కావ్ కావ్... అంతరార్థం ఏమిటి?
కాకి పేరు వినగానే సాధారణంగా చాలామందికి జుగుప్స కలుగుతుంది. చిరాకు పడతారు. సాధారణంగా చాలామంది పట్టించుకోరు. ఇదీ కాకుల పట్ల మానవుల భావన. కానీ... ‘గ్రహించగలిగితే సృష్టిలోని ప్రతి అణువూ బోధన చేస్తుంది’ అన్న కవి వాక్కులోని పరమార్థం- కాకుల ప్రవర్తనను పరిశీలించిన వారికి తెలుస్తుంది.
కాకి పేరు వినగానే సాధారణంగా చాలామందికి జుగుప్స కలుగుతుంది. చిరాకు పడతారు. సాధారణంగా చాలామంది పట్టించుకోరు. ఇదీ కాకుల పట్ల మానవుల భావన. కానీ... ‘గ్రహించగలిగితే సృష్టిలోని ప్రతి అణువూ బోధన చేస్తుంది’ అన్న కవి వాక్కులోని పరమార్థం- కాకుల ప్రవర్తనను పరిశీలించిన వారికి తెలుస్తుంది.
కాకి ఒక నల్లని సాధారణ పక్షి. దీన్ని సంస్కృతంలో వాయసం అంటారు. కాకులు సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. వీటిని ఎవరూ ప్రత్యేకంగా పెంచరు. అయినా పెంపుడు ప్రాణుల్లాగా ఇళ్ల పరిసరాల్లోనే మెలగుతుంటాయి. భారతీయ పురాణాల్లో కాకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇది శనిదేవుడి వాహనంగా పురాణాలు పేర్కొన్నాయి. ఈ కారణంగా కొన్నిచోట్ల వీటికి పూజలు సైతం చేస్తుంటారు.
ఒకసారి యముడు రావణుడి దుశ్చర్యలకు భయపడి కాకి రూపాన్ని ధరించాడట. అందువల్ల ఇతర దేవతలకు కొద్దో గొప్పో హాని కలిగినా అతడికి ఏమీ కాలేదట. అందుకు కృతజ్ఞతగా యముడు కాకులకు రెండు వరాలిచ్చాడంటారు. అవేమిటంటే... యుముడు ప్రాణులన్నింటికీ రోగాలను, వాటి ద్వారా మరణాన్ని కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అయినప్పటికీ తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించి రక్షణ పొందినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావని వరమిచ్చాడట యముడు. యమలోకంలో నరక బాధలను అనుభవించేవారి బంధు వులు, అలా మరణించినవారికి సమర్పించే భోజనాన్ని (పిండాల రూపంలో) కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందనే మరొక వరాన్ని ఇచ్చాడట. అందువల్లనే ఈ నాటికీ పితృకర్మల సమయంలో కాకులకు పిండాలు పెడు తున్నారంటారు పౌరాణికులు.
కాకి అరుపులతో చాలామందికి చిరాకు కలుగుతుంది. కానీ ఆ అరుపుల్లోనే వేదాంత బోధన ఉందని ఒక కవి పద్యరూపంలో చమత్కారంగా చెప్పాడు.
‘జీవితంలో ఏ క్షణాలూ సుస్థిరమైనవి కావు. అంతలోనే సమసిపోతాయి. సంపదలు, వాటివల్ల వచ్చే సుఖాలు స్థిరమైనవి కావు. అవి నశించిపోతాయి. మేడలు, మిద్దెలు, అందాలు, ఐశ్వర్యాలు స్థిరమైనవి కావు. అవన్నీ కరిగిపోతాయి. దానికి ఉదాహరణ ఈ గోరీయే అని ఒక సుల్తాన్ గోరీమీద కూర్చుని కాకి అందరికీ బోధన చేస్తోంది’ అని ఒక కవి చక్కగా కాకి అరుపును సమర్థించాడు. కావు కావుమని అరిచే కాకి కూతను జీవిత సత్యాలను బోధించిన విధంగా చెప్పిన ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందింది.
కాకికి ఉన్న ఉపకార గుణం ప్రశంసించ దగ్గదంటారు మానవతావాదులు. అందరినీ మైమరపిస్తూ, గానం చేసే కోయిలకు తన గూటిలోనే జన్మనిస్తుంది కాకి. అలాగే మానవుడిగా జన్మించినందువల్ల అవసరమైనప్పుడు తమ సహజమైన మానవీయతను ప్రదర్శించడం కనీస ధర్మం అంటారు.
తమకు దొరికిన కొద్దిపాటి ఆహారాన్నైనా అందరితోనూ పంచుకోవడానికే ప్రాధాన్యమిస్తాయి కాకులు. ఆ క్రమంలోనే ఆహారం కనబడగానే ఆతృతగా మిగతా కాకులను రమ్మని పిలుస్తాయట అవి. ఈ గుణాన్ని చూసి ఐకమత్య భావనను, పంచుకునే అలవాటును పెంచుకోవాలంటారు బోధకులు. కాకులు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి.
అయ్యగారి శ్రీనివాసరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు.
తాజా వార్తలు (Latest News)
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)