మా సొమ్ము మా కివ్వడానికి ఇన్ని కష్టాలా?
శ్రమ.. శక్తికి మించి పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు.. అప్పుల బాధలు.. ఇలా విత్తు వేసింది మొదలు ఫలసాయం అందే వరకూ అన్నీ అవాంతరాలే. అయినా..వరి సిరులు కురిపిస్తుందని రైతన్న ఆకాంక్ష. అందుకే కష్టాలు కసిరినా.. కన్నీళ్లు
ఇంకా అందని రబీ ధాన్యం బకాయిలు
ఖరీఫ్ సాగుకు కష్టాలు
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే-భీమవరం అర్బన్, పెనుమంట్ర, దెందులూరు, ఆకివీడు
శ్రమ.. శక్తికి మించి పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు.. అప్పుల బాధలు.. ఇలా విత్తు వేసింది మొదలు ఫలసాయం అందే వరకూ అన్నీ అవాంతరాలే. అయినా..వరి సిరులు కురిపిస్తుందని రైతన్న ఆకాంక్ష. అందుకే కష్టాలు కసిరినా.. కన్నీళ్లు ముసిరినా.. విపత్తులు ఉరిమినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. నెలల పర్యంతం పేరుకుపోయిన బకాయిలు అన్నదాత వెన్ను విరుస్తున్నాయి. ఖరీఫ్ మధ్య దశకువచ్చినా రబీ ధాన్యం అమ్మిన సొమ్ము అక్కరకు రాక ఆర్తిగా చూస్తున్నారు.
ధాన్యం ఎగుమతి చేస్తున్న కూలీలు
ధాన్యం విక్రయించిన 48 గంటల్లో నగదు చెల్లించాలన్న నిబంధన గతంలో ఉండేది. దాన్ని వైకాపా ప్రభుత్వం 21 రోజులకు మార్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం నెలలు గడిచినా అన్నదాతకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. విక్రయించిన తరువాత రెండు వారాల వరకూ చాలా చోట్ల ఆన్లైన్లో నమోదు చేయటం లేదు. నమోదు చేసిన తర్వాతైనా 21 రోజుల్లో నగదు జమవుతుందా అంటే అదీ లేదు. రబీ సీజన్ ముగిసి ఖరీఫ్ కూడా పూర్తి కావస్తున్నా సొమ్ములు రాలేదంటే పరిస్థితి అర్థమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో రబీ బకాయిలు రూ.379 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరంతా 21 రోజులు దాటిన వారే. పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.249 కోట్లు బకాయిలున్నాయి. దాదాపు 10 వేల మందికి నగదు రావాల్సి ఉంది. ఏలూరులో 4వేల మంది రైతులకు రూ.130 కోట్ల బకాయిలున్నాయి. ఒకవైపు రబీకి చేసిన అప్పులు తీర్చ లేక..ఖరీఫ్కు కొత్తగా ఇచ్చేవారిని వెతుక్కుంటున్నారు. మొత్తం రుణాలకు వడ్డీలు కట్టాల్సి రావటం, మరోవైపు పాఠశాలలు మొదలు కావటంతో పిల్లల చదువులు, కుటుంబ నిర్వహణ.. ఇలా ఖర్చులు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
వలస వెళ్లిపోతాను... ‘15 ఎకరాలు వరిసాగు చేస్తున్నా. మే 6న ధాన్యాన్ని అమ్మాను. 100 రోజులు దాటినా ఇప్పటికీ నగదు చెల్లించలేదు. మొత్తం రూ.11.31 లక్షలు రావాలి. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఏ అధికారిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. అప్పు చేసి ప్రస్తుతం సాగు పనులు పూర్తిచేశాను. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. ఇలానే కొనసాగితే పొలం అమ్ముకుని తెలంగాణకు వలస వెళ్లిపోతాను’ అని ఆకివీడుకు చెందిన కేశిరెడ్డి ప్రశాంతబాబు వాపోయారు.
సాగు విరమించాలి
- మేకల బాబ్జి, రైతు, యనమదుర్రు
పదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. గడిచిన దాళ్వాకి సంబంధించి రూ.5.80లక్షలు రావాలి. నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోతే సాగు ఎలా చేయగలం. గత పంటకి సంబంధించిన తెచ్చిన అప్పులు చెల్లించే పరిస్థితి లేదు. సార్వా సాగు చేసేందుకు డబ్బులు లేవు. అందుకే ప్రస్తుత సీజన్లో సాగు విరమించుకున్నాను.
నెలలు గడుస్తున్నా సొమ్ముల ఊసే లేదు
-వి.సీ.శ్రీనివాస్, కౌలు రైతు, బ్రాహ్మణచెర్వు
మే నెలలో రబీ పంట ధాన్యం విక్రయించా. ఈ సొమ్ము రూ.5లక్షలు పైనే రావాలి. మూడు నెలలు పైనే కావస్తుంది కాని బ్యాంకులో సొమ్ము జమ కాలేదు. అప్పులు చేసి మరీ ఖరీఫ్కు పెట్టుబడులు పెట్టాం. ఈ అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి తప్ప ధాన్యం సొమ్ము మాత్రం రావడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే ఇక సాగు చేయడం అనవసరం.
అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టా..
-ఆదిరెడ్డి సన్యాసిరావు, రైతు, పెనుమంట్ర
పంట పండించడం కంటే ధాన్యం అమ్మి సొమ్ము పొందడమే కష్టం. మూడు నెలల నాడు ధాన్యం అమ్మాను. సొంత, కౌలు భూములు సాగు చేస్తున్నా. సుమారు రూ.5 లక్షల పైబడి సొమ్ము రావాలి. కనీసం ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ డబ్బు వస్తుంది కదా అని ఖరీఫ్కు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టాను.
త్వరలో జమవుతాయి
ధాన్యం బకాయిలున్న విషయం వాస్తవం. జిల్లాలో చేయాల్సిన ప్రక్రియ పూర్తి అయింది. కేంద్రం నుంచే నగదు రావాల్సి ఉంది. ధాన్యం బకాయిలు నాలుగైదు రోజుల్లో విడుదల అవుతాయి అని పశ్చిమ గోదావరి జిల్లా జేసీ జేవి మురళి, ఏలూరు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె.మంజుభార్గవి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రొయ్యకు ‘జగన్ వైరస్’
[ 09-05-2024]
రొయ్యల పంటకు వైరస్ల బెడద ఎక్కువ. వాటి ప్రభావం గుర్తించేలోపే చెరువులో రొయ్యలన్నీ కళ్లు తేలేస్తాయి. -
ఇదేనా మహిళా సాధికారత.. జగన్
[ 09-05-2024]
మహిళల్లో మార్కెటింగ్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నరసాపురంలో ఏర్పాటుచేసిన లేస్పార్కును వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం -
సీసాలో భూతం
[ 09-05-2024]
నాసిరకం మద్యం తాగి పేదలు ప్రాణాలు మీదకు తెచ్చుకొంటున్నారు. కాలేయం, మూత్రపిండాలు, మెదడు సంబంధిత అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. -
కొల్లేరు రాజ్యంలో అరాచకాసురుడు
[ 09-05-2024]
అది ప్రశాంత కొల్లేరు ప్రాంతం.. ఆ నేతను ఎన్నుకోవడంతో అరాచక రాజ్యంగా మారింది. హింసాత్మక ధోరణి చెలరేగింది. ప్రశ్నిస్తే దౌర్జన్య కాండకు పాల్పడటం.. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం ఆ నేత నైజం. -
జనసేనానికి నీరాజనం
[ 09-05-2024]
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. -
మీ పాలనలో రోజూ అమావాస్యే
[ 09-05-2024]
జగనన్న జమానాలో నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రివేళ వెలుగులు కనుమరుగై... చీకట్లు రాజ్యమేలుతున్నాయి. -
ఖాకీలపై కాఠిన్యం
[ 09-05-2024]
నిత్యం పని ఒత్తిడి ఎదుర్కొంటూ.. కుటుంబానికి దూరంగా విధులు నిర్వర్తిస్తూ.. బాధితులకు భరోసానిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు పోలీసులు. -
మీ వెంకీ మామగా కోరుతున్నా
[ 09-05-2024]
కైకలూరు నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఈ నెల 13వ తేదీన ప్రజలంతా బాధ్యతాయుతంగా కామినేని శీను మావయ్యకు ఓటేసి గెలిపించాలని ప్రముఖ సినీ కథానాయకుడు దగ్గుపాటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. -
బీమాలోనూ జగన్మాయ
[ 09-05-2024]
యజమాని ఆకస్మిక మరణంతో ఆదరవు కోల్పోయిన కుటుంబాలకు భరోసా కల్పించిన చంద్రన్న బీమాపై జగన్ ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. -
త్వరలోనే టిడ్కో గృహాలు కేటాయిస్తాం
[ 09-05-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అధికారంలోకి రాగానే భీమవరానికి పూర్వ వైభవం తీసుకొస్తాుని ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వô్మ పేర్కొన్నారు. -
‘ప్రజల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర’
[ 09-05-2024]
ప్రజల ఆస్తులను గుప్పెట్లో పెట్టుకుని స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చారని తెదేపా సీనియర్ నాయకుడు భూపతిరాజు తిమ్మరాజు, -
పోలింగ్ కేంద్రానికి పచ్చ రంగు
[ 09-05-2024]
కట్టా సుబ్బారావుతోటలో పోలింగ్ కేంద్రానికి (సామాజిక భవనం) అధికారులు ఆకుపచ్చ రంగు వేయించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
నోటా.. వచ్చిందిలా
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా