సుద్దులు చెప్పి.. సున్నం కొట్టి..
‘‘తెలుగుదేశం ప్రభుత్వం కొత్త ప్రభుత్వంపై రూ.వేల కోట్ల పెండింగు బిల్లుల భారం వేసింది. రూ.42 వేల కోట్ల పెండింగు బిల్లులు వదిలేసింది.
ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.60వేల కోట్ల బిల్లులు పెండింగు
మొత్తం పెండింగు రూ.1.50 లక్షల కోట్ల పైమాటే...
చివర్లోనూ సొంత గుత్తేదారులకే జగన్ సర్కారు చెల్లింపులు
ఈనాడు, అమరావతి
‘‘తెలుగుదేశం ప్రభుత్వం కొత్త ప్రభుత్వంపై రూ.వేల కోట్ల పెండింగు బిల్లుల భారం వేసింది. రూ.42 వేల కోట్ల పెండింగు బిల్లులు వదిలేసింది. అంగన్వాడీలు, ఇతరత్రా చెల్లింపులనూ పెండింగులో ఉంచింది. గుత్తేదారులకు బిల్లులు చెల్లించింది.
2019 జులై10, అక్టోబరు 11 తేదీల్లో విలేకర్లతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వల్లించిన సుద్దులివి. అసలు అప్పులంటేనే తప్పన్నట్లు... అటువైపే చూడబోమన్నట్లు ధర్మప్రభోదాలు చేశారు. అందరికీ బిల్లులు సక్రమంగా చెల్లించే కట్టుతప్పని కఠిన నిబంధనలు తామేదో అమలు చేస్తామన్నట్లుగా అమాయకపు పోజులు పెట్టారు. సీఎం జగన్ నోట్లోంచే ఆ మాటలు జాలువారినట్లుగా ప్రభుత్వం గొప్పలను అందరికీ చెవిలో జోరీగలా వినిపించారు. గడిచిన అయిదేళ్లలో జగన్ ప్రభుత్వ స్వరూపం ఏమిటో తేటతెల్లమయిపోయింది. ఆఖరికి చివరి ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లోనూ ఈ ప్రభుత్వ ఆర్థిక సొగసు ఏమిటో, ఆర్థికసూత్రాలేంటో మొత్తం బయట పడిపోయాయి. నోరు విప్పి సుద్దులు వినిపించిన వాళ్లేనా.. ఇలా చేసేది అని అంతా నోరు వెళ్లబెట్టవలసి వస్తోంది!
రాబోయే కొత్త ప్రభుత్వంపై జగన్ సర్కారు రూ.లక్షల కోట్ల అప్పుల భారం, కార్పొరేషన్ రుణాల భారం, రూ.లక్ష కోట్లకు పైగా పెండింగు బిల్లుల భారం నెట్టేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.60వేల కోట్ల మేర పెండింగు బిల్లులు చెల్లించకుండా వదిలేసింది. పాతవన్నీ కలిపితే అనధికారిక లెక్కల ప్రకారం రూ.1.50 లక్షల కోట్ల బకాయిలు ఉంటాయని అంచనా. ఈ లెక్కలను ఆర్థికశాఖ బయటపెట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే కొవిడ్ కాలం నాటి అత్యవసర బిల్లులనూ ఇంకా చెల్లించలేదు.
బడా గుత్తేదారులంటేనే ఎంతో ప్రేమ
‘పెండింగు బిల్లులు చెల్లించండి మహాప్రభో! ఇలాగైతే మా జీవితాలు ఏం కావాలి.. వడ్డీలు ఎలా చెల్లించాలి అంటూ ఎందరో సామాన్యులు, చిన్న గుత్తేదారులు గగ్గోలు పెడుతున్నా, హైకోర్టు ఆదేశాలిచ్చినా కరుణించకపోగా సొంత అనుయాయులకు జగన్ రూ.వేల కోట్లు సమర్పించేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా రూ.14వేల కోట్లు పంచారు. చేతిలో డబ్బులు లేకపోతే చివరి నిమిషంలోనూ కార్పొరేషన్ల ద్వారా రూ.4,000 కోట్ల అప్పులు పుట్టించి తనవారికి బిల్లులు ఇచ్చేశారు. మరోవైపు సామాన్యులెందరికో బిల్లులు ఎగ్గొట్టారు. మొదటినుంచి తన అనుయాయులకు మేలు చేయడమే లక్ష్యంగా ఫిఫో (ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్) విధానానికి జగన్ ప్రభుత్వం మంగళం పాడేసింది.
కోడిగుడ్ల బిల్లులూ అంతే... రైతులకూ ఇంతే సంగతులు
పేద విద్యార్థులకు ఆహారం అందించే బిల్లులనూ చెల్లించలేదు. మధ్యాహ్నభోజన పథకంలో భాగంగా విద్యార్థులకు సరఫరా చేసే కోడిగుడ్ల బిల్లులు పెద్దమొత్తంలో పెండింగులో ఉండిపోయాయి. చిక్కీల సొమ్ములూ ఇవ్వలేదు. ఈ రెండూ కలిపి రూ.1,890 కోట్లు పెండింగులో ఉన్నాయి. మరోవైపు రైతులకు పెట్టుబడి సాయం, రైతుభరోసా సొమ్ములు రూ.2,500 కోట్ల వరకు పెండింగులోనే ఉన్నాయి. సూక్ష్మసేద్యం బిల్లులు రూ.4,000 కోట్ల మేర పెండింగులో ఉన్నాయి. జలకళ కింద రూ.100 కోట్లు చెల్లించాలి.
రహదారులకు, నీరు చెట్టు, సాగునీటి ప్రాజెక్టులూ..
న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణసాయంతో చేపట్టిన రహదారుల నిర్మాణానికి రూ.200 కోట్లు చెల్లించాలి. కేంద్ర రహదారుల మౌలిక వసతుల నిధి కింద రూ.400 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణంతో చేసిన రహదారుల పనులకు రూ.200 కోట్లు పెండింగులో ఉన్నాయి. జలవనరుల శాఖలో ఎప్పటివో నీరు-చెట్టు బిల్లులు రూ.వందల కోట్లు అలాగే ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో చిన్న చిన్న బిల్లులూ పెండింగులోనే ఉన్నాయి. పెద్ద గుత్తేదారులకే ప్రయోజనం కలుగుతోంది.
ఉద్యోగులకు రూ.25 వేల కోట్ల పైమాటే..
రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 వేల కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగసంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వమే ఈ విషయాన్ని ప్రకటించింది. కరవు భత్యం బకాయిలు, పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవు అన్నీ పెండింగులోనే ఉంచేశారు. పదవీవిరమణ ప్రయోజనాలు ఇవ్వడం లేదు. సీపీఎస్ ఉద్యోగుల పింఛను నిధికి జమచేయాల్సిన మొత్తాలు అనేకం పెండింగులో ఉన్నాయి. పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.2,500 కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించి.. మళ్లీ వాయిదా వేసింది.
టిడ్కో లబ్ధిదారులకూ కష్టాలు
టిడ్కో గృహాల లబ్ధిదారులకు రూ.320 కోట్ల వరకు పెండింగులో ఉంది. గుత్తేదారులకు రూ.450 కోట్ల వరకు ఇవ్వాలి. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల పనులు చేసిన గుత్తేదారులకు దాదాపు రూ.300 కోట్లు, ఇళ్ల స్థలాల కోసం భూములిచ్చిన రైతులకు రూ.1,150 కోట్లు, పాస్టర్ల గౌరవవేతనం రూ.12 కోట్లు, ఎస్సీ, ఎస్టీ బీసీ వసతిగృహాలకు రూ.50 కోట్లు పెండింగులోనే ఉన్నాయి. చేయూత స్కీం కింద రూ.4,000 కోట్లకు గాను చాలా చెల్లింపులు ఇప్పటికీ పూర్తికాలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపొనెంట్ కింద భవన నిర్మాణ పనులకు రూ.600 కోట్ల వరకు ఇవ్వాలి. గడప గడపకు ప్రభుత్వం పనుల్లో రూ.100 కోట్లు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏడీబీ నిధులతో గ్రామీణ రహదారుల నిర్మాణాలకు రూ.150 కోట్లు పెండింగులో ఉన్నాయి. తాగునీటి సరఫరా పనులకు రూ.350 కోట్లు ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. -
గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. -
జూ.ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. -
పోలీసులు అమాయకులను బలిచేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లలకు పలక ఇచ్చారా?
-
విధి వంచితులకు చేయూత
అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు. -
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్షిప్లు తోడ్పడతాయి. -
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.