తెలంగాణలో పసుపు బోర్డు.. గిరిజన వర్సిటీ
తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమని.. తమ పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటన
అవినీతే భారాస, కాంగ్రెస్ల సిద్ధాంతం
తెలంగాణలో కుటుంబస్వామ్యం
పాలమూరు ప్రజాగర్జనలో ప్రధానమంత్రి ధ్వజం
ప్రజలు కోరుకుంటున్న మార్పు భాజపాతోనే సాధ్యమని వెల్లడి
రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు
రాష్ట్రంలో ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని ప్రజల కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతిరహిత, పారదర్శక, జవాబుదారీ పాలనను, తప్పుడు వాగ్దానాలిచ్చేది కాకుండా పనిచేసే ప్రభుత్వం కావాలను కుంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వారు కోరుకుంటున్న అవినీతి రహిత పాలన ఏర్పడుతుంది. మార్పు భాజపాతోనే సాధ్యం. రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇవ్వాలి.
ప్రధాని మోదీ
ఈనాడు, మహబూబ్నగర్: తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమని.. తమ పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డును, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మహబూబ్నగర్ సమీపంలోని అమిస్తాపూర్ వద్ద ఆదివారం భాజపా ఏర్పాటు చేసిన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో భాజపాను గెలిపించి.. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. భారాస, కాంగ్రెస్ పార్టీలకు అవినీతి, కమీషన్లే సిద్ధాంతమని ఆయన విమర్శించారు. కుటుంబాల కోసమే ఆ పార్టీలు పనిచేస్తాయని.. వాటి నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని అన్నారు. సామాన్య ప్రజలనే భాజపా కుటుంబంగా భావించి పాలన అందిస్తోందని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని.. ఆ కంపెనీలో ఛైర్మన్, సీఈవో నుంచి మేనేజర్ వరకు అంతా కుటుంబ సభ్యులేనని ఎద్దేవా చేశారు. సహాయ సిబ్బందిగా మాత్రం ఇతరుల్ని నియమించుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా నీరు మాత్రం అందడం లేదన్నారు.
రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో భారాస(అప్పటి తెరాస) ప్రకటించి.. మాఫీ చేయకపోవడంతో ఎంతోమంది రైతులు నష్టపోయారన్నారు. భారాస ప్రభుత్వం స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు. సభలో పాల్గొనే ముందు ప్రధాని రూ.13,500 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్, అధికారులు పాల్గొన్నారు. భాజపా సభలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, ఎంపీ అర్వింద్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ నేతలు జితేందర్రెడ్డి, బంగారు శ్రుతి, గరికపాటి మోహన్రావు, మురళీధర్రావు, ఇంద్రసేనారెడ్డి, రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు..
‘‘తెలంగాణ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఏర్పడకుండా రూ.6,300 కోట్లు వెచ్చించి.. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభించాం. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధర కింద 2014కి ముందు ప్రభుత్వాలు ఏటా రూ.3,400 కోట్లు వెచ్చించేవి. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే రూ.27 వేల కోట్లు వ్యయం చేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. రాష్ట్రంలో 2014కు ముందు 2,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులుంటే.. ఈ తొమ్మిదేళ్లలో మరో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులొచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సహా ఇతరుల్లోని కళా నైపుణ్యాలను కాపాడేందుకే ప్రధాని విశ్వకర్మ పథకం తీసుకొచ్చాం. రైౖతులు, యువత సహా అన్ని వర్గాల ప్రజల మెరుగైన జీవనానికి ప్రయోజనం కలుగుతుంది. దేశ ప్రజలు స్వచ్ఛతలో పెద్దఎత్తున భాగస్వాములై సామాజిక ఉద్యమంగా మార్చాలి.
దిల్లీలో ఓ సోదరుడున్నాడని గుర్తుంచుకోండి
తెలంగాణలోని చెల్లెమ్మలకు దిల్లీలో ఒక సోదరుడున్నాడని గుర్తుంచుకోవాలి. మహిళల కోసం భాజపా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. వారి ఆత్మగౌరవం కాపాడేందుకు మరుగుదొడ్ల నిర్మాణం, ముద్రా యోజన ద్వారా ఆర్థిక తోడ్పాటు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు, ఉచిత గ్యాస్ కనెక్షన్లతో అండగా నిలుస్తోంది. రాణి రుద్రమదేవి వంటి ధీరవనితలు పుట్టిన తెలంగాణ గడ్డ నుంచి మహిళల గొంతు మరింత బలంగా చట్టసభల్లో వినిపించనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. పార్లమెంటులో బిల్లును ఆమోదించుకుని నవరాత్రులు రాకముందే శక్తిపూజ స్ఫూర్తి నెలకొల్పాం.
రూ.900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం
దేశంలో పసుపు పండించడంతోపాటు వినియోగం ఎక్కువ. తెలంగాణ రైతులు సైతం భారీఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. కొవిడ్ అనంతరం పసుపు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో పంట ఉత్పత్తి నుంచి దిగుబడి వరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ పసుపు రైతులకు శుభాకాంక్షలు. ములుగు కేంద్రంగా కేంద్రం ఆధ్వర్యంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నాం. గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క-సారక్క పేరుతో ఈ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి రూ.900 కోట్లు వెచ్చించనున్నాం.
రహదారుల అనుసంధానంతో ప్రయోజనం..
జాతీయ రహదారులను అనుసంధానం చేయడంతో ఈ ప్రాంతవాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. నాగ్పుర్-విజయవాడ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు చేయూత లభిస్తుంది. ఈ కారిడార్లు వాణిజ్య హబ్లుగా మారనున్నాయి. అయిదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీ ఫుడ్ క్లస్టర్, మూడు ఫార్మా, మెడికల్ క్లస్టర్, ఒకటి మెగా టైక్స్టైల్ క్లస్టర్ అభివృద్ధి చెందుతున్నాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో నిరుద్యోగ యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు రానున్నాయి. దేశంలో 2014 వరకు సుమారు 14 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉండేవి. 2023లో అవి 32 కోట్లకు చేరుకున్నాయి. ఇటీవల సిలిండర్ ధరను తగ్గించాం. గ్యాస్ ఉత్పత్తిని పెంచడంతోపాటు సరఫరా అనుసంధానాలను పెంచుతున్నాం. హసన్-చర్లపల్లి ఎల్పీజీ పైపులైను ఈ ప్రాంత ప్రజల గ్యాస్ అవసరాలను తీరుస్తుంది. కృష్ణపట్నం-హైదరాబాద్ మధ్య ఎల్పీజీ గ్యాస్కు సంబంధించిన మల్టీపర్పస్ పైపులైనుకు శిలాఫలకం ఆవిష్కరించాం. తద్వారా తెలంగాణలో చాలామందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.’’
తెలుగులో ప్రసంగం ఆరంభించి..
పాలమూరు ప్రజలందరికీ నా నమస్కారాలు అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. పలుమార్లు నా కుటుంబ సభ్యుల్లారా? అని తెలుగులో మాట్లాడారు. ‘మీరు చూపిన ప్రేమకు ముగ్ధుడినయ్యాను. నాపై తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమ, అభిమానాన్ని చాటారు’ అని అన్నారు.
ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు
- సూర్యాపేట-ఖమ్మం నాలుగు వరుసల రహదారి
- జక్లేర్-కృష్ణా కొత్త రైల్వే లైను
- హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన కొత్త భవనాలు
- హెచ్పీసీఎల్-హసన్-చర్లపల్లి ఎల్పీజీ పైపులైను
- హైదరాబాద్(కాచిగూడ)-రాయచూరు రైలు
శిలాఫలకాలను ఆవిష్కరించిన ప్రాజెక్టులు
- వరంగల్-ఖమ్మం 4 వరుసల జాతీయ రహదారి
- ఖమ్మం-విజయవాడ 4 వరుసల జాతీయ రహదారి
- కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు బహుళ ఉత్పత్తుల పైపులైను పనులు
ప్రధాని మోదీకి ఘన స్వాగతం,వీడ్కోలు
ఈనాడు, హైదరాబాద్, శంషాబాద్, న్యూస్టుడే: మహబూబ్నగర్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. ప్రధానికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్లో ప్రధాని మహబూబ్నగర్కు వెళ్లారు. వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మహబూబ్నగర్ పర్యటన ముగించుకొని తిరిగి సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. దిల్లీకి పయనమైన మోదీకి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, మహిళా మోర్చా నేతలు, అధికారికంగా మంత్రి తలసాని, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు సాదర వీడ్కోలు పలికారు. సాయంత్రం 5.55 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని దిల్లీకి పయనమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!