Polavaram: పోలవరంలో కొత్త డయాఫ్రం వాల్!
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ను కొత్తగా పూర్తిస్థాయిలో నిర్మించాలనే ఆలోచన వైపు కేంద్రం మొగ్గు చూపుతోంది. 2020లో వచ్చిన భారీ వరదలకు డి వాల్ కొంత దెబ్బతింది. దాని సామర్థ్యం తేల్చేందుకు జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం అధ్యయనం చేసింది.
పాక్షికంగా నిర్మించే బదులు అదే మంచిదా అంటూ తర్జనభర్జనలు
సమయం, ఖర్చూ ముఖ్యం కాదు
నిర్మాణ భద్రతే ప్రధానం అంటున్న కేంద్రం
తుది నిర్ణయం కేంద్ర జలసంఘానిదే
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ను కొత్తగా పూర్తిస్థాయిలో నిర్మించాలనే ఆలోచన వైపు కేంద్రం మొగ్గు చూపుతోంది. 2020లో వచ్చిన భారీ వరదలకు డి వాల్ కొంత దెబ్బతింది. దాని సామర్థ్యం తేల్చేందుకు జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం అధ్యయనం చేసింది. పరీక్షలు నిర్వహించి, పాత డి వాల్ కొద్ది మేర మాత్రమే ధ్వంసమయిందని తేల్చింది. దెబ్బతిన్నంత మేర ఎక్కడికక్కడ చిన్నచిన్నగా ‘యు’ ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించి, దాన్ని ప్రస్తుత డయాఫ్రం వాల్తో అనుసంధానించాలని జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం, పోలవరం డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సంయుక్తంగా నిర్ణయించాయి. పోలవరంలో గైడ్బండ్ కుంగిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై కేంద్ర జల్శక్తి శాఖలో మళ్లీ అంతర్గత చర్చ ప్రారంభమయింది. పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల దిల్లీలో జరిగిన రెండు సమావేశాల్లోనూ, కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ వద్ద సోమవారం నిర్వహించిన సమావేశంలోనూ డయాఫ్రం వాల్ అంశంపై చర్చ జరిగింది. కొత్తగా పూర్తి స్థాయి డయాఫ్రం వాల్ నిర్మిస్తే చాలా ఖర్చవుతుందని, ఎక్కువ సమయం పడుతుందని అంటే.. ఆ కోణంలో ఆలోచించవద్దని కేంద్ర జల్శక్తి కార్యదర్శి సూచించారు. అన్నింటికన్నా డ్యాం భద్రతే ముఖ్యమని, ఆ దిశగానే ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆదివారం దిల్లీలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
డయాఫ్రం వాల్ ఎక్కడెక్కడ దెబ్బతింది?
1) గ్యాప్-1: ప్రధాన డ్యాం నిర్మించే గ్యాప్-1 ప్రాంతంలో డయాఫ్రం వాల్ను ఈ మధ్యే 393 మీటర్ల మేర నిర్మించారు. వరదల తర్వాతే నిర్మాణం పూర్తయినందున దానికి నష్టమేమీ సంభవించలేదు.
2) గ్యాప్-2: జి.కొండ తర్వాత కుడివైపు ఛానల్ 89 మీటర్ల నుంచి 1,485 మీటర్ల వరకు మొత్తం 1,396 మీటర్ల మేర డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని 2018 నాటికే పూర్తి చేశారు. ఇది అక్కడక్కడా ధ్వంసమైందని ఎన్హెచ్పీసీ తేల్చింది.
* ఎడమ చేతి వైపు ప్రధాన డ్యాం నిర్మించే చోట భారీ వరదలకు పెద్ద ఎత్తున కోత ఏర్పడింది. డయాఫ్రం వాల్ కూడా 175 మీటర్ల నుంచి 360 మీటర్ల వరకు (185 మీటర్లు) ధ్వంసమయింది.
* రెండో గ్యాప్లోనే 480- 510 మీటర్ల మధ్య మరో 30 మీటర్ల మేర దెబ్బతింది.
* రెండో గ్యాప్లోనే ఛానల్ 950 మీటర్ల నుంచి 1020 మీటర్ల వరకు దాదాపు 70మీటర్ల మేర ధ్వంసమయింది.
* కుడి వైపున కూడా పెద్ద ఎత్తున గోదావరి గర్భం కోత పడింది. 200 మీటర్లు ధ్వంసమయింది.
* ఎడమ, కుడి వైపున భారీ వరదలకు కోతపడ్డ ప్రాంతంలో అటూ ఇటూ కలిపి దాదాపు 385 మీటర్ల మేర డయాఫ్రం వాల్ ధ్వంసమయింది. మధ్యలో మరో 100 మీటర్ల మేర దెబ్బతింది.
* ఇది కాకుండా గ్యాప్-2 డయాఫ్రం వాల్లోనే 363 మీటర్ల ఛానల్ నుంచి 1,035 మీటర్ల వరకు దాదాపు 672 మీటర్ల మేర పైభాగంలో 5 మీటర్ల మేర దెబ్బతింది.
* అది కాకుండా 672 మీటర్ల మేర పైభాగంలో దాదాపు 5 మీటర్ల లోతున అంతా దెబ్బతిందని.. అదంతా సరిదిద్దుకోవాల్సి ఉంటుందని ఈ పరీక్షల్లో తేలింది.
* దెబ్బతిన్నంత మేర ఎక్కడికక్కడ చిన్నచిన్నగా ‘యు’ ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ చిన్న డి వాల్లను ప్రస్తుత డయాఫ్రం వాల్తో అనుసంధానించాలని మార్చి నెలలో నిర్ణయించారు.
తాజాగా సందేహాలు
దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో పాక్షిక నిర్మాణం సరిపోతుందని మార్చి నెలలో నిర్ణయించినా ఇప్పుడు దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్షిక డయాఫ్రం వాల్ కొత్తగా నిర్మించి, పాత డి వాల్తో అనుసంధానించడం సాధ్యమేనా అని కేంద్ర జల్శక్తి శాఖ సందేహిస్తోంది. గైడ్బండ్ కుంగిన నేపథ్యంలో డి వాల్ నిర్ణయంపై తిరిగి చర్చలు ప్రారంభించారు. అన్నింటికన్నా డ్యాం భద్రతే ముఖ్యమని.. దాన్ని దృష్టిలో ఉంచుకునే నిర్ణయించాలని కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటే కుదరదని, సాంకేతికంగా ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్ర జలసంఘానిదే తుది బాధ్యతని తేల్చి చెప్పారు. డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ నిర్ణయం తీసుకుందని, తమకు సంబంధం లేదని అనడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. అన్నింటినీ సమన్వయం చేసుకునేలా పోలవరం అథారిటీ బాధ్యత వహించాలనే సూచనలూ వచ్చాయి. ఆదివారం దిల్లీలో నిర్వహించే సమావేశంలో కేంద్ర సంస్థలతో పాటు ఏపీ జలవనరులశాఖ, మేఘా, బావర్ కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ, ఎన్హెచ్పీసీ నిపుణులు పాల్గొంటారు. గైడ్బండ్ వైఫల్యంతోపాటు డి వాల్ నిర్మాణంపై కీలకంగా చర్చ జరగనుంది.
ఏమిటీ డయాఫ్రం వాల్?
పోలవరంలో రాతి, మట్టితో గోదావరికి అడ్డంగా దాదాపు 2.5 కిలోమీటర్ల మేర డ్యాం నిర్మించనున్నారు. దీన్ని నదీ గర్భం నుంచి కడుతూ వస్తారు. నదీగర్భంలో డ్యామ్ దిగువన నీటి ఊట చేరకుండా ఉండాలి. దిగువన ఊరే నీరు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లకుండా చూసేదే డయాఫ్రం వాల్. ‘బావర్’ అనే విదేశీ కంపెనీ గోదావరి గర్భంలో దిగువన ఎక్కడ రాయి ఉందో అక్కడి వరకు ప్లాస్టిక్ కాంక్రీటుతో డయాఫ్రం వాల్ నిర్మించింది. పోలవరంలో గ్యాప్-1లో 584.5 మీటర్ల మేర, గ్యాప్-2 లో 1750 మీటర్ల మేర ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మించాల్సి ఉంది. ఈ రెండింటి మధ్యలో 584.5 మీటర్ల వెడల్పున ఎత్తయిన జి.కొండ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..