EPFO - Higher EPS: అధిక పింఛను అర్హులకు ఊరట
అధిక పింఛనుకు అర్హత ఉన్నవారికి ఈపీఎఫ్వో ఊరటనిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)లో జమ చేయాల్సిన బకాయిలపై వడ్డీ భారాన్ని తగ్గించింది.
ఈనాడు, హైదరాబాద్: అధిక పింఛనుకు అర్హత ఉన్నవారికి ఈపీఎఫ్వో ఊరటనిచ్చింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)లో జమ చేయాల్సిన బకాయిలపై వడ్డీ భారాన్ని తగ్గించింది. బకాయిలను మూడు నెలల్లోగా ప్రతి నెలా 24 శాతం చొప్పున వడ్డీ సహా చెల్లించాలని నెల క్రితం వరకు జారీ చేసిన డిమాండ్ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా దీన్ని 8 శాతానికి తగ్గించింది. ఈపీఎఫ్ ఖాతాలో నిల్వపై భవిష్యనిధి సంస్థ చెల్లిస్తున్న వడ్డీ తరహాలోనే బకాయిలపైనా వసూలు చేయాలని నిర్ణయించింది. డిమాండ్ నోటీసులో పేర్కొన్న గడువులోగా బకాయిలు చెల్లించాలని.. లేకుంటే అధిక పింఛను ఉమ్మడి ఆప్షన్పై ఆసక్తి లేదని భావిస్తూ దరఖాస్తును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.
నెల క్రితం 24 శాతం చొప్పున..
హైదరాబాద్కు చెందిన ఓ ఉద్యోగి ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తూ అత్యున్నత పదవిలో పదవీ విరమణ చేశారు. ఈపీఎఫ్వో అధిక పింఛనుకు దరఖాస్తు చేయగా ఆమోదం లభించింది. దరఖాస్తుకు ఆమోదం లభించిన రోజు (2023 మే 31) నాటికి ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్) బకాయి రూ.17,69,290గా ఈపీఎఫ్వో లెక్కకట్టింది. దీన్ని చెల్లించేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఇందులోని మొదటి నెలలో చెల్లిస్తే సాలీనా 24 శాతం వడ్డీ చొప్పున రూ.18,04,856 చెల్లించాలి. రెండో నెలలో అయితే రూ.18,52,278, మూడో నెలలో రూ.19,11,555 చెల్లించాలంటూ నోటీసు పంపించింది. ఈ లెక్కన మూడో నెలలో అయితే సుమారు 32 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా ఉందన్న తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని ఈపీఎఫ్వో తగ్గించింది.
ప్రస్తుతం ఇలా..
ఓ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అధిక పింఛను కోసం చేసిన దరఖాస్తు జూన్ 16న ఆమోదం పొందింది. అతనికి అందుతున్న వాస్తవిక అధిక వేతనంపై ఈపీఎస్కు చెల్లించాల్సిన బకాయిలను వడ్డీ సహా (2014 సెప్టెంబరు 1 వరకు 8.33 శాతం వడ్డీ, సెప్టెంబరు 1 తరువాత సర్వీసుకు 8.33 శాతంతో పాటు అదనంగా 1.16 శాతం కలిపి) లెక్కించింది. జులై 31లోగా చెల్లిస్తే రూ.8,47,497, రెండో నెలలో (ఆగస్టు 31లోగా) చెల్లిస్తే 8 శాతం వడ్డీ చొప్పున రూ.8,53,100, మూడో నెలలో (సెప్టెంబరు 31లోగా) చెల్లిస్తే రూ.8,58,704 కట్టాలని సూచించింది. ఇలా తాజాగా జారీ చేస్తున్న డిమాండ్ నోటీసుల్లో వడ్డీ భారాన్ని ఏడాదికి 24 నుంచి 8 శాతానికి తగ్గించింది.
నిధుల బదిలీకి మరోసారి అంగీకారం చెప్పాలి
ఈపీఎస్ డిమాండ్ నోటీసు మేరకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఉద్యోగుల భవిష్యనిధి ఖాతా నుంచి మళ్లించేందుకు దరఖాస్తుదారులు ఇప్పటికే ఆన్లైన్లో అంగీకారం తెలిపారు. అయితే దాని ప్రకారం నేరుగా నిధులు బదిలీ చేయకుండా.. డిమాండ్ నోటీసు జారీ చేసిన తరువాత మరోసారి అంగీకారం చెప్పాలని ఈపీఎఫ్వో సూచిస్తోంది. భవిష్యనిధి ఖాతాలో తగినన్ని నిధులుంటే.. ఉద్యోగి అంగీకారంతో వాటిని ఈపీఎస్కు మళ్లిస్తారు. నిధుల్లేకుంటే స్థానిక ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ లేదా ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ పేరిట డీడీ తీసి పంపించాలి. నిర్ణీత గడువులోగా ఈపీఎస్ బకాయిలు చెల్లించాలని ఈపీఎఫ్వో స్పష్టం చేసింది. గడువులోగా బకాయిలు చెల్లించకుంటే దరఖాస్తుపై పీఎఫ్ కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!