Covid Effect: తుంటికీలుపై కొవిడ్ దెబ్బ
చిన్నవయసులోనే తుంటికీలు అరిగిపోవడం ‘అవాస్క్యులర్ నెక్రొసిస్’ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో 95 శాతం మంది పురుషులే ఉంటున్నారు.
స్టెరాయిడ్స్ వాడకంతో దుష్ప్రభావం
అవాస్క్యులర్ నెక్రోసిస్ వ్యాధి బారిన బాధితులు
20-50 ఏళ్ల వయసులోనే కీలు అరుగుదల
బాధితుల్లో 95 శాతం పురుషులే
నాలుగోదశలోనే కీలు మార్పిడి అవసరమంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్
చిన్నవయసులోనే తుంటికీలు అరిగిపోవడం ‘అవాస్క్యులర్ నెక్రొసిస్’ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో 95 శాతం మంది పురుషులే ఉంటున్నారు.
కరీంనగర్కు చెందిన ఒక వ్యక్తి (43) రెండోదశ కొవిడ్ ఉద్ధృతిలో వైరస్ బారినపడ్డాడు. హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో సుమారు మూడు వారాలు చికిత్స పొందాడు. ఐసీయూలోనే ఆక్సిజన్ సాయంతో 12 రోజులున్నాడు. ఆ సమయంలో వైద్యులు స్టెరాయిడ్స్ సహా ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చారు. ఎట్టకేలకు ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ గత రెండు నెలలుగా తుంటి దగ్గర విపరీతంగా నొప్పి పెడుతుండడంతో నిమ్స్ ఆర్ధోపెడిక్స్ విభాగంలో సంప్రదించాడు. ఎక్స్రే తీసిన వైద్యులు తుంటికీలు అరుగుదల రెండోదశలో ఉందని నిర్ధరించారు. సాధారణంగా 60-70 ఏళ్లు దాటిన వారికొచ్చే తుంటికీలు అరుగుదల ఇంత చిన్న వయసులో రావడంతో బాధితుడు, వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. లోతుగా విశ్లేషించగా.. ఇది కొవిడ్ చికిత్సానంతర దుష్ప్రభావమని తేలింది.
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. దాని కారణంగా వచ్చే బాధలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. కంటి నుంచి కాలి వరకూ అన్ని అవయవాలపైనా దుష్ప్రభావాలు కనిపిస్తూనే ఉన్నాయి. మోతాదుకు మించి స్టెరాయిడ్ చికిత్స పొందిన రోగుల్లో తాజాగా తుంటికీలు సమస్య తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కొవిడ్ రెండోదశ ఉద్ధృతి 2021 మార్చిలో మొదలై.. ఏప్రిల్-ఆగస్టు వరకూ ఉద్ధృతంగా కొనసాగింది. వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడున్న పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ చికిత్స అనివార్యమైంది. కానీ వాటిని విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ఫంగస్) జబ్బు బారినపడి.. కనుగుడ్డు తీయాల్సి వచ్చిన బాధితులు కూడా వేలల్లో నమోదయ్యారు. ఇప్పుడు ఆ బాధల్లో తుంటికీలు కూడా చేరింది. ఏడాది కిందట వాడిన స్టెరాయిడ్స్ ప్రభావం ఇప్పుడు బయటపడుతోంది.
రోబోటిక్ సర్జరీతో మెరుగైన ఫలితాలు
- డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, సన్షైన్ హాస్పిటల్స్.
కొవిడ్లో స్టెరాయిడ్స్ ఇచ్చిన వారిలో కొందరికి తుంటికీలులో ఈ వ్యాధి కనిపిస్తోంది. స్టెరాయిడ్స్ వాడిన ప్రతి ఒక్కరికీ వస్తుందని చెప్పలేం. రోజూ ఓపీలో కనీసం 2-3 కేసులొస్తున్నాయి. గత రెండు నెలల్లోనే దాదాపు 100 మందికి పైగా వచ్చారు. వీరిలో అత్యధికులు 20-40 ఏళ్ల మధ్య వయసు వారే. 95 శాతానికి పైగా పురుషులే. ప్రస్తుతం రెండు, మూడు దశలకు చేరిన తుంటికీలు సమస్యతో వస్తున్నారు. వీరికి ఎప్పుడు కీలు మార్పిడి అవసరమవుతుందనేది తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణ వయసు కంటే ముందే తుంటికీలు మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. నాలుగో దశలోకి చేరి, బాగా నడవలేని స్థితికి చేరుకున్నప్పుడు కీలు మార్చాల్సి వస్తుంది. రోబోటిక్ హిప్ రిప్లేస్మెంట్తో 100 శాతం కచ్చితత్వంతో ఆపరేషన్ చేయొచ్చు. అవాస్క్యులర్ నెక్రోసిస్ కారణంగా పోయిన రక్తప్రసరణ తిరిగి రాదు. మృదులాస్థి (కార్టిలేజ్) బలాన్ని కాపాడే మందులు మాత్రం వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది.
25 శాతం పెరిగిన బాధితులు
- ఆచార్య డాక్టర్ పి.చంద్రశేఖర్, ఆర్ధోపెడిక్స్, నిమ్స్
తుంటికీలు సమస్య రెండు, మూడు దశల్లో వచ్చిన రోగులకు.. ‘కోర్ డి కంప్రెషన్’ అనే చికిత్స చేస్తున్నాం. అంటే మోకీలు బంతిలోకి మల్టిపుల్ డ్రిల్లింగ్ ద్వారా రంధ్రాలు చేసి, రక్తప్రసరణ పెరగడానికి, వాపు తగ్గడానికి చికిత్స అందిస్తున్నాం. దీనివల్ల కొంత వరకూ కీలుమార్పిడిని వాయిదా వేయొచ్చు. సాధారణ తుంటి కీలు మార్పిడి రోగులతో పోల్చితే అదనంగా ఈ తరహా కేసుల సంఖ్య 25 శాతం పెరిగింది. ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడిన వారిపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తుంటికీలు మార్పిడిని సాధ్యమైనంత వరకూ వాయిదా వేసుకోవాలి. తప్పదు అనుకున్నప్పుడే చేయించుకోవాలి. ఈలోగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నేలపై కూర్చోవద్దు. మెట్లు ఎక్కడం, దిగడం తగ్గించుకోవాలి. పరుగెత్తకూడదు. మోకాళ్లపై కూర్చునే విధంగా భారతీయ మరుగుదొడ్డి విధానాన్ని వినియోగించొద్దు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేసుకోవాలి. నొప్పి ఉన్నా రోజూ పెయిన్కిల్లర్స్ వేసుకోవద్దు. వాటిని ఎక్కువగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదముంది. కాల్షియం, విటమిన్ డి వంటి మాత్రలు వైద్యుల సలహా మేరకు వాడుకోవాలి. సాధారణ ఆహారం తీసుకోవచ్చు. బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.
ఏమిటీ అవాస్య్కులర్ నెక్రోసిస్?
తుంటికీలులో బంతి, గిన్నె రెండూ ఉంటాయి. వీటికి రక్తప్రసరణ తగ్గిపోవడాన్నే ‘అవాస్క్యులర్ నెక్రోసిస్’ అంటారు. దానివల్ల అక్కడ కండరం చచ్చుబడిపోతుంది. క్రమేణా తుంటికీలులో అరుగుదల పెరుగుతుంది. నొప్పి అధికమవుతుంది. ఇందులో నాలుగు దశలుండగా.. నాలుగో దశలోకి చేరితే, నడవలేని స్థితి వస్తుంది. ఈ దశలోనే తుంటికీలు మార్పిడి అవసరమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం