ఇసుకాసురులకు పెద్దన్న
జగన్మోహన్రెడ్డితో పోలిస్తే- రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు చాలా నయం. కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేచేవాడు.
జగన్మోహన్రెడ్డితో పోలిస్తే- రావణుడి తమ్ముడు కుంభకర్ణుడు చాలా నయం. కుంభకర్ణుడు ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేచేవాడు. ఆ ఒక్కరోజు మేసినంత మేసి మళ్లీ గురక తీసేవాడు. జగన్ మాత్రం తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాదిలో 365 రోజులూ రాష్ట్రాన్ని నంజుకుని తింటూనే ఉన్నారు. ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను నిరంతరాయంగా నమిలి మింగేస్తున్నారు. దొంగలు దొంగలూ కలిసి ఊళ్లు పంచుకున్నట్లు- రాష్ట్రంలోని ఇసుక రీచ్లను వైకాపా నేతలు పంచుకున్నారు. లేదు... లేదు... వారికి అలా పంచిపెట్టి తమ ఇనప్పెట్టెలు నింపుకొన్నారు అధినాయకులు. నదులను తోడేసి తాము పోగేసుకున్న నల్లధనం గుట్టల కింద జనం బతుకులను నలిపేసి నుగ్గునుగ్గు చేశారు ఆ ఇసుకాసురులు!
జగదేక నటచక్రవర్తి
ప్రతిపక్షనేతగా నవరసాలను అద్భుతంగా పండించారు జగన్. ‘‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే రాష్ట్రంలో మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు’’ అంటూ భారీ డైలాగులు చెప్పారు. అదే మనిషి ముఖ్యమంత్రి అయ్యాక దేవాలయాలను అపవిత్రం చేసే దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడ్డారు. ఇక సహజ వనరుల సంరక్షణ గురించి జగన్ మాట్లాడటం అంటే- ఒక నరహంతకుడు అహింసపై ఉపన్యాసం దంచినట్లే. గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని జగన్ అప్పట్లో తెగ ఆడిపోసుకున్నారు. సీఎం కాగానే ఆ విధానానికి చరమగీతం పాడేశారు. ఇసుక తవ్వకాలను ఆపించేశారు. దాంతో ఒక్కసారి ఇసుక అతిఖరీదైన సరుకైంది. గిరాకీకి తగినట్లు సరఫరాలు లేక నిర్మాణదారులు నానా అవస్థల పాలయ్యారు. నిర్మాణ రంగం నేలకరచుకుని పోయింది. దానికి అనుబంధమైన 25 రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అలా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అరాచకత్వానికి జగన్ అంటుకట్టారు. పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు కన్నీళ్లతో కడుపులు నింపుకోవాల్సిన దుస్థితిని కల్పించారు.
పక్క రాష్ట్రాలకు స్మగ్లింగ్
జగన్మోహన్రెడ్డి డిక్షనరీలో పాలించడం అంటే- జనంపై మాటల మత్తుమందును గుమ్మరించడం! ఆ జగన్మాయ విద్యను ప్రదర్శిస్తూ 2019లో కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చారాయన. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ద్వారా రోజుకు సుమారు 2 లక్షల టన్నుల ఇసుకను అందరికీ అందబాటులో ఉంచుతామంటూ కోతలు కోశారు. ఆన్లైన్లో బుకింగ్లని, డోర్ డెలివరీలని గప్పాలు కొట్టుకున్నారు. జగన్ మాటలను నమ్మి ఇసుకకోసం ఆన్లైన్ను ఆశ్రయించిన వారికి ఆశాభంగాలు తప్పలేదు. బుకింగ్లు తెరుచుకున్న క్షణాల్లోనే నిల్వలన్నీ ఖాళీ అయిపోయినట్లు కనిపించేది. ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగిపోయాయి. ఆకలితో అల్లాడుతూ కార్మికులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దౌర్భాగ్య పరిస్థితులు రాజ్యమేలాయి. అలా సామాన్యులకు ఇసుక బంగారమైన రోజుల్లోనే పక్క రాష్ట్రాలకు అక్రమ సరఫరాలు పోటెత్తాయి. తవ్విన ఇసుక నిల్వ కేంద్రాలకు చేరేలోపే దారిమళ్లడం జోరందుకుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు రాత్రిపూట టిప్పర్లలో పెద్దయెత్తున ఇసుక తరలింపు సర్వసాధారణమైంది. క్షేత్రస్థాయిలో అక్రమార్కులు అలా స్వేచ్ఛగా దోచుకుపోతుంటే- ‘‘ఇసుక స్మగ్లింగ్కు ఏమాత్రం అవకాశం లేకుండా సరిహద్దుల్లో నిఘా పెంచాలి’’ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూ కూర్చున్నారు జగన్. ఎక్కడికక్కడ స్థానిక పెత్తందారులు భాగస్వాములు కావడంతో ఇసుక దోపిడీవైపు జగన్ విధేయ ఖాకీలు కన్నెత్తి చూడలేదు.
ఇసుక దోపిడీకి టెండర్ల నాటకం
కొత్త ఇసుక పాలసీతో అక్రమాలకు గేట్లెత్తిన జగన్- తమ విధానం దేశానికే రోల్మోడల్గా నిలిచిందని తన భుజం తానే చరుచుకున్నారు. అలా సొంతడబ్బా కొట్టుకున్న కొద్ది కాలానికే ఆ పాలసీని పక్కనపెట్టేశారు. 2021లో టెండర్ల నాటకాన్ని మహాద్భుతంగా రక్తికట్టించి రాష్ట్రంలోని ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఎక్కడో ఉత్తర భారతానికి చెందిన జేపీ సంస్థకు అప్పగించారు. అప్పటికి కొద్దిరోజుల మునుపే చెన్నైలో పుట్టుకొచ్చిన టర్న్కీ సంస్థ- జేపీకి ఉప గుత్తేదారుగా రాష్ట్రంలోకి ప్రవేశించింది. వైకాపాకు దగ్గరి మనిషైన ఓ మైనింగ్ వ్యాపారి చేతుల మీదుగా పురుడుపోసుకున్న టర్న్కీ- జగన్ అంతేవాసుల ఇసుక మేతలకు పనిముట్టుగా పనికొచ్చింది. జేపీ, టర్న్కీ పాత్రలన్నీ పేరుకే... వాస్తవానికి జగన్ పెంచిపోషించిన ప్రబుద్ధులే జిల్లాల వారీగా సిండికేట్లు ఏర్పాటుచేసి ఇసుకను ఇష్టారీతిన కాజేశారు. అడ్డుకోవాల్సిన అధికారులేమో ఇసుక రీచ్లు, నిల్వ కేంద్రాల వైపు కన్నెత్తి చూడకుండా జగన్ పార్టీ దందాలకు ఎదురు కాపలా కాశారు. అలా రాష్ట్ర యంత్రాంగాన్ని తమ కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుని- కంప్యూటరైజ్డ్ వేబిల్లులు, డిజిటల్ చెల్లింపులు వంటివి ఏమీ లేకుండా, ఏ రీచ్లో ఎంత తవ్వుకుపోయారో ఎవరికీ అంతుబట్టని రీతిలో జగన్ అనుచరగణాలు ఇసుకను గుటకాయ స్వాహా చేశాయి.
జగన్ బంధుజనం ఆధీనంలో ఇసుక
టర్న్కీ ద్వారా తమ ధనదాహం పూర్తిగా తీరడం లేదనో ఏమో కానీ 2022లో ఆ సంస్థను ఉన్నపళంగా తప్పించారు. పేరుకు రికార్డుల కోసం వేరే సంస్థలు రెండింటిని ఉపగుత్తేదారులుగా తెరపైకి తెచ్చి ఇసుక దోపిడీని తీవ్రతరం చేశారు. అధికారిక రాతకోతలు, జీఎస్టీ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురుకావడంతో టర్న్కీని మళ్లీ తీసుకొచ్చారు. జేపీ కాంట్రాక్టు కాలపరిమితి పూర్తికావడంతో కొద్ది నెలల క్రితం ప్రతిమా ఇన్ఫ్రా(తెలంగాణ), జీసీకేసీ(రాజస్థాన్) సంస్థలు రాష్ట్రంలోకి అడుగుపెట్టాయి. జగన్కు వరసకు సోదరుడయ్యే వైఎస్ అనిల్రెడ్డి వాటిని వెనకుండి నడిపిస్తూ ఇసుక దోపిడీకి ఇరుసుగా మెలుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైకి ఏ సంస్థలు కనపడితేనేమి- జగన్ అధికారంలోకి వచ్చాక ఇసుక తవ్వకాలు, అమ్మకాలన్నీ ఆయన సన్నిహితుల కనుసన్నల్లోనే జరిగాయి... జరుగుతున్నాయి. ఇసుక సిండికేట్లకు జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సొమ్మును వైకాపా పెద్దలు దిగమింగినట్లు అంచనా! అధినాయకులకు అంతగా కప్పంకట్టిన స్థానిక సామంతులు ఇంకెంత వెనకేసుకున్నారో... మొత్తమ్మీద జగన్ పార్టీ గజదొంగలు అందరూ కలిసి ఎంత ఇసుకను మాయం చేశారో బయట నరమానవుడికి తెలియదు.
కోర్టులను ధిక్కరించి మరీ...
అనుమతులూ నిబంధనలతో నిమిత్తం లేకుండా భారీ యంత్రాలతో నదీగర్భాలను చీల్చేసింది జగన్ ముఠా. ‘వాల్టా’ చట్ట నిబంధనలను బేఖాతరు చేస్తూ గోదావరి, కృష్ణా, పెన్నా తదితర నదుల్లో ఇసుకను తోడేశారు. వంతెనలకు సమీపంలోనూ తవ్వకాలు చేపట్టి, వారధులను ప్రమాదం అంచుకు నెట్టేశారు. రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సియా) అనుమతించేంత వరకు ఇసుక తవ్వకాలను చేపట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. ఎన్జీటీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. జగన్ సర్కారు మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. ప్రైవేటు సైన్యాల పహారాల నడుమ ఇసుక రీచ్ల్లో తోడివేతలు సాగుతుంటే- ఎక్కడా తవ్వకాలే జరగట్లేదని జగన్ ప్రభుత్వం అడ్డంగా వాదించింది. ఏకంగా హైకోర్టుకే అబద్ధాలు చెప్పింది. పర్యావరణ అనుమతులేమీ లేకుండానే పట్టపగలే ఇసుక లూఠీ జరిగిపోతుంటే- అబ్బే అదేమీ లేదు, ఎన్జీటీ ఆదేశాలను పాటిస్తున్నామని దొంగ వేషాలు వేసింది జగన్ సర్కారు. ఇసుక రీచ్లను పరిశీలించి నిజానిజాలను తేల్చమని కలెక్టర్లను ఎన్జీటీ ఆదేశించింది. వారేమో చాలాచోట్ల జగన్ అనుచరగణాలకు ‘అయ్యా..ఎస్’ అని ఉత్తుత్తి తనిఖీలు చేశారు. ప్రజలకు, చట్టాలకు, కోర్టులకు విలువ ఇవ్వని జగన్- ప్రజాస్వామ్యానికి పట్టిన వేరుపురుగు అంటే కాదనేదెవరు?
ఎన్నో ప్రాణాలు బలి
నదీనదాల జీవం తీస్తూ అట్టడుగు పొరల దాకా ఇసుకను తోడేయడంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. ఊటబావులు అడుగంటిపోవడం నుంచి తాగునీటి పథకాలు డస్సిపోవడం దాకా అనేక ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ‘‘ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. జీవనదులు సైతం వట్టిపోయే పరిస్థితి దాపురిస్తోంది. ఇసుకను తోడుకునేందుకు ప్రభుత్వాలూ సహకరిస్తున్నాయి. నిబంధనల మేరకు మీటరు లోతు మాత్రమే తవ్వాల్సి ఉండగా నదిలో రాయి తేలేవరకు తోడేస్తున్నారు. పెన్నా, చిత్రావతి నదుల్లో ఇసుకను ఖాళీ చేసేశారు. ఇక్కడ రాళ్లు తేలాయి. ఇది ఎంత ప్రమాదకరమన్నది గుర్తించాలి’’ అని ఏపీ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. నదుల్లో ఇసుక తోడివేతలు ఇలాగే సాగితే భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన జగన్ స్వస్థలం కడపలోనే హెచ్చరించారు. అయినా అటువంటి హితవచనాలను చెవికెక్కించుకునే అలవాటు జగన్కు ఏనాడుంది? పరిమితికి మించి ఇసుకను తరలించే వాహనాలతో ఒకపక్క రోడ్లు ధ్వంసమైతే- మరోవైపు నదుల్లో తాటిచెట్ల లోతున పడిన గుంతలు ఎన్నో ప్రాణాలను బలితీసుకున్నాయి. సహజసిద్ధమైన ఇసుకను అంగడి సరుకుగా మార్చి, సామాన్యుల నెత్తిన మోయలేని భారం మోపారు జగన్. ఏపీలో ఇసుకను కొల్లగొడుతున్న మాట వాస్తవమని కేంద్రమే తాజాగా హైకోర్టుకు తెలియజేసింది. అక్రమ తవ్వకాలను అడ్డుకోకపోతే అధికారులపై చర్యలు తప్పవని ఉన్నత న్యాయస్థానమూ హెచ్చరించింది. అయినా సరే, జగన్కు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇసుకాసురులకు పెద్దన్నగా అవతరించిన ఆయన కారణంగానే రాష్ట్ర సంపద అపరిమితంగా మాయమైంది.
సీఎంవో మనుషులట... దోచేస్తారట!
దేశంలో మరే రాష్ట్రంలోనైనా ఇసుక వ్యాపారం చేయడానికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి మనుషులు వస్తారా? జగన్ పాలబడిన మన రాష్ట్రంలో కొందరు అలాగే చెప్పుకొని దందాలు నడిపించారు. మొన్న డిసెంబరులో ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుల్లోని పలు ఇసుక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్టుండి కొత్త వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. తాము సీఎంవో నుంచి వచ్చామంటూ నానా హడావుడి చేశారు. అనుమతులేమీ లేకుండా దర్జాగా రేవుల్లో ఇసుక తవ్వకాలు, అమ్మకాలు కానిచ్చేశారు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఇసుక తవ్వాలంటే ప్రభుత్వం అనుమతించాలి. ‘రివర్స్’ సీఎం జగన్ జమానాలో అలా కుదరదు. ఆయన బంధువులు, సన్నిహితులు, నమ్మినబంట్లదే రాజ్యమంతా! పెన్నా నదిలోని అనధికారిక ఇసుక రీచ్కోసం జగన్ సమీప బంధువైన దుగ్గాయపల్లె వీరారెడ్డికి తాను రూ.81 లక్షలు చెల్లించినట్లు పి.నారాయణరెడ్డి అనే వ్యాపారి వెల్లడించారు. ఇసుక రేవులను కొంతమందికి సబ్ లీజ్కు ఇచ్చానని వీరారెడ్డి కూడా అదురూబెదురు లేకుండా ఒప్పుకొన్నారు. జగన్ బంధుమిత్ర పరివారజనమంతా ఇలా రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా పంచుకుని అందినకాడికి కొల్లగొట్టేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ అసంతృప్తి
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్