శ్రీవారి సేవల్లో తప్పులు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపైఏం చేశారు?
శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్యకైంకర్యాల్లో తప్పులు జరుగుతున్నాయంటూ ఓ భక్తుడు ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తితిదేను ఆదేశించింది.
వారం రోజుల్లో చెప్పండి తితిదేకు సీజేఐ ఆదేశం
ఈనాడు, దిల్లీ: శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్యకైంకర్యాల్లో తప్పులు జరుగుతున్నాయంటూ ఓ భక్తుడు ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తితిదేను ఆదేశించింది. ఈ అంశంపై తన పిటిషన్ను కొట్టేసిన ఏపీ హైకోర్టు తీర్పును సవాల్చేస్తూ శ్రీవారి దాదా అనే భక్తుడు దాఖలుచేసిన ఎస్ఎల్పీపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాను వేంకటేశ్వరస్వామి భక్తుడినని, వైష్ణవ ఆలయాలపై పరిశోధనలు చేశానంటూ పిటిషనరే వ్యక్తిగతంగా వాదనలు వినిపించారు.
‘ఆలయంలో ఆగమశాస్త్ర విరుద్ధంగా చేస్తున్న నగ్నఅభిషేకాలు, అసంబద్ధమైన ఆర్జిత సేవలు, దర్శనాలను నిలువరించాలి. నా వాదనలను ఓపిగ్గా వినండి’ అని కోరారు. జస్టిస్ రమణ కల్పించుకుంటూ ‘మీరు బాలాజీ భక్తులే కదా. భక్తులకు ఓర్పు ఉండాలి. కానీ మీకది లేదు. ముందు మీరు మారాలి. తితిదే పవిత్రతను కాపాడాలన్న తాపత్రయం మాకూ ఉంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసి, దాన్ని విచారణకు స్వీకరించాలంటూ రోజూ రిజిస్ట్రీని బ్లాక్మెయిల్ చేయడమేంటి? చనిపోతానంటూ బెదిరించడమేంటి? ఇందులో అంత అత్యవసరమేముంది? కైంకర్యాల విషయంలో ఏ చట్టం కింద కోర్టులు జోక్యం చేసుకోవచ్చు? మీ ఇష్టానుసారం చెప్పడానికి ఇదేమి కచేరీ కోర్టుకాదు. మీ హక్కులకు ఎక్కడ ఉల్లంఘన జరిగిందో చెప్పండి’ అని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులకు భంగం కల్గుతోందని పిటిషనర్ చెప్పగా ‘ఏ ప్రాథమిక హక్కో చెప్పండి. పూజ ఎలా చేయాలి, ఎంతమందిని అనుమతించాలన్నది ప్రాథమిక హక్కా?’ అని జస్టిస్ రమణ ప్రశ్నించారు.
తీసుకున్న చర్యలేంటో చెప్పండి
అనంతరం సీజేఐ తితిదే తరఫు న్యాయవాదిని పిలిచి పిటిషనర్ 2020 మార్చి 28న తితిదేకు ఇచ్చిన వినతిపత్రంపై మీరేం చర్య తీసుకున్నారో చెప్పండని ఆదేశించారు. వ్యాజ్యంలోని అంశాలపై న్యాయవాది అభ్యంతరం చెప్పబోగా.. ‘ప్రస్తుతానికి ఆ విషయాలు పక్కనపెట్టండి. అతని ఫిర్యాదుపై మీరు తీసుకున్న చర్యలేంటో చెప్పండి. నాతో సహా.. ధర్మాసనంలోని న్యాయమూర్తులిద్దరూ స్వామి భక్తులే. సంప్రదాయాల ప్రకారమే దేవస్థానం పూజాదికాలు కొనసాగిస్తుందని మేం ఆశిస్తాం’ అని పేర్కొన్నారు. అన్ని పూజలూ ఆగమశాస్త్రం ప్రకారమే చేస్తున్నారని తితిదే న్యాయవాది చెప్పగా.. తొలుత పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్య తీసుకున్నారో చెప్పండంటూ న్యాయమూర్తి మళ్లీ గుర్తుచేశారు. అందుకు వారం రోజుల గడువు కావాలని న్యాయవాది కోరగా, సీజేఐ అంగీకరించారు.
తెలుగులో సంభాషణ
పిటిషనర్ పేరు శ్రీవారి దాదా అని ఉండడంపై ‘మీ అసలు పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని సీజేఐ ప్రశ్నించారు. తనది ప్రకాశం జిల్లా అని, తెలుగు వచ్చంటూ ఆయన బదులిచ్చారు. దీంతో సీజేఐ తెలుగులోనే మాట్లాడారు. తన పేరు ‘శ్రీవారి దాసాని దాసులు’ అని పిటిషనర్ చెప్పగా.. అలా చెప్పొచ్చు కదా, ఏదో ‘దాదా’లా చెబుతున్నారంటూ సీజేఐ సరదాగా వ్యాఖ్యానించారు. అధికారిక రిజిస్టర్లో తనపేరు శ్రీవారి దాదాగా ఉందని పిటిషనర్ విన్నవించారు. తర్వాత ధర్మాసనం ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేసేందుకు ఉత్తర్వులు ఇవ్వబోగా, పిటిషనర్ తన వాదనలను కొనసాగించే ప్రయత్నంచేశారు. ‘ఈ కేసు డిస్మిస్ చేయమంటారా? మీ ఫిర్యాదుపై తితిదే స్పందన తెలిపేందుకు వారం రోజులు ఆగలేరా?’ అంటూ జస్టిస్ రమణ ఆగ్రహించారు. అయినా పిటిషనర్ పదేపదే వివిధ అంశాలు ప్రస్తావించబోగా.. ‘తప్పుచేస్తే దేవుడు అందర్నీ శిక్షిస్తాడు. ఊరుకోడు. పూజలు ఎలా చేయాలన్నది తితిదే చూసుకుంటుంది. అవకాశం ఇచ్చాం కదా.. అని మీరు ఎక్కువ మాట్లాడొద్దు’ అని జస్టిస్ రమణ ఆగ్రహం వ్యక్తంచేస్తూ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు