Polavaram Project: పోలవరం ప్రాజెక్టు లోపాల లోతుల్లోకి కేంద్రం
పోలవరం ప్రాజెక్టులో తాజాగా ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై కేంద్రం ఒక స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
వరుసగా ఎదురవుతున్న సవాళ్లు.. పరిష్కార మార్గాలపై దృష్టి
అంతా పకడ్బందీగా సాగేందుకు ప్రణాళిక
త్వరలో సంయుక్త భేటీ
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో తాజాగా ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై కేంద్రం ఒక స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కేంద్రజల్శక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ అంశంపై ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. జాతీయ ప్రాజెక్టు పోలవరంలో నిర్మాణ క్రమం, ప్రగతి సరైన మార్గంలో లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కేంద్ర సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిర్మాణ ఏజన్సీ వైపు వేలు చూపుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర అధికారులు నిర్ణయాల ఆలస్యంపై ప్రశ్నిస్తున్నారు. స్పిల్వేపై ఒత్తిడి లేకుండా నిర్మించిన గైడ్బండ్ కుంగిపోయింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించినా సీపీజే ప్రధాన డ్యాం ప్రాంతాన్ని వరద ముంచెత్తింది.
అంతకుముందు ఎగువ కాఫర్ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల వరద ఉధృతికి ప్రధాన డ్యాం ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. డయాఫ్రం వాల్ ధ్వంసమైంది. పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గైడ్బండ్ కుంగిపోయిన నేపథ్యంలో బాధ్యులను గుర్తించాలని కేంద్ర మంత్రి ఆదేశించినా ఆ నిర్ణయాలు జరగలేదు. జాతీయ ప్రాజెక్టులో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లకపోతే ప్రమాదమనే ఆందోళనలతో కేంద్ర జల్శక్తి పెద్దలు కార్యాచరణకు నడుం బిగించారు. కేంద్ర జల్శక్తి శాఖ ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో ఇందుకు కసరత్తు సాగుతోంది. కేంద్రం సంస్థలతో ఆయన అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, వ్యాప్కోస్, సీఎంఎస్ఆర్ఎస్ (సెంట్రల్ మెటీరియల్ అండ్ రీసెర్చి స్టేషన్) వంటి సంస్థలతో ఆయన సమావేశమయ్యారు.
ప్రతి ఒక్కరితోను విడిగాను మాట్లాడుతున్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర సంస్థలను సమన్వయం చేస్తోంది. వ్యాప్కోస్ నేరుగా నాణ్యత పర్యవేక్షిస్తోంది. సీఎంఎస్ఆర్ఎస్ కట్టడాలకు సంబంధించిన అవసరమైన పరిశోధనలు చేసి నివేదికలు ఇస్తోంది. నాణ్యత నియంత్రణ సంస్థ ప్రతినిధులు కూడా పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలోనే ఉంటున్నారు. ఇంత పర్యవేక్షణ ఉన్నా ఎందుకు లోపాలు తలెత్తుతున్నాయనే ప్రధాన ప్రశ్న ఆధారంగా పరిష్కార మార్గాలు వెదికే అన్వేషణ సాగుతోంది. సెప్టెంబరు 10 నాటికి ఈ కసరత్తు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
రాష్ట్ర అధికారులతో త్వరలోనే భేటీ
ఆ నివేదిక సిద్ధమయ్యేలోపు వెదిరె శ్రీరామ్ రాష్ట్ర జలవనరులశాఖ, పోలవరం అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర సంస్థలు, రాష్ట్ర అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కేంద్రజల్శక్తిశాఖ మంత్రితో పాటు, కార్యదర్శి, సలహాదారు తదితర ముఖ్యులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. పోలవరంలో స్పష్టమైన బాధ్యతల బదలాయింపునకు ఆ సమావేశం కీలకం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.