కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్?
‘వాన రాకడ.. రాష్ట్రంలో కరెంటు పోకడ’ ఎప్పుడనేది చెప్పడం కష్టమే. గత రెండేళ్లు విద్యుత్ కోతలతో ప్రజలకు చుక్కలు చూపిన జగన్ ప్రభుత్వం.. ఎన్నికల ఏడాదిలోనూ ఊరట కల్పించలేకపోతోంది. అనధికారిక విద్యుత్ కోతలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలు
ఎన్నికల ఏడాదీ ప్రజలపై కనికరం చూపని ప్రభుత్వం
సాంకేతిక సమస్యలంటూ కోతలను దాచేస్తున్న డిస్కంలు
247 ఎంయూలకు చేరిన రోజువారీ డిమాండ్
థర్మల్ కేంద్రాల్లో సరిపడా లేని బొగ్గు నిల్వలు
ఈనాడు, అమరావతి: ‘వాన రాకడ.. రాష్ట్రంలో కరెంటు పోకడ’ ఎప్పుడనేది చెప్పడం కష్టమే. గత రెండేళ్లు విద్యుత్ కోతలతో ప్రజలకు చుక్కలు చూపిన జగన్ ప్రభుత్వం.. ఎన్నికల ఏడాదిలోనూ ఊరట కల్పించలేకపోతోంది. అనధికారిక విద్యుత్ కోతలతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కోతలకు సాంకేతిక సమస్యలంటూ ముసుగువేస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా ఫీడర్ల పరిధిలో విడతల వారీగా విద్యుత్ కోతలను అమలు చేస్తోంది. సోమవారం కొన్ని ఫీడర్ల పరిధిలో 10 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 43.5 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఉండాలంటే కరెంటు లేక.. బయటకు వెళ్దామంటే వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో పడే బాధ వర్ణనాతీతం. పరీక్షల సీజన్ కావడంతో కొద్దిసేపు సరఫరా లేకున్నా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఒప్పందాలు, మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు జరిపినా కోతల్లేని విద్యుత్ ఇవ్వలేక జగన్ ప్రభుత్వం చేతులెత్తేయడంతో జనం అల్లాడిపోతున్నారు.
ఇళ్లకూ సవ్యంగా ఇవ్వలేరా?
ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్లో ప్రభుత్వం 2 గంటలపాటు కోతలు పెట్టింది. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ మౌఖిక ఆదేశాలతో గృహ విద్యుత్ వినియోగదారులకు కోతల్లేకుండా చూడాలని అధికారులు భావించారు. ఈ నెల మొదటి వారం నుంచి రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతూ ప్రస్తుతం 247 ఎంయూలకు చేరడంతో గృహావసరాల విద్యుత్లోనూ డిస్కంలు కోతలు పెడుతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ దిశగా పరుగులు పెడుతోంది. సోమవారం గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 11,876 మెగావాట్లుగా నమోదైంది. డిమాండ్ సర్దుబాటు కోసం అందుబాటులో ఉన్న విద్యుత్ పోను సుమారు 1,062 మెగావాట్లు మార్కెట్ నుంచి సమకూర్చుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ విద్యుత్ డిమాండ్ 247 ఎంయూలుగా ఉంది. ఏపీ జెన్కో ప్రాజెక్టుల నుంచి 103.57 ఎంయూలు, పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 38.01 ఎంయూలు, ప్రైవేటు జనరేటర్ల నుంచి 72.77 ఎంయూలు డిస్కంలు కొనుగోలు చేశాయి. ఎండల తీవ్రత పెరగక ముందే మార్కెట్లో విద్యుత్ దొరకడం కష్టంగా ఉంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పోటీపడి మార్కెట్లో గరిష్ఠ ధరకు విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మే, జూన్ నాటికి రోజు విద్యుత్ డిమాండ్ గరిష్ఠంగా 270 ఎంయూలకు చేరొచ్చు. ఈ డిమాండ్ సర్దుబాటుకు కనీసం 60 ఎంయూలు మార్కెట్లో కొనాల్సిందే. విద్యుత్ దొరకని పక్షంలో కోతలు తప్ప మరో మార్గం లేదు.
