‘మెగా’ ప్రాజెక్టుకు దగా
ప్రకృతి అందాల నడుమ ఎత్తయిన కొండలపై చూడచక్కని గృహ సముదాయం నిర్మించాలన్న ప్రతిపాదన మూలకు చేరింది. సుమారు అయిదేళ్ల కిందట ప్రయత్నాలు జరగ్గా.. తర్వాత ఎలాంటి పురోగతి లేదు.
విశాఖపట్నంలో కొండెక్కిన ఇళ్ల పథకం
యారాడ భారీ గృహ సముదాయ ప్రణాళికపై నీలినీడలు
విశాఖపట్నం(గాజువాక), న్యూస్టుడే: ప్రకృతి అందాల నడుమ ఎత్తయిన కొండలపై చూడచక్కని గృహ సముదాయం నిర్మించాలన్న ప్రతిపాదన మూలకు చేరింది. సుమారు అయిదేళ్ల కిందట ప్రయత్నాలు జరగ్గా.. తర్వాత ఎలాంటి పురోగతి లేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో పెదగంట్యాడ- యారాడ సమీప కొండపై ఏర్పాటు చేయతలపెట్టిన మెగా గృహ సముదాయ ప్రాజెక్టు బృహత్తర ప్రణాళికను ప్రస్తుతం అటకెక్కించారు. ప్రతిపాదించిన స్థలం ముళ్ల కంపలు, తుప్పలతో వృథాగా మారింది. ఈ కొండపై 266 ఎకరాల విశాలమైన భూముల్లో 26 వేల గృహాలు నిర్మించే బృహత్తర ప్రాజెక్టుకు 2017లో నాటి యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. సర్వే నంబరు-274లోని 536 ఎకరాల కొండ పోరంబోకు భూములను రెవెన్యూశాఖ వీఎంఆర్డీఏకు అప్పగించింది. అందులో 266 ఎకరాల్లో పీఎంఏవై- ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం (అర్బన్) కింద గృహాలు నిర్మించేందుకు నిర్ణయించారు. నగరవ్యాప్తంగా గృహ పథకాల అమలుకు స్థలాల సమస్య ఉన్నందున జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నగరానికి దగ్గరగా ఉండే యారాడ కొండపై ఈ నిర్మాణాలకు ప్రతిపాదించారు. సమీపంలోనే భారీ సంఖ్యలో నేవీ క్వార్టర్లు ఉండడం.. కొండకు అగ్రభాగంలో మాత్రమే ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల పర్యావరణపరంగా ఇబ్బందులేవీ ఉండవని భావించారు. అప్పట్లోనే అంతా సిద్ధమైనా.. ప్రస్తుత ప్రభుత్వం దానిని పట్టించుకోకపోవడంతో చివరకు అది వృథా ప్రయాసగా మిగిలింది.
అన్ని హంగులతో నిర్మించేలా..
పెదగంట్యాడ సమీప దిబ్బపాలెం నుంచి యాతపాలెం మీదుగా యారాడ తీరానికి ప్రత్యామ్నాయంగా నాటి వుడా అధికారులు ఘాట్రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొండపై బొటానికల్ గార్డెన్ నిర్మించాలని నిర్ణయించారు. దాని సమీపంలోనే గృహ నిర్మాణానికి అనువుగా ఉంటుందని అప్పట్లో గుర్తించారు. ఆర్డీఓ తేజ్భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పెదగంట్యాడ తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, వీఎంఆర్డీఏ అధికారులు భూములను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. సర్వేయర్లను రంగంలోకి దింపి సుదీర్ఘంగా చర్చించారు. ‘జీప్లస్ త్రీ’ పద్ధతిలో గృహాల కోసం నెల రోజుల పాటు స్థలాలను చదును చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో మెగా ప్రాజెక్టు చేపట్టేలా సన్నాహాలు సాగాయి. తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రతిపాదన మూలకు చేరింది. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుత అధికారులు, పాలకులు ఆసక్తి చూపకపోవడమే దీనికి కారణమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రతిపాదన వల్లనే ఈ ప్రాజెక్టు నిర్ణయం వాయిదా పడిందని అధికారులు చెబుతున్నారు. ఇదే కొండకు మరోవైపున పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించిన 6 వేల టిడ్కో ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?