కేంద్రాన్ని చూసైనా నేర్చుకోరా?
పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా... ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాలు మెరుగుపడాలన్నా... రహదారులు, రైల్వేల వంటి ప్రధాన మౌలిక వసతులు అత్యంత కీలకం.
మౌలిక వసతుల కల్పనపై జగన్ ప్రభుత్వానికి శ్రద్ధేది?
రైల్వేలు, రహదారులకు ఏటా కేటాయింపులు పెంచుతున్న కేంద్రం
రాష్ట్రంలో దానికి పూర్తి భిన్నమైన పరిస్థితి
ఈనాడు, అమరావతి: పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా... ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాలు మెరుగుపడాలన్నా... రహదారులు, రైల్వేల వంటి ప్రధాన మౌలిక వసతులు అత్యంత కీలకం. అందుకే కేంద్ర ప్రభుత్వం... వాటికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ, ఏటా నిధుల కేటాయింపులను పెంచుతోంది. 2023-24 బడ్జెట్లోనూ రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు, జాతీయ రహదారులకు రూ.1.62 లక్షల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం మాత్రం దానికి పూర్తి భిన్నంగా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు తక్కువ నిధులను కేటాయిస్తోంది. వాటిని కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. ఏపీకి కేంద్రం మంజూరు చేసిన అరకొర ప్రాజెక్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, వాటా నిధుల్ని సమకూర్చకపోవడంతో ముందుకు సాగడం లేదు.
అవి రాచబాటలు... ఇవి అధ్వానదారులు
కేంద్రం జాతీయ రహదారులు, ఎకనమిక్ కారిడార్లు, ఇంటర్ కారిడార్లు, ఫీడర్ రోడ్లు, ఓడరేవులను అనుసంధానిస్తూ నిర్మించే రోడ్ల వంటివాటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. తాజా బడ్జెట్లో జాతీయ రహదారుల నిర్మాణానికే రూ.1,62,207 కోట్లు కేటాయించింది. 2021-22లో హైవేల నిర్మాణానికి రూ.57,081 కోట్లు ఖర్చు చేసింది. 2022-23 బడ్జెట్లో కేటాయింపులను రూ.1,34,015 కోట్లకు పెంచింది. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1,41,606 కోట్లకు చేరింది.
రాష్ట్రం ప్రభుత్వం ఇలా...!
రాష్ట్రంలో ఆర్అండ్బీ నిర్వహణలో 46 వేల కి.మీ.ల రహదారులు ఉన్నాయి. వాటిని ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించాలి. అంటే సగటున ప్రతి సంవత్సరం సుమారు 9 వేల కి.మీ.ల రోడ్లను పునరుద్ధరించాలి. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లూ రహదారుల పునరుద్ధరణ జరగలేదు.
ఆందోళనలపై చలనమే లేదు
విపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా, పత్రికలు, టీవీ ఛానళ్లలో ఎన్ని కథనాలు వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు దుమ్మెత్తిపోసినా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి రూ.2 వేల కోట్ల రుణం తెచ్చి, 7,900 కి.మీ.ల రహదారుల్ని మాత్రం పునరుద్ధరించింది.
కిలోమీటరు రైల్వే లైన్ నిర్మాణమైనా జరగలేదు
ఆంధ్రప్రదేశ్కి కేంద్రం కేటాయించే రైల్వే ప్రాజెక్టులే అరకొర. రాష్ట్ర భాగస్వామ్యంతో ప్రతిపాదించిన కీలక రైల్వే ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం తన వాటా నిధులివ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో... అవి ముందుకి కదలడం లేదు. తాము నిధులివ్వలేమని, భూసేకరణ మాత్రం చేసిస్తామని కేంద్రానికి రాష్ట్రం లేఖ రాయడంతో రైల్వేశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేసింది.
* నడికుడి-శ్రీకాళహస్తి మధ్య 309 కి.మీ. మేర కొత్తలైన్ 2011-12లో మంజూరైంది. ప్రస్తుత అంచనా విలువ రూ.2,700 కోట్లు. ఈ ప్రాజెక్టుకు భూమిని పూర్తిగా రాష్ట్రమే సేకరించి ఇవ్వడంతోపాటు నిర్మాణ వ్యయంలో 50% భరించాలి. గత ప్రభుత్వాల హయాంలో రూ.6 కోట్లు ఇచ్చారు.
* కడప-బెంగళూరు మధ్య 255 కి.మీ. కొత్తలైన్ను 2008-09లో మంజూరు చేశారు. ప్రస్తుతం దీని అంచనా విలువ రూ.2,849 కోట్లు. 50% ఖర్చు రాష్ట్రమే భరించాల్సి ఉండగా... గత ప్రభుత్వాల హయాంలోనే రూ.189.95 కోట్లు డిపాజిట్ చేశారు. కడప-పెండ్లిమర్రి మధ్య 21 కి.మీ. పూర్తయింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు నిలిచిపోయింది.
* కోటిపల్లి-నరసాపురం మధ్య 57.21 కి.మీల రైల్వేలైన్ 2000-01లో మంజూరైంది. రైల్వేకు రాష్ట్రం రూ.525 కోట్లు చెల్లించాలి. గత ప్రభుత్వాల హయాంలో రూ.2.69 కోట్లు ఇచ్చారు.
* అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి కర్ణాటకలోని తుముకూరు వరకు 207 కి.మీ. కొత్తలైన్ నిర్మాణ ప్రాజెక్టు 2007-08లో మంజూరైంది. మన రాష్ట్రపరిధిలో 80 కి.మీ.లు ఉంది. ఏపీ వాటా కింద రూ.485 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గత ప్రభుత్వాల హయాంలో రూ.260 కోట్లు ఇచ్చారు. రాయదుర్గం నుంచి కదిరిదేవరపల్లి వరకు 63 కి.మీ.లు పూర్తయింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక మిగతా నిధులివ్వకపోవడంతో ప్రాజెక్టు పూర్తవలేదు.
* రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానం కోసం... ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు, అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లె-నరసరావుపేట మధ్య... 106 కి.మీ.ల కొత్త రైల్వే లైన్ని రూ.2,679 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం మంజూరు చేసింది. దానిలో ఎంత వాటా సమకూరుస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నీతిఆయోగ్ కోరింది. దానిపైనా రాష్ట్రం స్పందించలేదు.
అమరావతిపై కక్షతో ప్రజలకు అన్యాయం
అమరావతిపై కక్షతో ప్రభుత్వం ప్రజలకు తీవ్ర అన్యాయం చేసింది. అనంతపురం నుంచి అమరావతి వరకు 384 కి.మీ.ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేని తెదేపా హయాంలో కేంద్రం మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం దానికి అడ్డుపుల్ల వేసింది. దాన్ని అమరావతి ఓఆర్ఆర్ వరకు కాకుండా, కోల్కతా-చెన్నై జాతీయ రహదారిలో భాగంగా చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న బైపాస్లో కలపాలని ప్రతిపాదించింది. దానికి ఎన్హెచ్ఏఐ అంగీకరించినా... దాన్ని మళ్లీ మార్చేసి శ్రీసత్యసాయి జిల్లాలోని కోడూరు నుంచి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం మీదుగా ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరింది. దీంతో అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్వే ప్రతిపాదనపక్కకు వెళ్లిపోయింది.
* అమరావతితోపాటు విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తెనాలి పట్టణాల చుట్టూ 189 కి.మీ. మేర ఓఆర్ఆర్ నిర్మాణానికి తెదేపా హయాంలోనే కేంద్రం అంగీకారం తెలిపింది. భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఏఐ పదేపదే కోరినా వైకాపా ప్రభుత్వం స్పందించలేదు. దానికి బదులు విజయవాడకు 46 కి.మీ.ల తూర్పు బైపాస్ చాలని కేంద్రానికి తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?