రాత్రి వేళ బయటికొస్తే కేసులే!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ శనివారం నుంచి అమలులోకి వచ్చింది.
అనుమతి ఉన్నవారికి గుర్తింపు కార్డు తప్పనిసరి!
రాత్రి కర్ఫ్యూపై నిబంధనల ఖరారు
శనివారం నుంచే అమల్లోకొచ్చిన ఆంక్షలు
ఈనాడు డిజిటల్, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ శనివారం నుంచి అమలులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం పలు నిబంధనలతో కూడిన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. ప్రతిరోజూ.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం అయిదింటి వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ సమయంలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఔషధ దుకాణాలు, అత్యవసర సేవలందించే సంస్థలు తప్ప మిగిలిన అన్ని కార్యాలయాలు, సంస్థలు, రెస్టారెంట్లు.. మూసి వేయాలని ఆదేశించింది. ఈ సమయంలో జనం కూడా అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని సూచించింది.
ఎవరెవరికి సడలింపు
* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీ, సంబంధిత సేవలు, పెట్రోలు, గ్యాస్ బంకులు, విద్యుత్ సంస్థలు, నీటి సరఫరా, శానిటేషన్ సంస్థలు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్లు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, నిరంతరం సాగాల్సిన సేవలకు సంబంధించిన తయారీ కేంద్రాలు, ఫుడ్ డెలివరీ సర్వీసులు వంటి వాటిలో పనిచేసే వారు బయట తిరగొచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, అత్యవసర సేవల ఉద్యోగులు... సరైన డ్యూటీ, ఐడీ కార్డులను చూపించి అవసరముంటేనే బయట తిరగొచ్చు.
* వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, హాస్పిటాలిటీ సేవల సిబ్బంది గుర్తింపు కార్డులతో తిరగొచ్చు.
* గర్భిణులు, వైద్య సేవలవసరమైన రోగులు బయటకు రావొచ్చు.
* ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు రాకపోకలు జరిపే వారు... సరైన గుర్తింపు కార్డు చూపించాలి.
* రాష్ట్రంలో, రాష్ట్రం బయటకు గూడ్స్ సరఫరాపై ఎలాంటి ఆంక్షలూ లేవు.
* ఆటోలు, టాక్సీలు ఇతర ప్రజా రవాణా వాహనాలు.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. కర్ఫ్యూ సయయంలో పైన పేర్కొన్న వారి కోసం పనిచేయొచ్చు.
ఎప్పటి వరకు...: ఆంక్షల సడలింపుపై తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి. నిబంధనలను అతిక్రమిస్తే.. విపత్తు నిర్వహణ చట్టం-2005 సెక్షన్ 51, 60, ఐపీసీ 188, తదితర చట్టాల కింద కేసులు పెట్టే అవకాశముంది.
అంతటా రాత్రి కర్ఫ్యూ
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి పది గంటలకు రాత్రి కర్ఫ్యూ మొదలైంది. మొదటి రోజు కావడంతో ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరో రోజు ప్రచారం కల్పించి ఆపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పలు చోట్ల వాహనాలను దారి మళ్లించారు. కొన్నిచోట్ల బారికేడ్లతో దారులు మూసివేశారు. విజయవాడలోని ప్రధాన కేంద్రాలు.. బెంజి సర్కిల్, కాళేశ్వరరావు మార్కెట్, బిసెంట్ రోడ్డు వంటి ప్రాంతాల్లో పోలీసులు దుకాణాలను మూసేయించారు. రాత్రి 11వరకూ దుకాణాలు తెరిచి ఉండే బిసెంట్ రోడ్డు తొమ్మిదింటికే నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ బస్సులను సైతం జాతీయ రహదారి వైపు దారి మళ్లించారు. విశాఖలోని ప్రధాన కూడళ్ల వద్ద రాత్రి తొమ్మిదింటినుంచే జనం రాకపోకలు తగ్గాయి. శ్రీకాకుళంలో పది తరువాత జనం పెద్దగా బయటకు రాలేదు. సాయంత్రం ఆరింటికే కొందరు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో సైతం ఎనిమిదింటి తరువాత దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. అనంతపురంలో సైతం కర్ఫ్యూ ఆంక్షలతో రోడ్లు నిర్మానుష్యమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం