి
పాక్ రాయబారి, అమెరికా ప్రభుత్వాధికారుల మధ్య భేటీకి ముందు.. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్లో ర్యాలీ చేపట్టారు. ఇందులో అమెరికాను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు చెప్పిందల్లా చేయడానికి మేం మీ బానిసలం కాదు. మాకు రష్యాతోపాటు అమెరికాతో మైత్రి బంధం ఉంది. అలాగే చైనా, ఐరోపాలో కూడా మాకు మిత్రులున్నారు. మేం ఏ కూటమిలో భాగస్వామ్యులం కాదు’’ అని ఇమ్రాన్ ర్యాలీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై యూరప్ దేశాలు సహా అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు డోనాల్డ్ లూ పాక్ రాయబారికి తెలిపినట్లు పత్రాల్లో ఉన్నాయని వెల్లడించింది. ఒకవేళ ఇమ్రాన్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నెగ్గితే.. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ చేసిన రష్యా పర్యటనను వాషింగ్టన్ క్షమిస్తుందని డోనాల్డ్ చెప్పినట్లు పేర్కొంది.
అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. తనను ప్రధాని పదవి నుంచి తొలగించడం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని అమెరికాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అనంతరం నెలకొన్న పరిణామాలతో తోషాఖానా కేసులో ఇమ్రాన్కు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన అటక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.