ఇక్కడే ఎందుకో ఈ ని‘బంధనాలు’!
‘‘ఇంటింటి ఎన్నికల ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలా? కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఈ నిబంధన లేదు.
‘ఇంటింటి ప్రచారానికి అనుమతి’పై వివిధ పార్టీల నేతల అభ్యంతరం
సీఈఓకు తమ అసంతృప్తి తెలియజేసినట్లు వెల్లడి
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘‘ఇంటింటి ఎన్నికల ప్రచారానికి కూడా అనుమతి తీసుకోవాలా? కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ ఈ నిబంధన లేదు. నిరుడు డిసెంబరులో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సైతం ఈ తరహా నియమాలేవీ లేవు. మీరు ఇక్కడ పెట్టడమేంటి?’’ అని తెదేపా సహా పలు పార్టీల నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వద్ద అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో తెదేపా, జనసేన, వైకాపా, భాజపా, వామపక్ష, తదితర రాజకీయ పార్టీల నేతలతో సీఈఓ సమావేశం నిర్వహించారు. సభలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలకు 48 గంటల ముందుగానే ‘సువిధ’ పోర్టల్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారి(ఆర్వో)కి దరఖాస్తు చేసుకోవాలని.. పోర్టల్ పనితీరును సీఈఓ వివరించారు. వాటిని పరిశీలించాక 24 గంటల్లోనే అనుమతులిస్తారని ఆయన తెలిపారు.సమావేశంఅనంతరం సీఈఓకు తెలిపిన అభ్యంతరాలను విలేకర్ల సమావేశంలో నేతలు వెల్లడించారు.
మా ఫిర్యాదులపై సీఈఓ స్పందించడం లేదు
- బొండా ఉమామహేశ్వరరావు, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు
‘‘చిన్న స్థాయి ప్రచార కార్యక్రమాలకు సైతం అనుమతులు తీసుకోవటం అభ్యంతరకరమైన విధానమని సీఈఓకి చెప్పాం. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు లేనిపోని నిబంధనలు పెట్టి, అధికార పార్టీ వారు కుక్కర్లు, చీరలు, డబ్బు, మద్యాన్ని యథేచ్ఛగా పంచుతున్నా సీఈఓ స్పందించడం లేదు. చర్చిలు, మసీదులను సైతం ఎన్నికల ప్రచారం కోసం వాడుతున్నారు. వైకాపా నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే సీ-విజిల్ ద్వారా ఫిర్యాదులు చేశాం. అయినా వాటిపై చర్యలు లేవు. ఇదేనా పారదర్శకత? తెదేపా ఇచ్చిన ఫిర్యాదులపై సీఈఓ చర్యలు తీసుకోవాలి.’’
సజ్జల భార్గవ్రెడ్డి వాహనాన్ని తనిఖీ చేయరా?
-వర్ల రామయ్య, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు
‘‘సజ్జల భార్గవ్రెడ్డి వాహనంలో రూ.8 కోట్లు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నా వారిని తనిఖీ చేయడం లేదు. మరోవైపు ఎన్నికల నిబంధనలు పాటిస్తున్న తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రచారానికి వాహనాల తనిఖీల పేరుతో తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు ఇంకా వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఓ మసీదులో డబ్బు పంచడంపై ఆధారాలతో సహా సంబంధిత ఆర్వోకి ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ కాబట్టి వారిపై చర్యలు తీసుకోలేమని చెప్పడమేంటి? అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిపైనా సీఈఓకు ఫిర్యాదు చేశాం. ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఆర్జించిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి వైకాపా ప్రయత్నిస్తోంది. ఇసుక తవ్వకాలపై అన్ని జిల్లాల నుంచి నివేదిక ఇవ్వాలని సీఎస్ కోరినా పంపకుండా కలెక్టర్లు తాత్సారం చేస్తున్నారు’’
నిబంధనలపై పునఃపరిశీలన చేయాలి
- వై.వెంకటేశ్వరరావు, సీపీఐ (ఎం) నేత
‘‘ఎన్నికల ప్రచారంలో కరపత్రాల పంపిణీకి సైతం అనుమతి తీసుకోవాలనే నిబంధన సహా పలు అంశాలపై పునఃపరిశీలన చేయాలని సీఈఓను కోరాం. రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యాలయాల దగ్గర ఏర్పాటు చేసిన జెండాలు, బ్యానర్లు తొలగించకుండా ఆదేశాలివ్వాలని, మేడే నిర్వహణకు ఎలాంటి ఆంక్షలూ పెట్టొద్దని విన్నవించాం’’
ప్రతి దానికీ అనుమతులంటే కష్టం
-మల్లాది విష్ణు, వైకాపా ఎమ్మెల్యే
‘‘ఇంటింటి ఎన్నికల ప్రచారానికి, ఆఖరికి పాంప్లెట్ల పంపిణీకి కూడా అనుమతులు తీసుకోవడం చాలా కష్టం. ఇదే విషయాన్ని సీఈఓకు వివరించాం. ప్రచారానికి 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను సడలించాలని కోరాం’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం