Kishan Reddy: అమరుల త్యాగాలను మరుగునపడేశారు: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ  సీడబ్ల్యూ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించే నైతిక హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుండా ఓట్ల రాజకీయాలు చేసి అమరుల త్యాగాలను మరుగునపడేశారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా వేడుకలు నిర్వహించి హైదరాబాద్‌లో నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రేపటి అమిత్ షా సభ నేపథ్యంలో ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ , భారాసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 16 Sep 2023 23:32 IST

కాంగ్రెస్ పార్టీ  సీడబ్ల్యూ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించే నైతిక హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుండా ఓట్ల రాజకీయాలు చేసి అమరుల త్యాగాలను మరుగునపడేశారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా వేడుకలు నిర్వహించి హైదరాబాద్‌లో నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రేపటి అమిత్ షా సభ నేపథ్యంలో ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ , భారాసపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని