NEET UG 2023 Results: నీట్ చక్రవర్తి.. శ్రీకాకుళం కుర్రాడికి దేశంలోనే ప్రథమ ర్యాంక్
నీట్ యూజీ పరీక్షలో శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి ప్రథమ ర్యాంకును సాధించి సత్తా చాటాడు. తమిళనాడు విద్యార్థి జె.ప్రభంజన్తో కలిసి ఈ ర్యాంకును పంచుకున్నాడు.
తమిళనాడుకు చెందిన ప్రభంజన్కు సైతం
తెలంగాణకు చెందిన రఘురామిరెడ్డికి 15వ ర్యాంకు
టాప్-50 ర్యాంకుల్లో ఏడుగురు తెలుగు విద్యార్థులు
ఈనాడు, దిల్లీ, అమరావతి: నీట్ యూజీ పరీక్షలో శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి ప్రథమ ర్యాంకును సాధించి సత్తా చాటాడు. తమిళనాడు విద్యార్థి జె.ప్రభంజన్తో కలిసి ఈ ర్యాంకును పంచుకున్నాడు. మంగళవారం రాత్రి నీట్ యూజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ మే 7న దేశవ్యాప్తంగా 499 నగరాల్లోని 4,097 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 20,38,596 మంది హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల్లో 11,45,976 మంది (56.12%) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి పరీక్ష రాసిన 72,842 మందిలో 42,654 (58.55%), ఏపీ నుంచి హాజరైన 68,578 మందిలో 42,836 (62.46%) మంది అర్హత సాధించారు. టాప్-50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు ఏడుగురు ఉండగా, వారిలో అయిదుగురు ఆంధ్రప్రదేశ్ వారే. వీరిలో వరుణ్ చక్రవర్తి (1, ఆంధ్రప్రదేశ్), కాంచాని గేయంత్ రఘురాంరెడ్డి (15, తెలంగాణ), యల్లంపల్లి లక్ష్మీ ప్రవర్ధన్రెడ్డి (25, ఆంధ్రప్రదేశ్), వంగీపురం హర్షిల్సాయి (38, ఆంధ్రప్రదేశ్), కణి యశశ్రీ (40, ఆంధ్రప్రదేశ్), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి (45, ఆంధ్రప్రదేశ్), జాగృతి బోడెద్దుల (49, తెలంగాణ) ఉన్నారు.
తెలుగులో రాసింది 1295 మందే
మొత్తం 13 భాషల్లో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను ఇంగ్లిష్లో అత్యధికంగా 16,72,914 మంది, హిందీలో 2,76,180 మంది రాయగా, తెలుగులో 1,295 మందే రాశారు. హిందీ, ఇంగ్లిష్ తర్వాత గుజరాతీ (53,027), బెంగాలీ (43,890), తమిళం (30,536)లో అత్యధికులు పరీక్ష రాశారు.
నీట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
జాతీయ ర్యాంకుల్లో మనవాళ్లు
- మహిళల కేటగిరీలో కణి యశశ్రీ 6వ ర్యాంకు (జాతీయ ర్యాంకు 40), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 9 (జాతీయ ర్యాంకు 45), జాగృతి బోడెద్దుల 10 (జాతీయ ర్యాంకు 49), గంధమనేని గిరివర్షిత 11 (జాతీయ ర్యాంకు 51), లక్ష్మీరష్మిత గండికోట 12 (జాతీయ ర్యాంకు 52), గిలడ ప్రాచి 17 ర్యాంకు (జాతీయ ర్యాంకు 65)వ సాధించారు.
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొదటి ర్యాంకు వై.లక్ష్మీప్రవర్ధనరెడ్డి (జాతీయర్యాంకు 25)
- ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5వ ర్యాంకు తెల్లావరుణ్రెడ్డి (జాతీయ ర్యాంకు 105)
- ఎస్సీ విభాగంలో 2వ ర్యాంకు యశశ్రీ (జాతీయ ర్యాంకు 40)
- ఎస్సీ విభాగంలో 7వ ర్యాంకు కొల్లాబత్తుల ప్రీతం సిద్ధార్థ (జాతీయ ర్యాంకు 299)
- ఎస్టీ విభాగంలో మొదటి ర్యాంకు ఎం.జ్యోతిలాల్ చవాన్ (జాతీయ ర్యాంకు 119)
- ఎస్టీ విభాగంలో 3వ ర్యాంకు లావుడ్య మధు బాలాజీ (జాతీయ ర్యాంకు 445)
కిందటేడాది కంటే పెరిగిన విద్యార్థులు
నీట్లో కిందటేడాది 40,344 మంది, ఈ సారి 42,836 మంది అర్హత సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ ఉషారెడ్డి తెలిపారు. నీట్ను తెలుగు మాధ్యమంలో రాసేందుకు 1,295 మంది దరఖాస్తు చేశారు.
ఏపీలో సీట్ల వివరాలు
ప్రాథమిక సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రానున్న అయిదు వైద్య కళాశాలల్లోని 750 సీట్లతో కలిపితే ప్రభుత్వ వైద్యకశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,785 వరకు ఉన్నాయి. ఇందుకు అదనంగా తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీ ఫర్ వుమెన్లో 175 సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలలోని సీట్ల భర్తీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారానే జరుగుతుంది. అలాగే 18 ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,000 వరకు సీట్లు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అంకుర సంస్థలు పదేళ్లలో 300రెట్లు పెరిగాయ్: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు