పథకాలతో జీవనశైలి మారాలి
ప్రజాసేవ కోసమే పదవులు తప్ప, అధికారం చలాయించడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను సేవ చేయాలని కోరుకుంటున్నానే తప్ప, అధికారాన్ని కాదని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’
మన్ కీ బాత్లో ప్రధాని మోదీ
దిల్లీ: ప్రజాసేవ కోసమే పదవులు తప్ప, అధికారం చలాయించడానికి కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాను సేవ చేయాలని కోరుకుంటున్నానే తప్ప, అధికారాన్ని కాదని అన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ లబ్ధిదారుడు మోదీ అధికారంలో కొనసాగాలంటూ ఆకాంక్షించారు. దీనిపై స్పందిస్తూ ‘‘నేను ఈ రోజు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా ఉండాలని అనుకోవడం లేదు. సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నా. ప్రధాని పదవి అధికారం కోసం కాదు. సేవ చేయడం కోసమే’’ అని చెప్పారు. ప్రభుత్వ పథకాల కారణంగా జీవన విధానం మారితే అది చాలా సంతోషం కలిగిస్తుందని అన్నారు. ఆయుష్మాన్ భారత్తో తమ జీవితాలు మారాయని లబ్ధిదారులు ప్రధానికి వివరించారు.
మూడు అంశాల్లో విజృంభిస్తున్న యువత
దేశంలోని యువత అందిస్తున్న సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూడు అంశాలు....‘నవీన ఆవిష్కరణలు’, ‘రిస్కు తీసుకోవడంపై అనురక్తి’, ‘చేయగలమన్న విశ్వాసం’ వారిలో కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ మూడు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం అంతా అంకుర సంస్థలు (స్టార్ట్ అప్స్) గురించే మాట్లాడుతున్నారని, వీటికి భారత దేశం కేంద్ర స్థానంగా మారిందని తెలిపారు. ఏటా కొత్త అంకుర సంస్థలు వస్తున్నాయని, ఈ రంగం శీఘ్రంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. చిన్న పట్టణాల్లోనూ వీటిని నెలకొల్పుతున్నారని అన్నారు. 70కుపైగా అంకుర సంస్థల విలువ ఒక బిలియన్ డాలర్ల (రూ.7వేల కోట్లు)కు దాటిందని చెప్పారు. ‘‘ఇది గొప్ప విషయం. కరోనా ఉన్నప్పటికీ దేశ యువత ఈ విజయాన్ని సాధించారు. అంకుర సంస్థల ద్వారా ప్రపంచ సమస్యలకు కూడా వారు పరిష్కారం చూపుతున్నారు’’ అని ప్రశంసించారు. అంకుర సంస్థలు విజయం సాధిస్తుండడంతో దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. బస్సుల కాలుష్యాన్ని 40 శాతం మేర తగ్గించడానికి అంకుర సంస్థలను నెలకొల్పిన మయూర్ పాటిల్ అనే యువకునితో ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.90 లక్షల సాయంతో ఆయన ఆ సంస్థను ఏర్పాటు చేశాడు.
సాహసాలకు యుద్ధభూమే అవసరం లేదు
సాహసం చూపించడానికి యుద్ధభూమే అవసరం లేదని, అభివృధ్ధి కార్యక్రమాల్లోనూ వాటిని ప్రదర్శించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. బుందేల్ఖండ్లోని జలౌన్ ప్రాంత వాసులు ఎంతో శ్రమించి నూన్ నదిని పునరుద్ధరించారని చెప్పారు. తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో ఒక నది ప్రవహించేలా చేశారని తెలిపారు. మేఘాలయలో స్థానికులే ఓ నది నీటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నారని గుర్తుచేశారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రధాని మోదీ దేశవాసులను హెచ్చరించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అందరి బాధ్యత అంటూ అప్రమత్తం చేశారు.
ఆడియో, సంగీతం ప్లాట్ఫారాల్లో అందుబాటు
మన్ కీ బాత్ కేవలం రేడియా, టీవీ, యూట్యూబ్, నమో యాప్ ద్వారా మాత్రమే కాకుండా ఇకపై ఆడియో, మ్యూజిక్ ప్లాట్ఫారాల్లోనూ అందుబాటులోకి రానుంది. హంగామా, గానా, అమెజాన్ మ్యూజిక్, జియోసావన్, స్పోటిఫై, వింక్ వంటి ప్లాట్ఫారాల ద్వారా కూడా ప్రసారం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు