Karnataka Road Accident: ఇక్కడే ఉపాధి ఉంటే.. ఈ ఘోరం జరిగేదా?
ఉపాధి వెతుక్కుంటూ బెంగళూరు వంటి మహానగరానికి వలస వెళుతోన్న వారెవరూ ఐటీ ఉద్యోగులు కాదు..! వారు పనిచేస్తోంది బహుళజాతి కంపెనీలూ అసలే కాదు..! వారంతా బడుగు జీవులు. భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్మెన్లుగా, దినసరి కూలీలుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న అభాగ్యులు..!
‘అనంత’ కన్నీటి వెతలు
ఊరుగాని ఊరు వలసపోవాల్సిన దుస్థితి
ఈనాడు, అమరావతి-న్యూస్టుడే, కదిరి
ఉపాధి వెతుక్కుంటూ బెంగళూరు వంటి మహానగరానికి వలస వెళుతోన్న వారెవరూ ఐటీ ఉద్యోగులు కాదు..! వారు పనిచేస్తోంది బహుళజాతి కంపెనీలూ అసలే కాదు..! వారంతా బడుగు జీవులు. భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్మెన్లుగా, దినసరి కూలీలుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న అభాగ్యులు..! గురువారం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఇలాంటి వారే! ఉన్నఊరును, అయినవాళ్లను వదిలేసి.. పొట్టకూటి కోసం అంత దూరం వలస పోవాల్సిన భయంకరమైన దుస్థితిలోకి వారిని నెట్టేసిన పాపం ముమ్మాటికీ ఈ ప్రభుత్వానిదే..! సొంత ఊళ్లోనో, చుట్టుపక్కల ప్రాంతాల్లోనో వ్యవసాయ పనులు దొరికితే, కనీస ఉపాధి కల్పించే పరిశ్రమలు ఉంటే.. పూటగడవడం కోసం పిల్లాపాపలతో ఊరుగాని ఊరు వలసపోవాల్సిన దుస్థితి వారికి తలెత్తేది కాదు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వలసలు ఎప్పటి నుంచో ఉన్నా.. గత నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే కియా వంటి కొత్త పరిశ్రమలేవీ రాకపోవడం వల్ల ఈ ప్రాంతం నుంచి వలసలు మరింత పెరిగాయి.
ఈ ఏడాది తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల మరింతగా కరవు పరిస్థితులు కమ్ముకోవడంతో..ఉన్నచోట పూటగడవడమే కష్టమై వేల సంఖ్యలో ప్రజలు బెంగళూరు వంటి నగరాలకు వలస పోతున్నారు. కాస్తోకూస్తో పని తెలిసినవారు, నైపుణ్యం ఉన్నవారు పెయింటర్లు, ఎలక్ట్రీషియన్లుగా పనుల్లో కుదురుకుంటే, మిగతా వారు వాచ్మెన్లు, దినసరి కూలీలుగా బతుకులీడుస్తున్నారు. పని ప్రదేశాల్లో జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ సంఘటనలు గతంలో చాలా జరిగాయి. గతంలో ఉపాధి కోసం వెళ్లిన కూలీలు కేరళలో రోడ్డు ప్రమాదానికి గురవడంతో... తెదేపా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి వలసలు వెళ్లిన వారి వివరాలు సేకరించారు. కేరళలోని కొచ్చి, కొట్టాయం తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని గుర్తించి, వారిని వెనక్కు పిలిపించి స్థానికంగా ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా అలాంటి చర్యలు కొరవడ్డాయి.
నగరాలకు వలసలు..!
కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లోని పేదలు ఎక్కువగా ఉపాధికోసం బెంగళూరుకు వెళుతున్నారు. కొంతమంది చెన్నై, తిరువనంతపురం, హైదరాబాద్ లాంటి నగరాలకు వలస పోతున్నారు. పొరుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కదిరి ప్రాంతం నుంచి సుమారు 25 వేల మంది, హిందూపురం ప్రాంతం నుంచి 45 వేల మంది, రాయదుర్గం, కల్యాణదుర్గం ప్రాంతాల నుంచి 10 వేల మంది ఉపాధి కోసం వలసపోయారని అంచనా. వీరితోపాటు రైలు సదుపాయం కలిగిన హిందూపురం నుంచి రోజూ 2 వేల మంది, రాయదుర్గం ప్రాంతం నుంచి 600 మంది పనుల కోసం రోజూ వెళ్లి వస్తుంటారు. వీరితోపాటు కదిరి, గాండ్లపెంట, ఎన్పీకుంట తదితర మండలాల్లో నుంచి వేలసంఖ్యలో గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలసపోయారు. అక్కడ అనారోగ్యం, ప్రమాదాలకు గురై మృత్యువాత పడినవారు చాలా మంది ఉన్నారు.
కరవు నేలపై కనికరం లేదా?
కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలంటే అది వ్యవసాయరంగం, పరిశ్రమల వల్లే సాధ్యం. శ్రీసత్యసాయి జిల్లా వంటి కరవు ప్రాంతానికి సాగునీరు అందించి, భూముల్ని సాగులోకి తేగలిగితే వలసలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఆ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఎన్నో ప్రతిపాదనలు ఉన్నా వాటిని కార్యరూపంలోకి తీసుకు రావడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. గురువారం జరిగిన ప్రమాదంలో మృతి చెందినవారిలో గోరంట్ల మండలానికి చెందిన వారే ఎనిమిది మంది ఉన్నారు. గోరంట్ల ప్రాంతానికి హంద్రీనీవా నీళ్లు తీసుకురావాలనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన. గొల్లపల్లి జలాశయానికి శ్రీశైలం జలాలు హంద్రీనీవా పథకం ద్వారా తీసుకువచ్చారు. అక్కడి నుంచి మడకశిర బ్రాంచి కెనాల్ ద్వారా నీళ్లు ప్రవహిస్తాయి.
ఆ కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా గోరంట్ల మండలానికి నీళ్లు తీసుకురావాలనే ఆలోచన ఉంది. దానికి ఇప్పటివరకు తుది ప్రణాళిక రూపుదిద్దుకోలేదు. నిధులూ మంజూరు కాలేదు. నీటిని ఎత్తిపోసి గోరంట్ల మండలానికి తీసుకువచ్చి చెరువులు నింపితే వేల ఎకరాలు సాగులోకి వచ్చేవి. వలసలూ తగ్గేవి. పుట్టపర్తి నియోజకవర్గానికి బుక్కపట్నం మాదాల జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి కాలువల ద్వారా మళ్లించి చెరువులు నింపేందుకు పాలనాపరమైన అనుమతులిచ్చారు. ఆ పనులు ఇప్పటికీ ప్రారంభమే కాలేదు. భూసేకరణ జరగలేదు. ఈ పనులు పూర్తైతే పుట్టపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని చెరువులు నింపి సాగునీటిని అందించే ఆస్కారం ఉండేది. చెర్లోపల్లి జలాశయం నుంచి కూడా ఓబుళదేవరచెరువు, అమ్మడగురు మండలాల చెరువులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకురావాలనే ఆలోచన కూడా పట్టాలెక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..