రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు!
‘‘అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్’’ గురించి తెలుసు కదా..! ఎవరైనా బ్యాంకు నుంచి నగదు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు.. అక్కడే మాటు వేసి ఉండే ఈ దొంగల ముఠాల సభ్యులు రూ.100 నోటు ఒకటి కింద పడేసి.. సార్! మీ డబ్బులే పడిపోయినట్లున్నాయి చూడండని చెబుతారు.
చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆందోళనల్లో తెదేపా శ్రేణులు
ఇదే అదనుగా నకిలీ ఓట్ల చేర్పులపై వైకాపా దృష్టి
జనాభాకు తగ్గట్లు ఓటర్లు పెరగలేదని ఫిర్యాదులు
పెద్దఎత్తున ఫారం-6, 7 దరఖాస్తుల దాఖలు
‘‘దృష్టి మళ్లించి దోచుకునే ముఠాల’’ తరహాలో వైకాపా మోడెస్ అపరెండీ
ఈనాడు-అమరావతి: ‘‘అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్’’ గురించి తెలుసు కదా..! ఎవరైనా బ్యాంకు నుంచి నగదు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు.. అక్కడే మాటు వేసి ఉండే ఈ దొంగల ముఠాల సభ్యులు రూ.100 నోటు ఒకటి కింద పడేసి.. సార్! మీ డబ్బులే పడిపోయినట్లున్నాయి చూడండని చెబుతారు. మనం అటువైపు చూసే లోపు. దృష్టి మళ్లించి మన చేతిలో ఉన్న నగదు సంచి లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతారు. అచ్చం ఆ ‘‘అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లు’’ అనుసరించే ‘‘మోడెస్ అపరెండీ’’నే ఏపీలో జగన్ ప్రభుత్వం, వైకాపా నాయకులు ఇప్పుడు అమలు చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయటంతో.. తెదేపా శ్రేణులన్నీ దాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో తలమునకలై ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం దృష్టంతా అటువైపు మళ్లటంతో.. వైకాపా తన ఓట్ల రాజకీయానికి తెర లేపింది. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, తమ పార్టీ శ్రేణులు, అనుకూలమైన అధికారులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించటం, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్లు తొలగించటం వంటి కార్యకలాపాల్లో మునిగి తేలుతోంది.
ఫిర్యాదు వెనక సరికొత్త పన్నాగమా?
రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదని, నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వీటిపై సమగ్ర విచారణ జరపాలంటూ వైకాపా తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని రెండు రోజుల కిందట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నకిలీ ఓట్ల నెపంతో గుట్టు చప్పుడు కాకుండా తెదేపా సానుభూతిపరుల ఓట్లు తొలగించటం, జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్ల పెరగుదల లేదనే సాకుతో తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించాలనే పన్నాగం, కుట్ర దీని వెనక ఉందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాల వల్ల రాష్ట్రంలో విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో యువతరం పొరుగు రాష్ట్రాలకు వలస బాట పడుతోంది. వృద్ధులు, నడి వయస్కులే ఇక్కడ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 18 ఏళ్లు నిండిన నవతరం ఓటర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఓటర్ల సంఖ్య ఎలా పెరుగుతుంది? ఇవి తెలిసి కూడా ఇలాంటి ఫిర్యాదులు చేయటం వెనక మర్మమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెదేపా అప్రమత్తంగా లేని సమయాన్ని చూసుకుని
రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ల జాబితా చూసినా అవకతవకలు, అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూశాయి. ప్రధానంగా తెదేపాకు పట్టున్న నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే.. భార్యకు లేకుండా చేశారు. దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేర్లు ఆ ప్రాంత ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు. బతికున్న వారి ఓట్లు గల్లంతు చేసి. చనిపోయిన వారికి మాత్రం కొనసాగించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేసిన వారి పేర్ల జాడ ప్రస్తుత జాబితాలో దొరక్కుండా చేశారు. ఒకే కుటుంబంలోని కొందరి ఓట్లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో మరికొందరి పేర్లు మరో పోలింగ్ కేంద్రంలో పరిధిలో చేర్చారు. కొన్ని కుటుంబాలకు సంబంధించి మొత్తం అందరి ఓట్లు గల్లంతైన పరిస్థితి. మరోవైపు ఒకే డోర్ నంబర్లో వందల సంఖ్యలో ఓటర్లున్నట్లు నమోదు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన తెదేపా కొంత కాలంగా క్షేత్రస్థాయిలో ఈ అక్రమాలు, అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ఆ అక్రమాలను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రక్రియ ఉద్ధృతంగా సాగుతున్న దశలో చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేశారు. తెదేపా దృష్టంతా అటు మళ్లటంతో వారు అప్రమత్తంగా లేని సమయాన్ని చూసుకుని వైకాపా నాయకులు ఇప్పుడు కొత్త ఎత్తుగడ అవలంబిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో వాలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్ల తొలగింపు కోసం ఫారం-7 దరఖాస్తులు, నకిలీ ఓట్లు చేర్పించడానికి ఫారం-6 దరఖాస్తులను పెద్ద ఎత్తున దాఖలు చేయిస్తున్నారు.
కొత్త ఓటర్లు చేర్పించటానికి భారీగా దరఖాస్తులు
తెదేపా శ్రేణులన్నీ ఆందోళనల్లో తలమునకలై ఉండటంతో ఇదే అదునుగా కొన్ని నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఓటర్లుగా చేరటం కోసం, ఉన్న ఓట్లు తొలగించటానికి నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు ఎన్నికల అధికారులకు అందుతున్నాయి. ఈ దరఖాస్తుల వెనక వైకాపా నాయకులే ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై ఎవరూ అభ్యంతరం తెలిపే అవకాశం లేనందున తమకు అనుకూలంగా నకిలీ ఓట్లు చేర్పించేందుకు, ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లు తీసివేసేందుకు ఇదే అనువైన సమయంగా వైకాపా నాయకులు ఎంచుకున్నారు. ఉదాహరణకు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఓటర్లు నమోదు కోసం ఏప్రిల్ నుంచి ఈ నెల 15 వరకు ఏకంగా 32,417 దరఖాస్తులొచ్చాయి. ఒకే నియోజకవర్గంలో ఇంత భారీ మొత్తంలో రావటంపై అనేక అనుమానాలున్నాయి. వీటిల్లో అత్యధిక శాతం ఈ మధ్య కాలంలో అందినవే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.