Khammam: ‘మాస్టారూ మీరు వెళ్లొద్దు’.. బోరున విలపించిన విద్యార్థినులు..!

మాస్టారూ మీరు వెళ్లొద్దంటూ విద్యార్థినులు రోదించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో డిప్యుటేషన్‌పై వచ్చిన  నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలకు బదిలీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న విద్యార్థినులు మాస్టారూ.. మీరు వెళ్లొద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన పట్ల విద్యార్థినులు చూపిస్తున్న అభిమానాన్ని చూసి భారమైన మనసుతో ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి వెళ్లిపోయారు. 

Updated : 06 Nov 2022 10:35 IST

మాస్టారూ మీరు వెళ్లొద్దంటూ విద్యార్థినులు రోదించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో డిప్యుటేషన్‌పై వచ్చిన  నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలకు బదిలీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న విద్యార్థినులు మాస్టారూ.. మీరు వెళ్లొద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన పట్ల విద్యార్థినులు చూపిస్తున్న అభిమానాన్ని చూసి భారమైన మనసుతో ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి వెళ్లిపోయారు. 

Tags :

మరిన్ని