సీమెన్స్ కేసులో లోకేశ్ పేరు చెప్పండి
సీమెన్స్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఒప్పించేందుకు.. అందులో చంద్రబాబు, లోకేశ్ పేర్లు చేర్చేందుకు ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని వ్యక్తులే తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారిపై ఇద్దరు మంత్రుల ఒత్తిళ్లు
అంగీకరించకపోవడంతో బదిలీ వేటు
ఈనాడు, అమరావతి: సీమెన్స్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఒప్పించేందుకు.. అందులో చంద్రబాబు, లోకేశ్ పేర్లు చేర్చేందుకు ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలోని వ్యక్తులే తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. ఇద్దరు మంత్రులు సహా కొందరు అధికారులు ఇదే పనిపై.. కొన్ని నెలల పాటు పనిచేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిని.. సతాయించిన తీరే దీనికి నిదర్శనం. అయినా ఆయన అంగీకరించకపోవడంతో అక్కడ నుంచి బదిలీ చేశారు. సీమెన్స్ ఒప్పందంలో చంద్రబాబు, లోకేశ్ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పమంటూ డిజైన్టెక్ ఎండీ ఖన్వీల్కర్ సహా మరికొందరిని వేధించారని, అవసరమైతే రూ.25 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అంతే స్థాయిలో ఏపీఎస్ఎస్డీసీ ఉన్నతాధికారి విషయంలోనూ ఓ మంత్రి వ్యవహరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్కు బాగా దగ్గరగా ఉండే ఆ మంత్రి అప్పట్లో ఈ బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. కొంతకాలం కిందట ఆ మంత్రి.. నైపుణ్యాభివృద్ధి సంస్థలో పనిచేసే ఉన్నతాధికారిని పిలిపించి.. సీమెన్స్ ప్రాజెక్టు ఒప్పందం, నిధుల మళ్లింపులో లోకేశ్ పాత్ర ఉందని చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన లోకేశ్ పాత్ర ఎక్కడా కన్పించడం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అయినా పట్టువదలని అమాత్యుడు.. కొన్ని నెలల పాటు ఆయనను వేధించారు. తర్వాత సీఐడీ విచారణ సమయంలోనూ లోకేశ్ పేరు చెప్పాలంటూ మరోసారి ఒత్తిడికి గురి చేశారు. స్వయంగా మంత్రివర్యులే తనను మూడుసార్లు పిలిచి వేధించారని సంబంధిత అధికారి పేర్కొనడం గమనార్హం. ‘సీమెన్స్ ప్రాజెక్టులో ఒప్పందం ప్రకారం యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్వేర్ను సరఫరా చేసిన మాట వాస్తవం. వాటిని అక్కడి విద్యార్థులు వినియోగించుకున్నారు. ఈ నైపుణ్య శిక్షణతో చాలా మంది ఉద్యోగాలు పొందారు. నిజంగా నిధులు మళ్లించి ఉంటే.. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? యువతకు శిక్షణ ఎలా లభించింది. 70వేల మందికి పైగా ఉద్యోగాలెలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. కేసులో తననూ లక్ష్యంగా చేసుకుంటారనే ఆందోళన ఆయనలో వ్యక్తమైంది.
పథకం ప్రకారమే ఫోరెన్సిక్ ఆడిట్
అసెంబ్లీలోనే కాదు, విలేకరుల సమావేశాల్లోనూ పిట్ట కథలు చెప్పడంలో ఆరితేరిన ఓ అమాత్యుడు సీమెన్స్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేందుకు మొదటి నుంచి కంకణం కట్టుకున్నట్లు కన్పిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ కోసం నియమించిన శరత్ అసోసియేట్స్ను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే నివేదిక ఇచ్చేయాలని ఈ అమాత్యుడు ఒత్తిడి చేశారు. ఏదైనా ప్రాజెక్టులో లోపాలున్నాయని చెప్పాలంటే.. దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాల్ని తెలుసుకోవాలి. సీమెన్స్ విషయంలో మాత్రం అలాంటి ప్రయత్నమే లేదు. అక్కడి సాప్ట్వేర్, యంత్రాలు, ప్రయోగశాలలను చూడలేదు. ఇవేవీ లేకుండానే.. ప్రాజెక్టుపై ప్రభుత్వం గుడ్డిగా నివేదికలు తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు. -
బాణసంచా పేలుళ్లకు బెదిరి.. వృద్ధురాలిని పొడిచిన ఆవు
వైకాపా నాయకులు కాల్చిన బాణసంచా ఒక వృద్ధురాలు గాయపడటానికి కారణమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని రామాపురం సంఘం కాలనీలో కావలి ఎమ్మెల్యే సమీప బంధువు మన్నెమాల సుకుమార్రెడ్డి తన అనుచరులతో ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. -
రండి.. రండి.. ఓటేయగ తరలిరండి!
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. -
ల్యాండ్ టైటిలింగ్పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్పై సీఐడీ కేసు
తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా మొత్తం 10 మందిపైన ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. -
వడగాలులు తగ్గుముఖం.. వర్షాలకు అవకాశం!
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు వడగాలులు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. -
రెండు నెలలుగా జీతాలందని శాప్ కోచ్లు
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలోని శిక్షకులకు రెండు నెలలుగా జీతాల్లేవు. ఇదిగో అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. -
పింఛన్కు వెళ్లి.. వడదెబ్బతో వృద్ధుడి మృతి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన గంగదారి సుబ్బారావు(67) వడదెబ్బతో మృతి చెందారు. శనివారం ఉదయం పింఛను కోసం స్థానిక బ్యాంకు వద్దకు వెళ్లారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది.