చాణక్యం
రాజ్య పాలనలో (రాజ)దండం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది పాలకుడి ఆధిపత్యానికి చిహ్నం. దానికి స్వ,పర భేదం ఉండదు. కాబట్టి రాజనీతికి దండనీతి అని పేరు. దండనీతినే అర్థనీతి లేదా అర్థశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారతం చెబుతోంది. మనుషుల జీవితాలకు మూలం ధనం(అర్థం).
రాజ్య పాలనలో (రాజ)దండం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది పాలకుడి ఆధిపత్యానికి చిహ్నం. దానికి స్వ,పర భేదం ఉండదు. కాబట్టి రాజనీతికి దండనీతి అని పేరు. దండనీతినే అర్థనీతి లేదా అర్థశాస్త్రమనే పేరుతో పిలిచేవారని మహాభారతం చెబుతోంది. మనుషుల జీవితాలకు మూలం ధనం(అర్థం). ఆనాటి ధనం భూమే. భూమిని సంపాదించే, పాలించే ఉపాయాలు, తెలిపే శాస్త్రం కాబట్టి అర్థశాస్త్రం అయింది. దాన్ని రచించిన వాడు చాణక్యుడు.
భూమిని సమకూర్చుకోవడం, రక్షించుకోవడం, వృద్ధి చేసుకోవడం, దాన్ని మంచివారి చేతుల్లో ఉంచడం, సుపరిపాలన జరిగేటట్లు చూడటం... అనే విషయాలు కూలంకషంగా చెప్పినవాడు చాణక్యుడు. స్వయంగా అధ్యాపకుడైన తండ్రి చణకుడి పర్యవేక్షణలో చాణక్యుడు రాజనీతి కోవిదుడిగా, నైతిక బోధకుడిగా, ఆర్థికవేత్తగా ఎదిగాడు.
పాలకులు, ప్రతి పౌరుడి యోగ క్షేమాలకు ప్రాధాన్యమిచ్చే పాలనా విధానాన్ని అవలంబించి, శాంతి సౌభాగ్యాలను వర్ధిల్లజేయడానికి అనుసరించవలసిన పద్ధతులను విపులంగా వివరించాడు.
‘తన మీద తనకుండే నమ్మకం, శత్రువును భయపెడుతుంది. అపనమ్మకం, శత్రువు బలాన్ని పెంచుతుంది. కాబట్టి పాలకుడు తన శక్తి యుక్తుల మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే ‘అధర్మాన్ని నాశనం చేయడానికి, ఎటువంటి మార్గాన్నైనా అనుసరించగలడు’ అనే మాట పాలకులకే కాకుండా ఇతరులకు సైతం స్ఫూర్తిదాయకమవుతుంది.
కుటిలం అంటే కొంటెతనం, మోసం అనే అర్థాలున్నాయి. రాజనీతి కోవిదుడు కాబట్టి రాజ్య/ ప్రజా సంరక్షణ కోసం అవసరమైతే కుటిలత్వాన్ని అనుసరించ వచ్చు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, అనుసరించినవాడు కావడంతో చాణక్యుణ్ని కౌటిల్యుడనీ పిలుస్తారు. విష్ణుగుప్తుడు అనే మరో పేరూ ఉంది.
‘కాలాన్ని వృథా చేసేవారు, సరైన సమయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేనివారు ఎప్పటికీ విజయం సాధించలేరు’ అని విజయార్థులకు ఆయన మార్గదర్శనం చేశాడు.
కౌటిల్యుడి రచన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇందులో సామాన్య మానవ జీవితానికి సైతం ఉపయోగపడే అనేక అంశాలను పొందుపరచాడు.
‘మనిషి పుట్టుకతో కాకుండా, చేసే పనుల ద్వారా గొప్పవాడు అవుతాడు’ అని చెప్పిన ఆయనే, ‘గతంలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని కర్తవ్య బోధ చేశాడు.
వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడానికి సామ, దాన, భేద, దండోపాయాలను అనుసరించడం అనే సంప్రదాయాన్ని ప్రతిపాదించి, ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు చాణక్యుడే.
సామాన్యులు సైతం విజయం సాధించడానికి మార్గాలను సరళంగా చెప్పాడు. ఏ పనైనా మొదలు పెట్టే ముందు ‘ఈ పని ఎందుకు చేస్తున్నాం’ దీని ఫలితమేమిటి, ఇందులో విజయం సాధించగలనా... అనే మూడు ప్రశ్నలు వేసుకోవాలి’ అనేది వాటిలో ప్రధానమైనది.
ఆర్థిక విషయాల గురించి ఆయన చేసిన సూచనలు అనుసరించదగినవి. ‘సుఖమయ జీవితాన్ని పొందాలనుకునే వారు డబ్బు విలువ తప్పనిసరిగా తెలుసుకోవాలి’ అని బోధించాడు. దానితోపాటు ‘న్యాయ మార్గంలోనే ధనం సంపాదించాలి’ అనీ హెచ్చరించాడు.
ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ప్రత్యేకంగా ఉండరు. నీ నడవడే నీకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుందని ఉద్బోధించింది చాణక్యుడే.
- అయ్యగారి శ్రీనివాస రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా