ఊరూరా వాలంటీర్లు.. అన్నిచోట్లా జగన్ అరాచకాలు!
పైకి... వారు స్వచ్ఛంద వాలంటీర్లు... గౌరవవేతనంతో పనిచేసే వారు... ప్రజలకు సేవలందించాల్సిన వారు..కానీ.. చేస్తున్నది జగనన్న సేవ.. ప్రజలపై అడుగడుగునా నిఘా వాడవాడలా వైకాపా అరాచకాలకు తోడూనీడా ప్రజాప్రయోజనం పేరిట దిగిన అన్నజనం ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన ప్రైవేటు సైన్యం!
పైకి... వారు స్వచ్ఛంద వాలంటీర్లు... గౌరవవేతనంతో పనిచేసే వారు... ప్రజలకు సేవలందించాల్సిన వారు..
కానీ.. చేస్తున్నది జగనన్న సేవ.. ప్రజలపై అడుగడుగునా నిఘా వాడవాడలా వైకాపా అరాచకాలకు తోడూనీడా ప్రజాప్రయోజనం పేరిట దిగిన అన్నజనం ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన ప్రైవేటు సైన్యం! మీ ఇంటికి ఎవరు వచ్చినా మీరెటైనా వెళ్లినా... సరదాకు మీ ఇంటి వాకిట్లోనో... సరకులకని కొట్లోనో... రాజకీయంగా ఏదైనా నోరుజారినా... వేగుల్లా పట్టేస్తారు.. వైకాపాకు చేరవేస్తారు! ఇంటివద్దకే ప్రభుత్వ సేవలనే తేనె పూసి... కంటికి కనిపించని గూఢచర్యం చేసి... ఆంధ్రుల జీవితాలను అభద్రతలోకి నెట్టిన ఘనుడు... జగనుడు!
సర్కారీ సేవలను గడప గడపకూ చేర్చే స్వచ్ఛంద సేవకులంటూ వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్రెడ్డి సృష్టించారు. పూర్తిగా ప్రజాధనంతోనే వాలంటీర్లను పెంచి పోషించిన జగన్- వారితో సొంత పార్టీ పనులు చేయించుకున్నారు. వైకాపా చీకటి వ్యవహారాలు అన్నింటినీ వాలంటీర్ల చేతుల మీదుగానే జరిపించారు.
వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు
వాలంటీర్లు ఎవరు, వారి విధులేమిటి అన్న విషయాలపై జగన్ తీపి మాటలన్నీ చక్కెర పూతపూసిన విషగుళికల వంటివే. సేవాదృక్పథం కలిగిన యువతీ యువకులను వాలంటీర్లుగా నియమించామని, వారు పార్టీలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్నారని సీఎం దరువేసుకున్నారు. కానీ, వాలంటీర్లు వైకాపా కార్యకర్తలేనని, పార్టీ అవససరాల కోసమే నియమితులయ్యారంటూ జగన్ రాజకీయ కుట్రను ఆయన వందిమాగధులే బయటపెట్టారు. ‘‘వైకాపాలో పనిచేసిన వారికి వాలంటీర్ల నియామకంలో అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాం. ఆ పనులు పూర్తయ్యాయి’’ అని తమ ఘనకార్యం గురించి ఎంపీ విజయసాయిరెడ్డి 2019 ఆగస్టులోనే నిర్లజ్జగా ప్రకటించారు. ‘‘వాలంటీర్ పోస్టులిచ్చింది వైకాపా కుటుంబాల వారికే కదా’’ అని హోంమంత్రి తానేటి వనిత జంకుగొంకు లేకుండా ఒప్పుకొన్నారు. ఆర్భాటాల మంత్రి అంబటి రాంబాబు అయితే ‘‘వాలంటీర్లు వైకాపా కోసం పనిచేస్తున్న కార్యకర్తలు’’ అని ఉన్న నిజం కక్కేశారు. కాబట్టే వారితో అడ్డగోలు పనులన్నీ చేయించుకోగలిగారు. ఎంప్లాయ్మెంట్ సర్వే పేరిట పట్టభద్రుల రాజకీయ ఆసక్తుల గురించి వాలంటీర్లు కూపీ లాగారు. సిటిజన్ అవుట్ రీచ్ సర్వే అంటూ పాన్కార్డుల వివరాలు ఆరా తీశారు. జగన్ చెప్పినట్లు నిజంగా సంక్షేమ పథకాల పంపిణీ కోసమే వాలంటీర్లు ఉంటే- ప్రజల వ్యక్తిగత సమాచారం వారికెందుకు? పౌరసేవల వితరణకు ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడు- దాన్ని కాదని ఒక గూడుపుఠాణీ వ్యవస్థను జనంపై రుద్దాల్సిన పనేమిటి? ప్రజలపై ప్రత్యక్షంగా నిఘా పెట్టడానికి, జనాన్ని పార్టీల వారీగా విభజించి పాలించడానికి జగన్కు వాలంటీర్లు చాలా అవసరం కాబట్టే రాష్ట్రంలో ఆ వ్యవస్థ మొలుచుకొచ్చింది. ‘‘వాలంటీర్లు ఎవరో కాదు... మన పార్టీని అభిమానించే, మనలో నుంచి వచ్చిన మనవారే’’ అన్న జగన్ ఇటీవలి వ్యాఖ్యలే అందుకు నిదర్శనాలు.
జవాబుదారీతనం లేని వ్యవస్థ
సంక్షేమ పథకాలకు అర్హులెవరో గుర్తించడం అనేది సర్కారీ సిబ్బంది నిష్పాక్షికంగా నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత. తనకోసం తనచేత నియమితులైన వాలంటీర్లకు దాన్ని కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను జగన్ పెళ్లగించి పారేశారు. ‘‘వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారికి సర్వీస్ రూల్స్ ఉన్నాయా? అసలు ప్రభుత్వ ఉద్యోగులేనా? లబ్ధిదారుల ఎంపికలో వారి జోక్యమేమిటి’’ అని సాక్షాత్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు సంధించింది. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానేకారు. ఆ విషయం జగనే తేల్చి చెప్పారు. ‘‘మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పనిచేయాలన్న నిబంధనలు ఏమీ లేవు’’ అంటూ ఆయన వాలంటీర్లకు ఒక లేఖ కూడా రాశారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాలకు సమాధికట్టిన జగన్- శాసన కట్టుదిట్టాలేమీ లేని సమాంతర వ్యవస్థకు కోరలు తొడిగారు. దాని ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను చావుదెబ్బ తీశారు. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. వాలంటీర్లకు ఉన్న అధికారం సర్పంచ్లకు లేదు అని పల్లెల ప్రథమ పౌరులు ఆవేదన వెళ్ళగక్కినా, తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంజేసినా జగన్ ఏమాత్రం లెక్కజేయలేదు.
జగన్మోసకారితనం
జగన్ పెత్తందారీ ప్రభుత్వానికి కళ్లూచెవులుగా మెలుగుతున్న వాలంటీర్లలో కొందరు సంఘవ్యతిరేక శక్తులుగా తయారయ్యారు. ఘోర నేరాలకు పాల్పడ్డారు. ఆడపిల్లలపై అత్యాచారాల నుంచి అసహాయులపై అరాచక దాడుల వరకు, నాటుతుపాకుల తయారీ మొదలు హత్యల దాకా కొంతమంది వాలంటీర్లు చేయని అకృత్యాలంటూ లేవు. పింఛన్ సొమ్ములను, పంట పరిహారాలను దిగమింగిన వాలంటీర్ల బాగోతాలూ వెలుగుచూశాయి. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య ప్రమాణాలకు కట్టుబడని జగన్ విశృంఖలత్వమే దీనికంతటికీ కారణం. జనం సొమ్ముతో జనానికే చేటుచేసిన జగన్మోసకారితనం ఆయనది. సేవాసైన్యం ముసుగులో సొంత కార్యకర్తల దండును ఊరూరా వాడవాడా మోహరించి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యం గుండెల్లో గునపాలు దించిన శీలహీన రాజకీయాలు ఆయనవి!
ప్రజాధనం... ‘సాక్షి’ పరం
తనకు మించిన నిజాయతీపరుడు ఇంకెవరూ లేరన్నట్టు జగన్ ఆత్మస్తుతి చేసుకుంటూ ఉంటారు. నిజానికి జనం సొమ్ముతో తన కరపత్రిక ‘సాక్షి’ సర్క్యులేషన్ను పెంచుకునే పన్నాగానికి పాల్పడేటంతటి గొప్పది ఆయన ‘నిజాయతీ’! దినపత్రిక కొనుగోలు కోసమంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు ఒక్కొక్కరికి నెలకు రూ.200 చొప్పున కేటాయిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులిచ్చింది. రెండున్నర లక్షల మందికి పైబడిన వాలంటీర్లతో పాటు 1.45 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ ఇలాగే సొమ్ము మంజూరు చేసింది. ‘సాక్షి’ని కొనాలని సర్కారీ ఆదేశాల్లో నేరుగా చెప్పకపోయినా- ఆయా జీఓల్లోని షరతులు, తన బాకా ఊదని పత్రికలపై జగన్ కడుపుమంటను గమనిస్తే అయ్యవారి ఆంతర్యం ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది. ఏడాదికి తొంబై కోట్ల రూపాయలకు పైగా జనం సొమ్మును వెదజల్లి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో తన సొంతపత్రిక ‘సాక్షి’ని కొనిపించడమే నీతిమాలిన జగన్ ఉద్దేశమన్నది బహిరంగ రహస్యమే. ప్రజాధనానికి ప్రభుత్వం ధర్మకర్తగా మెలుగుతూ దాన్ని సద్వినియోగ పరచాలి. అందుకు విరుద్ధంగా స్వీయ ప్రచారం కోసం సర్కారీ ఖజానాకు జగన్ చిల్లుపెట్టారు.
ఓట్ల తొలగింపులోనూ వాళ్లే!
జగన్ దొంగ రాజకీయాలకు ఒక పనిముట్టుగా వాలంటీర్ల వ్యవస్థ బాగా ఉపయోగపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ వాలంటీర్లు జనాన్ని ప్రభావితం చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లోనైతే వైకాపా తరఫున వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం మళ్ళీ రావాలనే లక్ష్యంతో పనిచేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టి మరీ వాలంటీర్లకు కర్తవ్యోపదేశాలు చేశారు. నెల్లూరు జిల్లా సంగంలోనైతే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు వాలంటీర్లతో వైకాపా నేతలు రహస్యంగా భేటీ వేశారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. కానీ, ఆ ఉత్తర్వులకు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో విచ్చలవిడిగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్లో కొందరు వాలంటీర్లే కీలకపాత్ర పోషించారు.
ఆ తరవాతా వాలంటీర్ల హవా ఎక్కడా తగ్గలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా బూత్స్థాయి అధికారులతో కలిసి ఇంటింటి తనిఖీల్లోనూ వాలంటీర్లు భాగస్వాములయ్యారు. ప్రజాస్వామ్యాన్ని అలా పాతాళానికి తొక్కేసింది చాలక వైకాపా కార్యక్రమాలన్నింటినీ వాలంటీర్లే ముందుండి నడిపించారు. జగన్ సభలకు జనాన్ని తరలించడంలోనూ వాలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సీఎం సభలకు రానివారికి సంక్షేమ పథకాలను తొలగిస్తామని లబ్ధిదారులను బెదిరించి మరీ బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఇలా వైకాపా జెండాలు మోయించడం కోసం ఏడాదికి దాదాపు రూ.1900 కోట్ల ప్రజాధనాన్ని వాలంటీర్లకు ధారపోశారు జగన్. సొంత పార్టీకోసం జనం డబ్బులను ఇంతగా దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా కనిపించరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM