Azadi Ka Amrit Mahotsav: కోల్కతా నుంచి దిల్లీకి మార్చి..
బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశ రాజధాని మార్పు ఒకింత కలకలం సృష్టించింది. లార్డ్ కర్జన్లాంటి అనేక మంది వద్దని చెప్పినా... 1911లో రాజధానిని కోల్కతా నుంచి దిల్లీకి మార్చారు. భారత్లో తమ
బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో దేశ రాజధాని మార్పు ఒకింత కలకలం సృష్టించింది. లార్డ్ కర్జన్లాంటి అనేక మంది వద్దని చెప్పినా... 1911లో రాజధానిని కోల్కతా నుంచి దిల్లీకి మార్చారు. భారత్లో తమ పాలనను శాశ్వతంగా పదిల పర్చుకోవటానికి దిల్లీ కేంద్రమైతే బాగుంటుందనుకున్నారు. కానీ కొత్త దిల్లీ ఉదయించిన కొన్నాళ్లకే... బ్రిటిష్ సామ్రాజ్యంపై రవి అస్తమించించటం యాదృచ్ఛికం!
భారత్లో అడుగుపెట్టిన నాటి నుంచీ కోల్కతా కేంద్రంగా పాలించిన ఆంగ్లేయులు... అక్కడే తమ ముద్రలన్నీ వేశారు. భవంతుల నుంచి మొదలెడితే... చదువుల దాకా, వలస రాజ్య లక్షణాలన్నీ అడుగడుగునా కన్పించే కేంద్రంగా కోల్కతా మారింది. జాతీయ కాంగ్రెస్ రూపంలో ఉద్యమం ఆరంభమైనా... తమ విభజించు పాలించు సూత్రం ముందు అదేమంతగా ఆందోళన చెందాల్సిన అంశంగా వారికి కనిపించలేదు. భారత్లోని పీత రాజకీయాలు, మతాలు, కులాల రూపంలో తమకు అందుబాటులో ఉన్న ‘విభజన’ అవకాశాలు- తెల్లవారిలో ధైర్యాన్ని నింపాయి. భారత్ను శాశ్వతంగా ఏలటానికి ఎత్తుగడలు వేశారు. అందులో భాగంగా రాజధానిని కోల్కతా నుంచి దిల్లీకి మార్చారు.
వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ ఇందుకు ముందస్తు ఏర్పాట్లు చేశాడు. 1911లో బ్రిటన్ చక్రవర్తి జార్జ్-5 గౌరవార్థం దిల్లీలో ఘనంగా దిల్లీ దర్బార్ ఏర్పాటు చేశారు. అంతకుముందు కూడా మూడుసార్లు దర్బార్లు జరిగినా... బ్రిటన్ చక్రవర్తి స్వయంగా హాజరవటం ఇదే తొలిసారి. ఆ సందర్భంగానే... 1911 డిసెంబరు 12న చక్రవర్తి జార్జ్ ఉన్నట్టుండి రాజధాని మార్పును ప్రకటించారు. ఇకమీదట భారత్లో బ్రిటిష్ పాలన కోల్కతా కాకుండా దిల్లీ నుంచి జరుగుతుందంటూ ఆయన చేసిన ప్రకటన యావద్దేశాన్ని ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఆంగ్లేయుల్లోనూ చాలామంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బెంగాల్ను విభజించిన వైస్రాయ్ లార్డ్ కర్జన్ బహిరంగంగానే తన అసంతృప్తిని ప్రకటించాడు. ‘‘కోల్కతా నుంచి బ్రిటిష్ పాలనను దిల్లీకి మార్చటం ప్రభుత్వానికి ప్రమాదకరమని భావిస్తున్నాను’’ అని హెచ్చరించాడు కూడా!
స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమైనా... భారత్లో తమ అధికార స్థిరత్వానికి రాజధాని మార్పు కీలకమని బ్రిటన్ ప్రభుత్వం బలంగా నమ్మింది. మొఘలుల నాటి నుంచి రాజధానిగా ఉండటం వల్ల దిల్లీ రాజకీయ వాతావరణం కూడా అందుకు అనువుగా ఉంటుందనుకుంది. భారత్పై సుదీర్ఘ పట్టుకు దిల్లీ నుంచి పాలన తోడ్పడుతుందనుకుంది. బెంగాల్లో విప్లవవాదం పెరగటం కూడా తెల్లవారికి కాసింత చికాకుగా మారింది. వెరసి... ఇవన్నీ కలసి దిల్లీ దిశగా నడిపించాయి.
దర్బార్లో ప్రకటన వెలువరించిన వెంటనే... చక్రవర్తి జార్జ్, రాణి మేరీలు... కొత్త రాజధానికి శంకుస్థాపన కూడా చేసేశారు. నాలుగేళ్లలో కొత్త దిల్లీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ తొలి ప్రపంచ యుద్ధంతో... నిధులు కేటాయించలేక పని సాగిలపడింది. ఫలితంగా... 1931 నాటికిగాని కొత్త దిల్లీ నిర్మాణం పూర్తికాలేదు. సరికొత్త భవంతులు, పట్టణ నిర్మాణంతో భారత్పై తమ పట్టు ఇప్పట్లో తొలగేది కాదని ఆంగ్లేయులు పరోక్షంగా సంకేతాలు పంపించారు. కొన్నేళ్ల తర్వాత లండన్లో జరిగిన ఓ సమావేశానంతరం... జవహర్లాల్ నెహ్రూ... అప్పటి వైస్రాయి లార్డ్ లిన్లిత్గోల మధ్య వాడీవేడీ సంవాదంలో ఆ విషయం ప్రస్ఫుటమైంది. ‘చూడండి... పదేళ్లలో మేం స్వాతంత్య్రం సాధించుకొని తీరతాం’ అని నెహ్రూ ఆగ్రహంగా అనటంతో... ‘అబ్బే... అది సాధ్యంగాని పని. నేనూ మీరు బతికుండగా... మన జీవితకాలంలో భారత్కు స్వాతంత్య్రం రావటం కల్ల’ అని వైస్రాయ్ లిన్లిత్గో బదులిచ్చారు.
కానీ... చివరకు కర్జన్ హెచ్చరికే నిజమైంది. అధికారాన్ని సుస్థిరం చేసుకుందామని కొత్త దిల్లీకి మారిన కొన్నేళ్లకు... రవి అస్తమించనిదనుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం... అంతరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM