అంచెలంచెలుగా...
అద్భుతాలనేవి మనిషి కోరికల్ని దేవుడు పర్యవేక్షిస్తుండటం వల్ల జరగడం లేదు. మనిషి దేవుడి సంకల్పాలను తెలుసుకుంటూ సత్ప్రవర్తనతో సానుకూల దృక్పథంతో నడుచుకోవడం వల్ల జరుగుతాయి. సృష్టిలో మనిషికి ఒక విశిష్ట స్థానముంది. అతడు సృష్టించి, విడిచిపెట్టి, ఆ తరవాత అమరత్వాన్ని పొందగలడు.
అద్భుతాలనేవి మనిషి కోరికల్ని దేవుడు పర్యవేక్షిస్తుండటం వల్ల జరగడం లేదు. మనిషి దేవుడి సంకల్పాలను తెలుసుకుంటూ సత్ప్రవర్తనతో సానుకూల దృక్పథంతో నడుచుకోవడం వల్ల జరుగుతాయి. సృష్టిలో మనిషికి ఒక విశిష్ట స్థానముంది. అతడు సృష్టించి, విడిచిపెట్టి, ఆ తరవాత అమరత్వాన్ని పొందగలడు. ఈ ప్రపంచాన్ని అద్భుతంగా, స్వర్గతుల్యంగా, అంతా ఆనందంగా జీవించగలిగేలా చేయగలిగే సామర్థ్యాన్ని, నిగూఢశక్తుల్ని ఆ భగవంతుడు మనిషికి ప్రసాదించాడు. అవి సద్వినియోగమయ్యేలా అతడి వివేకం పనిచేయాలి.
రెక్కలు లేని పక్షులు ఎగరలేవు. ఎగరలేని పక్షుల్ని ఊహించలేం. అలాగే మనుషుల విషయం కూడా. దైవం మనిషికి కనిపించే రెక్కల్ని ఇవ్వకపోయినా, ఊహల రెక్కల్ని, తెలియని గమ్యాలను శోధించే సంకల్పాన్నీ ప్రసాదించాడు. సహజంగా ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఏదో రకమైన ప్రతిభ ఉంటుంది. ఎవరో వచ్చి సరైన మార్గం చూపించేంతవరకు ఏళ్ల తరబడి అది బహిర్గతం కాకపోవచ్చు. అంతవరకూ జీవితం అసంపూర్ణంగా తోస్తుంది. ఎవరూ జీవితంలో పదేపదే పడిపోవడాన్ని కోరుకోరు. పడిపోయి లేవడం జరిగినప్పుడే నేర్చుకోవడం మొదలవుతుంది. ఆటలోనైనా, జీవితం లోనైనా అపజయాలు లేకపోతే జయం విలువ తెలియదు.
నాకు ‘రేపు’ అంటే భయంలేదు. ఎందుకంటే ‘నిన్న’ చూసేశాను. అందుకే ‘ఈరోజు’ను ప్రేమిస్తున్నాను అనే ఆలో చన మనిషికి ఉండాలి. ఎవరైతే అన్ని జీవరాశులను తనలోను, తనను ఇతర జీవరాశుల్లోను చూడగలుగుతారో వారికి బతుకులో భయం ఉండదు అనేది ఈశోపనిషత్తు వాక్యం.
భూమి లోపలి పొరల్లో బంగారంతో పాటు రాళ్లూ ఉంటాయి. అవి భూమిలో నిక్షిప్తమై ఉన్నంతవరకు రెండింటికీ విలువలో తేడా ఉండదు. వాటిని వెలికితీసినప్పుడే దేని విలువ ఎంతో అర్థమవుతుంది. అలాగే మనిషికి మనిషికి మధ్య తేడా అన్నది వారిలో నిద్రాణమైన శక్తి బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది. ప్రతి మనిషీ నిద్రిస్తున్న అగ్నిపర్వతం. అద్భుతాన్ని దాచుకున్న విత్తనం.
జన్మించడం, మరణించడం మనం చేసుకునే ఎంపిక కాదు. కానీ ఎలా జీవించాలి అన్నది కచ్చితంగా మనిషి చేసుకునే ఎంపికే.
అదృష్టం, దురదృష్టం అనేవి మనిషి చూసే దృక్పథంలో ఉంటాయి. మనిషి అంచెలంచెల ఎదుగుదల దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఆత్మావగాహన మనిషిలోని లోపలిగొంతుకు ప్రాణాన్నిస్తుంది. అది తిరిగి బతుకునిస్తుంది. అనుభవం సంపాదించడం అనేది జీవితంలో ఒక్కో మెట్టూ ఎక్కినప్పుడు సాధ్యపడుతుంది. ఎక్కే ప్రయత్నం చేయకుండా శిఖరం చేరుకోవడం అసాధ్యం.
భౌతిక ఉన్నతి మొదటి అంతస్తు. అది ‘ఇంకా కావాలి’ అన్నచోట వదిలిపెడుతుంది. ఎప్పుడూ పనిలో మునిగిపోయేలా చేస్తుంది. మేధాసంబంధమైన సంతృప్తి రెండో అంతస్తు. అసంతృప్తినే కలిగిస్తుంది. మనిషి నిరంతరం అన్వేషిస్తూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల మూడో అంతస్తు. ‘నాకు అన్నీ ఉన్నాయి’ అన్న భరోసాను కలిగిస్తుంది. ఈ అనుభవం మనిషికున్న జ్ఞానాన్ని ధ్రువీకరిస్తుంది. అప్పుడు మనిషి అన్వయించుకోవడం మొదలుపెడతాడు. మనిషికి ఒక్కడికే ఆ అవకాశం ఉంది. జీవితంలో మనిషికి ఎప్పుడూ ప్రతి దశలోనూ ఎదురయ్యే ప్రశ్న- ‘తరవాత ఏమిటి’. ఇదే నిచ్చెనపై ఒక్కో మెట్టూ ఎక్కేందుకు మంత్రం.
వృక్షానికి ఉండే శక్తి, దాని వేళ్లు ఎంత లోతుగా ఉన్నాయన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఉన్నతమైన పరిపక్వత కలగాలంటే విశ్వాసం అవసరం. విశ్వాసం అంటే కంటికి కనిపించనిదాన్ని యథార్థంగా భావించి స్వీకరించే శక్తి. ‘విశ్వాసం’ ద్వారం గుండా అనంతమైన మేధకు సంబంధించిన విశ్వశక్తిని నియంత్రణలోకి తెచ్చుకుని ఉపయోగించుకుంటాడు మనిషి. విశ్వాసం విషయంలో మనిషి ఎంత లోతుల్లోకి వెడితే అంత ఎత్తులు చేరుకోవచ్చు.
- మంత్రవాది మహేశ్వర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం