Bill Gates: బిల్గేట్స్ చేతిలో సల్మాన్ ఖాన్ ఫొటో.. ఎందుకో తెలుసా?
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గేట్స్ (Bill Gates) బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ (Salman Khan) ఫొటోను చేతిలో పట్టుకుని కన్పించారు. భాయిజాన్ ఫొటోను ఆయన ఎందుకు చూపించారని ‘కన్ఫ్యూజ్’ అవుతున్నారా?అదేంటో చదివేయండి మరి..!
ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల సొంతంగా ఓ పాడ్కాస్ట్ (podcast)ను ప్రారంభించారు. ‘అన్కన్ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్’ పేరుతో పలువురు ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ పాడ్కాస్ట్ రెండో ఎపిసోడ్లో ప్రముఖ ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్ (Sal Khan)తో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ (Bollywood) నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) గురించి వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
సల్మాన్, సాల్ ఖాన్ ఇద్దరి పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో గేట్స్ దీని గురించి ప్రశ్నించారు. ‘‘మీరెప్పుడైనా వెబ్ సెర్చ్లో సాల్ ఖాన్ గురించి వెతికినప్పుడు.. బహుశా ఈ వ్యక్తి కన్పించి ఉంటారు కదా..!’’ అంటూ బాలీవుడ్ కండల వీరుడి ఫొటోను సాల్ ఖాన్కు చూపించారు. ఆయన బదులిస్తూ.. అవునంటూ చిరునవ్వులు చిందించారు.
రూ.వందల కోట్లున్నా.. అమ్మాయి దొరకట్లేదు!
ఆ తర్వాత, ‘‘ఎప్పుడైనా మీరు సల్మాన్ ఖాన్ వల్ల కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చిందా?’’ అని ప్రశ్నించారు. దీనికి సాల్ ఖాన్ స్పందిస్తూ.. ‘‘అవును. నేను అకాడమీ ప్రారంభించిన తొలినాళ్లలో ఆ నటుడి (సల్మాన్ ఖాన్) అభిమానుల నుంచి నాకు మెయిల్స్ వచ్చాయి. ‘మీరంటే మాకు చాలా అభిమానం. కానీ మీరు లెక్కలు కూడా చేయగలరని నాకు తెలియదు’ అని సల్మాన్ ఖాన్ అనుకుని నాకు సందేశాలు పంపేవారు’’ అని సాల్ ఖాన్ చెప్పడంతో బిల్గేట్స్ నవ్వులు చిందించారు.
ఇక, ఈ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్తో తనకున్న పరిచయాన్ని సాల్ ఖాన్ పంచుకున్నారు. 2015లో తాను భారత్కు వెళ్లినప్పుడు ఓ టీవీ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్తో కలిసి పాల్గొన్నానని తెలిపారు. ఈ వీడియోను బిల్గేట్స్ తన యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.