సీమెన్స్ కేసులో లోకేశ్ పేరు చెప్పండి
సీమెన్స్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఒప్పించేందుకు.. అందులో చంద్రబాబు, లోకేశ్ పేర్లు చేర్చేందుకు ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని వ్యక్తులే తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారిపై ఇద్దరు మంత్రుల ఒత్తిళ్లు
అంగీకరించకపోవడంతో బదిలీ వేటు
ఈనాడు, అమరావతి: సీమెన్స్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఒప్పించేందుకు.. అందులో చంద్రబాబు, లోకేశ్ పేర్లు చేర్చేందుకు ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని వ్యక్తులే తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. ఇద్దరు మంత్రులు సహా కొందరు అధికారులు ఇదే పనిపై.. కొన్ని నెలల పాటు పనిచేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిని.. సతాయించిన తీరే దీనికి నిదర్శనం. అయినా ఆయన అంగీకరించకపోవడంతో అక్కడ నుంచి బదిలీ చేశారు. సీమెన్స్ ఒప్పందంలో చంద్రబాబు, లోకేశ్ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పమంటూ డిజైన్టెక్ ఎండీ ఖన్వీల్కర్ సహా మరికొందరిని వేధించారని, అవసరమైతే రూ.25 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అంతే స్థాయిలో ఏపీఎస్ఎస్డీసీ ఉన్నతాధికారి విషయంలోనూ ఓ మంత్రి వ్యవహరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్కు బాగా దగ్గరగా ఉండే ఆ మంత్రి అప్పట్లో ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. కొంతకాలం కిందట ఆ మంత్రి.. నైపుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేసే ఉన్నతాధికారిని పిలిపించి.. సీమెన్స్ ప్రాజెక్టు ఒప్పందం, నిధుల మళ్లింపులో లోకేశ్ పాత్ర ఉందని చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన లోకేశ్ పాత్ర ఎక్కడా కన్పించడం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అయినా పట్టువదలని అమాత్యుడు.. కొన్ని నెలల పాటు ఆయనను వేధించారు. తర్వాత సీఐడీ విచారణ సమయంలోనూ లోకేశ్ పేరు చెప్పాలంటూ మరోసారి ఒత్తిడికి గురి చేశారు. స్వయంగా మంత్రివర్యులే తనను మూడుసార్లు పిలిచి వేధించారని సంబంధిత అధికారి పేర్కొనడం గమనార్హం. ‘సీమెన్స్ ప్రాజెక్టులో ఒప్పందం ప్రకారం యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్వేర్ను సరఫరా చేసిన మాట వాస్తవం. వాటిని అక్కడి విద్యార్థులు వినియోగించుకున్నారు. ఈ నైపుణ్య శిక్షణతో చాలా మంది ఉద్యోగాలు పొందారు. నిజంగా నిధులు మళ్లించి ఉంటే.. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? యువతకు శిక్షణ ఎలా లభించింది. 70వేల మందికి పైగా ఉద్యోగాలెలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. కేసులో తననూ లక్ష్యంగా చేసుకుంటారనే ఆందోళన ఆయనలో వ్యక్తమైంది.
పథకం ప్రకారమే ఫోరెన్సిక్ ఆడిట్
అసెంబ్లీలోనే కాదు, విలేకరుల సమావేశాల్లోనూ పిట్ట కథలు చెప్పడంలో ఆరితేరిన ఓ అమాత్యుడు సీమెన్స్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేందుకు మొదటి నుంచి కంకణం కట్టుకున్నట్లు కన్పిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ కోసం నియమించిన శరత్ అసోసియేట్స్ను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే నివేదిక ఇచ్చేయాలని ఈ అమాత్యుడు ఒత్తిడి చేశారు. ఏదైనా ప్రాజెక్టులో లోపాలున్నాయని చెప్పాలంటే.. దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాల్ని తెలుసుకోవాలి. సీమెన్స్ విషయంలో మాత్రం అలాంటి ప్రయత్నమే లేదు. అక్కడి సాప్ట్వేర్, యంత్రాలు, ప్రయోగశాలలను చూడలేదు. ఇవేవీ లేకుండానే.. ప్రాజెక్టుపై ప్రభుత్వం గుడ్డిగా నివేదికలు తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రామాణిక విద్యకు ఛార్జి మెమోలే పరిష్కారమా?
ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసి, ఛార్జిమెమో ఇవ్వడం ద్వారా విద్యారంగంలోని సమస్యలు పరిష్కారం అవుతాయా అని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
ఏపీలో ఎయిర్ఫైబర్ సేవలు విస్తరించిన జియో
రిలయన్స్ జియో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఎయిర్ఫైబర్ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు
తితిదే అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్ (ట్విటర్)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు. -
ఐఐటీఎఫ్లో ఏపీ పెవిలియన్కు మూడో బహుమతి
దేశ రాజధాని దిల్లీ ప్రగతిమైదాన్లో ఈనెల 14 నుంచి 27 వరకు నిర్వహించిన భారత అంతర్జాతీయ వ్యాపారమేళా (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ఫెయిర్- ఐఐటీఎఫ్)లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసిన పెవిలియన్కు మూడో బహుమతి దక్కింది. -
కరెంటోళ్ల నెత్తిన అప్పుల కుప్ప!
విద్యుత్ పంపిణీ సంస్థలకూ (డిస్కంలు) జగన్ ‘షాక్’ తప్పలేదు. ఈ ఏడాది జులై నాటికి వాటి నెత్తిన ప్రభుత్వం రూ.19 వేల కోట్ల కొత్త అప్పులు పెట్టింది. ఇప్పటికే డిస్కంలు నెలవారీ నిర్వహణ ఖర్చులకూ సతమతమవుతున్నాయి. -
అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో అంచనాలకు మించి తరలివచ్చారు. సుమారు రెండు లక్షలకు పైగా ప్రదక్షిణలో పాల్గొన్నారని అధికారుల అంచనా. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
స్మార్ట్మీటర్ల ఏర్పాటు.. మోదీ మెప్పుకోసమే
‘స్మార్ట్మీటర్ల ఏర్పాటును భాజపా పాలిత రాష్ట్రాలు సహా అందరూ వ్యతిరేకిస్తున్నారు. మోదీ మెప్పు కోసం ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల వ్యవసాయ పంపుసెట్లు సహా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్మార్ట్మీటర్లను బిగించడానికి సన్నాహాలు చేస్తోంది’ -
రాజధానిలో యథేచ్ఛగా రహదారుల విధ్వంసం
రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం బోరుపాలెం ఇసుక రీచ్ వద్ద రోడ్డు తవ్వుకుపోయిన దొంగలు.. -
పుడమితల్లికి సేవ.. లాభాల సాగుకు తోవ
ఏ పంటైనా సరే.. విత్తు దగ్గర నుంచి కోత వరకు కనీసం 60- 180 రోజుల సమయం పడుతుంది. అదే ప్రతివారం ఏదో ఒక పంట కోతకు వచ్చి ఆదాయం చేతికందితే ఎలా ఉంటుంది. అదే చేసి చూపించారు.. అనంతపురం జిల్లాకు చెందిన రైతు నారాయణప్ప. -
పశువులూ అల్లాడుతున్నాయ్!
నోరులేని మూగజీవులు మనల్నేమైనా అడగొచ్చాయా? అనే ధైర్యం... మనుషులకే వైద్యాన్ని అందించలేకపోతున్నాం... ఇక పశువుల్ని ఏం పట్టించుకుంటాం? అనే దైన్యం... ఇదీ వైకాపా పాలనలో దుస్థితి. -
వచ్చామా.. చూశామా.. వెళ్లామా..!
ఓటర్ల జాబితా పరిశీలకుడు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన హడావుడిగా సాగింది. కొన్ని చోట్ల ఆయన పదేసి నిమిషాలపాటు మాత్రమే పరిశీలించారు. -
ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
పతకాలపైనా పార్టీ ప్రచారమే.. వికెట్ల మీదా జగన్ చిత్రాలు
వైకాపా తన ప్రచారానికి దేనిని వదలడం లేదు. చివరికి ప్రభుత్వ నిధులతో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలకు సంబంధించిన పరికరాలను సైతం పార్టీ ప్రచారానికి వాడుకుంటోంది. -
పెద్దిరెడ్డి ఇలాకాలో భూసేకరణపై రైతుల మండిపాటు
విద్యుత్తు బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్కు తమ భూములు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. -
రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్మెన్ సుజిత్ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్ప్రెస్కు సోమవారం పెను ప్రమాదం తప్పింది. -
వెలిగొండ గుండె మండుతోంది!
వచ్చే ఏడాది సెప్టెంబరు, అక్టోబరుకల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, జలాశయంలో నీటిని నిలుపుతాం. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టు నిర్వాసితుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ప్యాకేజీ అందిస్తాం. -
డి-ఫార్మసీ(పాలిటెక్నిక్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కళాశాలల్లో డి-ఫార్మసీ కోర్సు ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. -
ఇటొస్తే.. ఇరుక్కున్నట్లే..!
గుంతల రహదారులు రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. రాకపోకలు సాగించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో రహదారుల దుస్థితికి ఈ చిత్రం నిదర్శనం.