తెలంగాణలో భేష్.. ఏపీలో తుస్!
ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది.
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది కొరత
హెల్త్ హబ్స్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల వెనకడుగు
గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రుల పనులూ నత్తనడక
తెలంగాణలో రూ.5 వేల కోట్లతో ఐదు సూపర్ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణం
మెడికల్ కళాశాలల ఏర్పాటులోనూ ముందంజే..
పక్క రాష్ట్రాన్ని చూసి కూడా పాఠాలు నేర్వని జగన్
ఈనాడు, అమరావతి
నవజాత శిశువుల కోసం ఆసుపత్రులు కడతామన్నారు..
స్థల సేకరణతో ఆపేశారు.
గిరిజనుల కోసం అయిదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులన్నారు..
పునాదుల దశ దాటడమే కష్టమైంది.
దవాఖానా కడతామంటే స్థలం ఉచితంగా ఇస్తామన్నారు.
నమ్మకం లేక పారిశ్రామికవేత్తలెవరూ ముందుకు రాలేదు.
సరిపడా సూపర్ స్పెషలిస్టు వైద్యులు లేక.. నర్సులు, సిబ్బందిని నియమించక.. ఆంధ్రావనిలో మెరుగైన వైద్యం మిథ్యగా మారింది.
- అందుకే.. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ.. ఏపీకి టాటా చెబుతూ వైద్యం కోసం తెలంగాణ బాట పడుతున్నారు.
- వైద్య రంగంలో అక్కడి పురోగతిని పోల్చుకొని సిగ్గుపడుతున్నారు.
- జగన్ పాలనలో నాడి పట్టే వ్యవస్థ గాడి తప్పి అస్తవ్యస్తమైంది.
ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, వైద్యం అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం మెరుగైన వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఈ విషయంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ దూసుకెళ్తుంటే.. జగన్ పాలనా వైఫల్యంతో ఆంధ్ర వెనకబడిపోయింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్లోనూ తెలంగాణ పకడ్బందీ ప్రణాళికలతో ముందుంది. ఆ రాష్ట్రంలో కొత్తగా ఐదు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులు రాబోతున్నాయి. మన దగ్గర మాత్రం అందుకు భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రకటనలతోనే కాలయాపన చేస్తూ.. రోగులకు చుక్కలు చూపించింది. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత వేధిస్తున్నా.. భర్తీ మాటే ఎత్తలేదు. అవసరానికి తగినట్లుగా వైద్య సేవలను విస్తరించలేదు. ఇక్కడి ప్రజాప్రతినిధులంతా మెరుగైన వైద్యానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు బాట పడుతుండటమే ఇందుకు నిదర్శనం. చిన్నారులకు వైద్య సేవల కోసం హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రే దిక్కుగా మారింది. ‘నాడు-నేడు’లో భాగంగా రూ.3,500 కోట్లతో బోధనాసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని జగన్ గొప్పలకు పోయినా.. నిధులు లేక అడుగు కూడా ముందుకు పడలేదు.
వైద్యులు లేరు.. నర్సులు, సిబ్బంది సరిపోరు..
ఏపీలో వైద్య విద్య సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్-డీఎంఈ) పరిధిలో 22 బోధనాసుపత్రులు ఉన్నాయి. గతేడాది నుంచి రెండు దశల్లో కొత్తగా 10 బోధనాసుపత్రులు (వైద్య కళాశాలలు) డీఎంఈ పరిధిలోకి వచ్చాయి. అన్ని బోధనాసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత వేధిస్తోంది. రోగులు వస్తున్నా.. వారి అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు లేవు. గతేడాది ఏర్పాటైన ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల బోధనాసుపత్రుల్లో సరిపడా నర్సులు, ఇతర సిబ్బంది లేరు. ఒక్కో ఆసుపత్రిలో నాలుగో తరగతి సిబ్బంది కనీసం వంద మంది వరకు అవసరం ఉంటుంది. వారు లేకపోవడంతో రోగుల బాగోగులను బంధువులే చూసుకోవాల్సి వస్తోంది. మాతా, శిశు సంరక్షణ ఆసుపత్రుల్లో ఒక పడకపై ఇద్దరు బాలింతలు చికిత్స పొందే పరిస్థితులు గుంటూరు, విజయవాడల్లోనూ కనిపిస్తున్నాయి.
కాగితాలపైనే చిన్న పిల్లల ఆసుపత్రులు
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని 2021 జూన్ 7న వైకాపా సర్కారు ప్రకటించింది. ఒక్కోదానికి రూ.186 కోట్ల చొప్పున మొత్తం రూ.558 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ పీడియాట్రిక్ కేర్ సెంటర్ల కోసం ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణ జరిగినా ఇప్పటివరకు ఇటుక కూడా పడలేదు. ఒక్కో ఆసుపత్రిలో 500 పడకలు ఉండేలా.. సూపర్ స్పెషాలిటీ వైద్యులతో అన్ని రకాల శస్త్రచికిత్సలు జరిగేలా చూస్తామని జగన్ చెప్పినా.. అవి ఉత్తుత్తి మాటలేనని తేలిపోయింది. ఆరోగ్యశ్రీ కింద చిన్నారులకు గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేసే ఆసుపత్రులు రాష్ట్రంలో రెండు మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.
తెలంగాణలో 50వేలు... ఆంధ్రాలో 32వేలు
తెలంగాణలో అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీల్లోని 8,500 పడకలతో కలిపితే.. ప్రభుత్వ పరంగా మొత్తం 50 వేల పడకలు అందుబాటులో ఉన్నట్లు లెక్క. రూ.5,435 కోట్లతో చేపట్టిన ఈ కొత్త ఆసుపత్రుల నిర్మాణాలు హైదరాబాద్ చుట్టుపక్కల, వరంగల్ నగరంలో జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సిబ్బంది నియామకాల ప్రక్రియ కూడా మొదలైంది. ఇవన్నీ జాతీయ రహదారులకు చేరువలోనే ఉండటంతో క్షతగాత్రులకు అత్యవసర సమయం(గోల్డెన్ అవర్)లో మెరుగైన చికిత్స అందనుంది. ఏపీలో మాత్రం వైద్య సేవలు మెరుగుపరుస్తామని జగన్ పలుమార్లు ప్రకటించినా.. అవేమీ కార్యరూపం దాల్చలేదు. 2022లో గిరిజన ప్రాంతాల్లో అయిదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల భవన నిర్మాణాలు ప్రారంభించగా.. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 16 హెల్త్ క్లబ్బులు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించినా.. అమలుకు నోచుకోలేదు.
రూ.100 కోట్ల పెట్టుబడితో ఆసుపత్రుల ఏర్పాటుకు ముందుకు వస్తే.. ఉచితంగా భూమి ఇస్తామని ప్రభుత్వం 2021 నవంబరులో ప్రకటించింది. పలుమార్లు టెండర్లు కూడా పిలిచింది. అయినా ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం. రాజమహేంద్రవరం, ఒంగోలులో ఏర్పాటుకు రెండు వేర్వేరు సంస్థలు అతికష్టంపై ముందుకొచ్చినా పనులు మాత్రం కార్యరూపం దాల్చలేదు. విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లో పిల్లల ఆసుపత్రుల నిర్మాణ పనులూ కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో అన్ని రకాల ఆసుపత్రుల్లో కలిపి 32 వేల వరకు పడకలు ఉండగా.. ఇందులో 3 వేల వరకు మాత్రమే సూపర్ స్పెషాలిటీ విభాగంలోనివి. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో రోజూ నమోదయ్యే ఓపీలో 25 శాతం నుంచి 30 శాతం వరకు ఏపీ వాళ్లే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
బోధనాసుపత్రుల వారీగా సూపర్ స్పెషలిస్టు వైద్యుల కొరత
- విశాఖలోని ‘విమ్స్’లో ఇప్పటి వరకు కార్డియో థొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాల్లో వైద్యులు లేరు.
- విశాఖ కేజీహెచ్లో ఈఎన్టీ సర్జరీ, సైకియాట్రీ, ఆఫ్తామాలజీ సర్జరీ, రుమటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కాకినాడ జీజీహెచ్లో ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జరీ, రుమటాలజీ విభాగాల్లో వైద్యుల కొరత ఉంది.
- విజయవాడ జీజీహెచ్లో ఎండో క్రైనాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, గుంటూరు జీజీహెచ్లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల్లో వైద్యులు లేరు.
- ఒంగోలు జీజీహెచ్లో కార్డియో థొరాసిక్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెల్లూరు జీజీహెచ్లో కార్డియో థొరాసిక్ సర్జరీ, కార్డియాలజిస్టుల అవసరం ఉంది.
- తిరుపతి రుయాలో కార్డియో థొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఆంకాలజీ విభాగాల్లో స్పెషలిస్టులు లేరు.
- అనంతపురం జీజీహెచ్లో కార్డియో థొరాసిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, రుమటాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, యూరాలజీ విభాగాల్లో వైద్యుల కొరత ఉంది.
గిరిజనులపై కపట ప్రేమ
గిరిజనులపై వైకాపా ప్రభుత్వం కపట ప్రేమను కనబరుస్తోంది. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల (ఐటీడీఏ)లలో రూ.49.26 కోట్ల చొప్పున రూ.246.30 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి 2020 సెప్టెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సంబంధిత పనులను 2021లో సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ నిర్మాణాలు పూర్తయితే.. ఓపీ సేవలతోపాటు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, డెంటల్, పీడియాట్రిక్ సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చేవి. సుమారుగా 50మంది వైద్య నిపుణులు నియామకం కానున్నారు. 20 డయాలసిస్, 20 జనరల్ ఐపీ, 21 ఎస్ఐసీయూ, 10 ఎంఐసీయూ, ఆర్థో విభాగంలో 30 పడకలు అందుబాటులోకి వచ్చేవి. కానీ, పనులన్నీ నత్తనడకన సాగుతుండటంతో గిరిజనులకు మెరుగైన వైద్యం కలగానే మిగిలింది. వాటి నిర్మాణాల పురోగతిపై సమీక్షించే వారే కరవయ్యారు.
ఇలాగేనా క్యాన్సర్కు వైద్యం?
కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆసుపత్రిని ఇటీవల ప్రారంభించినా.. అది ప్రాథమిక వైద్య సేవలకే పరిమితమైంది. కీలకమైన లీనియర్ యాక్సిలరేటర్-1 విభాగాన్ని ఏర్పాటు చేయలేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఈ ఒక్క పరికరం ఖరీదే రూ.54కోట్లు ఉంటుంది. మొత్తం 250 మంది వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది అవసరం ఉండగా.. 17 మంది వైద్యులు, 20 మంది ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. కీలకమైన ఉపకరణాలు లేకుండా క్యాన్సర్ వైద్యం ఎలా అందించాలో జగన్కే తెలియాలి. కర్నూలు జీజీహెచ్లోనూ సాధారణ క్యాన్సర్ వైద్య సేవలే అందుతున్నాయి.
అవయవ మార్పిడిలోనూ వెనకబాటే..
ప్రభుత్వ వైద్య సేవల్లో అవయవ మార్పిడిని కూడా తెలంగాణ ప్రభుత్వం ఓ భాగంగా చేసింది. హైదరాబాద్లోని నిమ్స్తోపాటు గాంధీ ఆసుపత్రిలోనూ అందుకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ కిడ్నీ, కాలేయం, గుండె తదితర అవయవ మార్పిడిలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏపీ నుంచి ఎక్కువ మంది హైదరాబాద్లోనే ఈ రకమైన శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. ఈ విషయంలోనూ ఏపీ వెనకబడింది. ఇటీవలే కర్నూలు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్లో ఒక్కో కిడ్నీ మార్పిడి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!