Sabari Express: పట్టాలపై ఇనుప రాడ్డు కట్టిన దుండగులు.. శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

సికింద్రాబాద్‌ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌(17230)కు ముప్పు తప్పింది.

Updated : 01 Nov 2022 12:12 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌(17230)కు ముప్పు తప్పింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు-గుంటూరు సెక్షన్‌ మధ్య రైలు పట్టాలపై ఉంచిన ఇనుపరాడ్డును చూసిన లోకోపైలెట్‌ మంజునాథ్‌ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. లేదంటే ఆ రాడ్డు విరిగి లోకో అడుగు భాగాన తగిలి మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. రైలు పరిమిత వేగంతో వెళ్తున్నందున ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండానే రైలును ఆపగలిగారు. ఇంజినీరింగ్‌ సిబ్బంది, సహాయ లోకోపైలెట్‌లు వెళ్లి ఆ రాడ్డును తొలగించిన అనంతరం రైలు గుంటూరు స్టేషన్‌కు చేరింది.

దుండగులు పథకం ప్రకారమే రైలు పట్టాలపై ఇనుపరాడ్డును ఉంచినట్లు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. రాడ్డును గుడ్డతో కట్టడంతో పాటు సిగ్నలింగ్‌ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్టముక్కలు పెట్టడం గమనార్హం. రైలు పట్టాలపై సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ఇటువంటి వాటిని గుర్తిస్తుంటారు. వారు ఆ మార్గాన తనిఖీ చేసుకుంటూ వెళ్లిన తర్వాత దీన్ని అమర్చి ఉండొచ్చని భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని