Macherla: అర్ధరాత్రి కరెంటు తీసి.. మఫ్టీలో వచ్చి.. తలుపు తట్టి..
పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా మైనారిటీ నేత సయ్యద్ అన్వర్బాషాను బుధవారం అర్ధరాత్రి సివిల్ దుస్తుల్లో వచ్చిన పోలీసులు అరెస్టుచేశారు. ఒక గంటలో విచారించి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు తెల్లారినా పంపకపోవడం, ఎక్కడ ఉంచారో తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
తెదేపా నేత అన్వర్బాషాను పట్టుకెళ్లిన పోలీసులు
తీసుకెళ్లింది ఎవరో తెలియక కుటుంబసభ్యుల మానసిక క్షోభ
ఎట్టకేలకు న్యాయమూర్తి వద్ద హాజరుపర్చిన పోలీసులు.. 14 రోజుల రిమాండు
బక్రీద్ పండగ వేళ అరెస్టుపై ముస్లిం సంఘాల ఆగ్రహం
మాచర్ల గ్రామీణ, న్యూస్టుడే: పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా మైనారిటీ నేత సయ్యద్ అన్వర్బాషాను బుధవారం అర్ధరాత్రి సివిల్ దుస్తుల్లో వచ్చిన పోలీసులు అరెస్టుచేశారు. ఒక గంటలో విచారించి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు తెల్లారినా పంపకపోవడం, ఎక్కడ ఉంచారో తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. నియోజకవర్గంలోని అన్ని స్టేషన్లలో ఆరా తీసినా సమాచారం తెలుసుకోలేపోయారు. ముస్లింలకు పర్వదినం బక్రీద్ వేళ అరెస్టు చేయడం, ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు మానసిక క్షోభ అనుభవించారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం బాషాను న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టారు. కారంపూడిలో ఇటీవల జరిగిన గొడవ కేసులో జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండు విధించారు.
క్రియాశీలకంగా ఉన్నారనే..
మాచర్ల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి అన్వర్బాషా ప్రధాన అనుచరుడు. తెదేపా ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ బస్సుయాత్రను మాచర్లలో విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆ రోజు డీజే పెట్టి పాటలతో పట్టణంలో హడావుడి చేయడాన్ని వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలో తెదేపాలో క్రియాశీలకంగా ఉండటంతోపాటు పార్టీకి గట్టిగా పని చేస్తుండటంతో వేధించడానికి అక్రమ కేసులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కారంపూడిలో ఈ నెల 20వ తేదీ ఉదయం వైకాపా, తెదేపా నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. వైకాపా వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు తెదేపా నేతలతోపాటు ఇతరుల పేర్లతో కేసు నమోదు చేశారు. ఇందులో ఇప్పుడు సయ్యద్ అన్వర్ బాషాను చేర్చారు. ఈ కేసులోనే బుధవారం అర్ధరాత్రి కారంపూడి పోలీసులు అరెస్టు చేశారు. కారంపూడి ఘటనతో అన్వర్కు సంబంధం లేకపోయినా కావాలనే హత్యాయత్నం కేసులో ఇరికించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ సమయంలో తీసుకెళ్లొద్దని వేడుకున్నా..
మాచర్ల జెండా చెట్టు ప్రాంతంలోని బుచ్చమ్మ బజారులో నివాసం ఉంటున్న సయ్యద్ అన్వర్బాషా ఇంటికి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు వచ్చారు. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా లేదు. ఇంటి తలుపు కొట్టడంతో తలుపు తీయగా.. అన్వర్ కావాలని అడిగినట్లు తల్లి మీరాబీ చెప్పారు. తాము పోలీసులమని... అన్వర్ను తమతో పంపితే చిన్న విచారణ ఉందని, గంటలో పంపిస్తామని చెప్పారు. తమ అబ్బాయి తగాదాలకు వెళ్లే వ్యక్తి కాదని, ఏదైనా ఉంటే పగటివేళ రావాలని, తాము ఎక్కడికీ పారిపోబోమని పోలీసులతో తల్లి మీరాబీ చెప్పారు. ఇలా అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇవేవీ పట్టించుకోని పోలీసులు అన్వర్ను తీసుకుని వెళ్లిపోయారు. అందరూ సివిల్ దుస్తుల్లో ఉండటం, గుర్తు పట్టడానికి వీలులేకపోవడంతో ఎవరు తీసుకెళ్లారోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత పోలీసులమంటూ వచ్చి అన్వర్ను తీసుకెళ్లిన వారు పోలీసులా.. ఇతరులా అన్న అనుమానంతో అన్వర్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.
అర్ధరాత్రి.. ఏమిటీ దారుణం
‘‘అర్ధరాత్రి వేళ వచ్చి హడావుడి చేసి మహిళలు, పిల్లలను భయాందోళనలకు గురిచేయడం ఎంతవరకు సమంజసం? వచ్చినవారంతా గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. పోలీసులు పగటివేళ వచ్చి తీసుకెళ్లవచ్చు. రాత్రి అయినా తాము ఫలానా పోలీసుస్టేషన్ నుంచి వచ్చామని, ఫలానా కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పవచ్చు. అవేవీ చెప్పకుండా ఎలా తీసుకెళ్లారు? పోలీసుల పేరుతో ఎవరైనా తీసుకెళ్తే మేం ఎవరికి చెప్పుకోవాలి? ఆడవారు అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్లి వెతకాలి? సాయంత్రం వరకూ ఎవరు.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. కనిపించిన ప్రతి ఒక్కరినీ.. అన్వర్ను చూపించాలని అడుగుతూనే ఉన్నాం’’ అని తల్లి సయ్యద్ మీరాబీ, భార్య ఆయేషా ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఉంటున్న అన్వర్ను కారంపూడి ఘటనలో.. అదీ కావాలని బక్రీద్ పండగ వేళ అరెస్టు చేయడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎప్పుడో వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి అరెస్టు చేయడమేంటని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా భయపెట్టాలనే బక్రీద్ రోజు అరెస్టు చేసి కక్ష తీర్చుకున్నారని వారు ఆరోపించారు.
న్యాయమూర్తి ఇంటి దగ్గర హాజరు..
కారంపూడిలో ఇటీవల జరిగిన తెదేపా, వైకాపా ఘర్షణ కేసులో నిందితునిగా అన్వర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయనను న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు.
సంబంధం లేని కేసులో ఇరికించారు: అన్వర్బాషా
తనకు సంబంధం లేని కేసులో ఇరికించి తనను ఇబ్బందులకు గురిచేశారని సయ్యద్ అన్వర్బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన తర్వాత ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తన కుమార్తెను ఎత్తుకొని భోరున విలపించారు. ఇంతకంటే తనను ఇంకేం చేయగలరని ప్రశ్నించారు. తనను ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లిన కారంపూడి ఎస్సై.. స్టేషన్కు వెళ్లాక కొట్టారన్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో తనను 13వ ముద్దాయిగా పెట్టినట్లు పోలీసులు చెప్పారన్నారు. ఆ గొడవకు, తనకు సంబంధం లేదన్నారు. తనలాంటి అమాయకుల ఉసురు ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించారు. కేసులు పెట్టడం మినహా ఇంకేం చేస్తారు.. పోతే పోయేది ప్రాణమేగా అంటూ అన్వర్బాషా ఆవేదన వ్యక్తం చేశారు.
బక్రీద్ వేళ.. ముస్లిం సోదరుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా?
తండ్రిని తీసుకెళ్తుంటే.. తల్లడిల్లే బిడ్డకు ఏమని సమాధానమిస్తారు?
మాచర్లలో అన్వర్బాషా అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం
ఈనాడు, అమరావతి: ‘తెల్లారితే బక్రీద్ అనగా ముస్లిం సోదరుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? రాక్షస రాజ్యమా? మీరు మనుషులేనా? మానవత్వం ఉందా?’ అని అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘మాచర్లలో తెదేపా కార్యకర్త సయ్యద్ అన్వర్ బాషా అరెస్టు.. జగన్రెడ్డి ఫాసిస్టు పాలనకు నిదర్శనం. తండ్రిని పోలీసులు తీసుకెళ్తుంటే.. తల్లడిల్లుతున్న బిడ్డకు మీరు ఏ సమాధానం చెబుతారు? ఈ వికృత రాజకీయ క్రీడకు, అమానవీయ పోకడలకు.. మీరు, మీ పార్టీ నేతలు ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లిస్తారు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి.. ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి.. జైలుకు పంపిస్తారా? బక్రీద్ రోజున ఒక ముస్లిం కుటుంబాన్ని క్షోభకు గురిచేసిన పాపం పోలీసుల్ని, కుట్ర చేసిన వైకాపా నేతల్ని వెంటాడుతుంది. ముస్లిం సమాజం మీ చర్యను గమనిస్తోంది. గట్టిగా బుద్ధి చెబుతుంది’ అని హెచ్చరించారు. అన్వర్బాషాను రిమాండుకు పంపేముందు ఆయన బిడ్డ, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్న వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?