వైకాపా సమావేశంలో గ్రామ వాలంటీరు

విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని ఓ ఫంక్షన్‌ హాల్లో భీమిలి మండల వైకాపా శ్రేణులతో మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం రాజకీయ సమావేశం నిర్వహించారు.

Published : 27 Mar 2024 04:32 IST

విశాఖపట్నం (తగరపువలస), న్యూస్‌టుడే: విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని ఓ ఫంక్షన్‌ హాల్లో భీమిలి మండల వైకాపా శ్రేణులతో మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం రాజకీయ సమావేశం నిర్వహించారు. ఇందులో భీమిలి మండలం లక్ష్మీపురం పంచాయతీకి చెందిన గ్రామ వాలంటీరు ఆవాల గౌరీశంకర్‌ పాల్గొని నేతలతో ఫొటో దిగారు. దీనిపై ఆయన్ని ప్రశ్నించగా.. తాను వైకాపా సోషల్‌ మీడియా మండల కన్వీనరుగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. ఆ హోదాలోనే సమావేశంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని