మొక్కుబడి తంతుగా ఇంటర్న్షిప్ వ్యవహారం
ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న డిగ్రీ ఇంటర్న్షిప్ మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థుల చదువుకు..వారి ఉపాధికి సంబంధం లేకుండా ఏదో ఒక దాంట్లో ఇంటర్న్షిప్ కేటాయించేస్తున్నారు.
విద్యార్థుల చదువు, ఉపాధికి సంబంధం లేకుండానే కేటాయింపు
మార్కుల కోసం ప్రైవేటులో కొనుగోళ్ళు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న డిగ్రీ ఇంటర్న్షిప్ మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థుల చదువుకు..వారి ఉపాధికి సంబంధం లేకుండా ఏదో ఒక దాంట్లో ఇంటర్న్షిప్ కేటాయించేస్తున్నారు. యువత ఆసక్తినీ పట్టించుకోవడం లేదు. విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. చిన్నచిన్న బేకరీలు, హోటళ్లు, బ్యూటీపార్లర్లు, ఎంబ్రైడరీ, కుట్టు, అల్లికలు, మండల కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు ఇలా ఒకటేమిటి ఏది కనిపిస్తే దాంట్లో ఇంటర్న్షిప్కు పంపిస్తున్నారు. ద్రవిడ వర్సిటీలో చదివే 25మంది బీఎస్సీ కంప్యూటర్ సైన్సు విద్యార్థులను గూడుపల్లి ఎండీవో కార్యాలయానికి కేటాయించారు. బీబీఏ చదివే 35మందిని శాంతిపురం, బీకాం కంప్యూటర్ అప్లికేషన్ చదివే 64మందిని కుప్పం ఎంపీడీవో కార్యాలయాలకు పంపించారు. వీరికి ఏం నేర్పించాలో కార్యాలయం అధికారులకు అవగాహన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2020-21 నుంచి 10 నెలల ఇంటర్న్షిప్తో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఉన్నత విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో మూడేళ్లకు కలిపి 6,52,671మంది విద్యార్థులు ఉన్నారు. రెండు, మూడు సంవత్సరాలు చదువుతున్న వారే 3,89,866మంది ఉన్నారు. ఇంతమందికి రెండు, ఆరు నెలల ఇంటర్న్షిప్ను విడతల వారీగా ఇప్పించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. దీంతో అయా జిల్లాల్లోని ప్రతి సంస్థను ఇంటర్న్షిప్కు కేటాయించేస్తున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు వెళుతున్నదీ లేనిదీ కూడా పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది పని ప్రదేశానికి వెళ్లకుండానే ప్రాజెక్టు నివేదికలు కొనుక్కొని సమర్పించేస్తున్నారు.
మూడు విడతలుగా..
నాలుగేళ్ల డిగ్రీలో మొదటి ఏడాది పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో రెండు నెలలు కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు పూర్తి చేయాలి. రెండో ఏడాది పూర్తయిన తర్వాత సెలవుల్లో రెండు నెలలు రెండో ఇంటర్న్షిప్ చేయాలి. మూడో ఏడాదిలో ఐదు లేదా ఆరో సెమిస్టర్ మొత్తం ఆరు నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. 2020-21లో చేరిన విద్యార్థులు ఇప్పుడు మూడో ఏడాదికి వచ్చారు. కొన్ని వర్సిటీలు ఐదో సెమిస్టర్లో ఇంటర్న్షిప్కు పంపించగా.. మరికొన్ని ఆరో సెమిస్టర్లో పంపించేందుకు ప్రణాళికలు రూపొందించాయి. మూడు విడతలకు కలిపి విద్యార్థులకు 20 క్రెడిట్లు కేటాయిస్తారు. ఇవి పూర్తి చేస్తే విద్యార్థులకు డిగ్రీ పట్టా వస్తుంది. ఇంటర్న్షిప్ ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేసింది. అన్ని జిల్లాల్లోనూ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం.. పక్క ప్రాంతాలకు వెళ్తే రవాణా ఛార్జీలలు భారం కావడంతో సొంత జిల్లాలోనే ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎలాంటి పరిశ్రమలు లేవు. ప్రైవేటు కంప్యూటర్ సంస్థలూ లేవు. ఇలాంటి చోట బ్యూటీపార్లర్లు, గ్రామ, వార్డు సచివాలయాలు, మండల కార్యాలయాలు, బేకరీలు, కుట్లు, అల్లికల దుకాణాలు, చిన్నపాటి మార్కెట్లకు పిల్లలను పంపిస్తున్నారు. దాదాపు 8నెలలు ఇంటర్న్షిప్ చేసినా కొన్నిచోట్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. విద్యార్థుల సంఖ్య.. స్థానికంగా ఉండే పరిశ్రమలను పట్టించుకోకుండానే ఆర్భాటంగా దీన్ని తీసుకురావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇవేం ఇంటర్న్షిప్లు..
ద్రవిడ విశ్వవిద్యాలయంలో బీకాం చదువుతున్న ఓ విద్యార్థికి స్థానికంగా ఒక చిన్న బేకరీలో ఇంటర్న్షిప్కు కేటాయించారు. అక్కడ నేర్చుకునేందుకు ఏమీ లేదంటూ విద్యార్థి వెళ్లడం మానేశారు. నిర్వాహకులకు రూ.5 వేలు ఇచ్చి హాజరైనట్లు ధ్రువీకరణ తీసుకున్నారు.
* విజయనగరంలోని మహారాజా(ఎ) కళాశాల విద్యార్థులకు రెండు నెలల ఇంటర్న్షిప్ కోసం స్థానికంగా కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో కేటాయించారు. ఐదు కంప్యూటర్లు ఉన్న ఈ కేంద్రానికి పదుల సంఖ్యలో విద్యార్థులను కేటాయించగా ఇక్కడ ఏమీ నేర్చుకోకపోగా.. ధ్రువపత్రం కోసం ఒక్కో విద్యార్థి రూ.800 నుంచి రూ.వెయ్యి చెల్లించాల్సి వచ్చింది.
* విజయనగరం జిల్లాకు చెందిన కొంతమందికి రెండు నెలల ఇంటర్న్షిప్ కోసం ఫార్మ కంపెనీలకు కేటాయిస్తే ఈ తక్కువ సమయం నేర్చుకునేందుకు సరిపోదంటూ తిరస్కరించాయి.దీంతోవారు ఆన్లైన్ ఇంటర్న్షిప్ చేశారు.
* విజయవాడలో ఎస్ఆర్ఆర్ కళాశాలకు చెందిన బీఎస్సీ (కంప్యూటర్స్) విద్యార్థినికి మొదట రెండు నెలలు ఆన్లైన్లో పైథాన్లో శిక్షణ ఇవ్వగా.. ఇప్పుడు ఆరు నెలల ఇంటర్న్షిప్కు సోలార్, బ్యూటీపార్లర్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలని సూచించారు.
* గుంటూరు, శ్రీకాకుళంతోపాటు చాలా జిల్లాల్లో కొందరు విద్యార్థులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంటర్న్షిప్ చేయిస్తున్నారు. అక్కడికి వెళ్లిన వారికి ఏం పని చెప్పాలో కార్యదర్శులకు తెలియని పరిస్థితి. పల్నాడు జిల్లాలో ఓ విద్యార్థినిని ఏఎన్ఎంతోపాటు ట్యాబ్లెట్ల పంపిణీకి పంపించారు.
* పల్నాడు జిల్లాలో ఇంటర్న్షిప్కు కేటాయించిన సంస్థలు నచ్చక బీకాం కంప్యూటర్స్ విద్యార్థులు ప్రైవేటుగా ట్యాలీ కోర్సు నేర్చుకుంటున్నారు.
* రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కంపెనీకి ఇంటర్న్షిప్ కోసం 60మంది విద్యార్థులను కేటాయించగా.. ఆ కంపెనీ వారిని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
విద్యార్థులతో వ్యాపారం..
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్న్షిప్తో ఇప్పుడు బోగస్ ప్రాజెక్టుల వ్యాపారం భారీగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇంజినీరింగ్కే పరిమితమైన నకిలీ ప్రాజెక్టు సమర్పణ ఇప్పుడు డిగ్రీకీ వ్యాపించింది. కొందరు బోగస్ ప్రాజెక్టులను కొనుగోలు చేసి, కళాశాలలకు సమర్పిస్తున్నారు. కొన్నిచోట్ల కళాశాలల యాజమాన్యాలే గంపగుత్తగా కొనుగోళ్లు చేస్తున్నాయి. ఇందుకోసం విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. తిరుపతి జిల్లా కేంద్రంలో రెండు, మూడు సంస్థలు నకిలీ ప్రాజెక్టులను తయారు చేసి విక్రయిస్తున్నాయి. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లోనూ కొన్ని సంస్థలకు ఇదే వ్యాపారంగా మారింది. కొన్నిచోట్ల ప్రైవేటు కళాశాలలే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి, ప్రాజెక్టులు అందిస్తున్నాయి. ఇందుకు డబ్బులు వసూలు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్