దాచేస్తే దాగుతాయా?
మూడు డిస్కంల పరిధిలో 22,113 గ్రామాలుంటే.. ఆదివారం నాడు ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా పూర్తిగా స్థాయిలో విద్యుత్ సరఫరా చేశామని డిస్కంలు పేర్కొంటున్నాయి. 33కేవీ, 11 కేవీ ఫీడర్లు 28 బ్రేక్డౌన్ అయ్యాయని.. సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు చెప్పాయి. అయితే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ఫీడర్లలో గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో గృహవిద్యుత్ వినియోగదారులు గగ్గోలు పెట్టారు. కొన్ని ఫీడర్ల పరిధిలో 10 గంటలకు పైగా కరెంటు లేక ప్రజలు అల్లాడిపోయారు. 17 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎక్కడా కోతల్లేవని ప్రభుత్వం చెబుతోంది. సీఎం సొంత జిల్లా కడప నగరంలోనే ఆదివారం సుమారు అరగంటకు పైగా విద్యుత్ కోత విధించారు.
- శ్రీకాకుళం జిల్లా గార మండలం జల్లువలస, జఫ్రాబాద్, రాఘవాపురం, వాదాడ, తోనంగి, శాలిహుండం గ్రామాల పరిధిలో సోమవారం ఉదయం 5.34 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కరెంటు లేదు.
- రాజమహేంద్రవరం జిల్లా గండేపల్లి మండలం కె.సూరంపాలెం గ్రామీణ ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 7.15 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. రాజమహేంద్రవరంలోని తాడితోట సబ్స్టేషన్ పరిధిలో ఉదయం 8.55 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకూ సరఫరా నిలిచిపోయింది.
- పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఆలవద్ద, కురుపాం మండలం బర్తంగి గ్రామాల పరిధిలో ఉదయం 9.21 నుంచి సాయంత్రం 4.15గంటల వరకు కరెంటు లేదు.
- తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో 39 ఫీడర్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోజు మొత్తంలో సుమారు 100కుపైగా ఫీడర్ల పరిధిలో వివిధ కారణాలతో సరఫరా నిలిపేశారు.
- దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో సోమవారం సాయంత్రం 4.15 గంటల సమయానికి 198 ఫీడర్ల పరిధిలో సరఫరాకు ఆటంకం కలిగింది. లైన్ నిర్వహణ కోసం 18 ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిపేసినట్లు అధికారికంగా చూపారు. అంటే మిగిలిన ఫీడర్ల పరిధిలో అనధికారిక కోతలను అమలు చేస్తున్నట్లే. సీఎం సొంత జిల్లా కడపలో 33 ఫీడర్ల పరిధిలోని వినియోగదారులు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడ్డారు.
- కర్నూలు సర్కిల్ పరిధిలోని ఆదోని గుండ్లకొండ సబ్స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రి 8.30 గంటలకు కూడా పునరుద్ధరించలేదు. లైన్ మెయింటనెన్స్ కోసం నిలిపేసినట్లు అధికారులు చెబుతున్నారు.
- కడప జిల్లా పెద్దముడియం సబ్స్టేషన్ పరిధిలో సాయంత్రం 4.37 నుంచి, తిరుపతి సర్కిల్ పరిధిలోని పూతలపట్టు సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలకు 4.35 నుంచి, అనంతపురం జిల్లా రాయదుర్గం సబ్స్టేషన్ పరిధిలోని గుమ్మగట్ట మండలంలోని పలు గ్రామాలకు 5 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేదు.
- కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ మాత్రం విద్యుత్ కోతల వివరాలను వెబ్సైట్లో పెట్టకుండా జాగ్రత్త పడింది. నిబంధనల ప్రకారం ఈ వివరాలు వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి.
బొగ్గు నిల్వలు నిండుకున్నాయి..
రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో ఏపీ జెన్కో నుంచి 45 శాతం విద్యుత్ అందుతోంది. థర్మల్ యూనిట్లకు అవసరమైన బొగ్గు నిల్వలు రెండు, మూడు రోజలకు మించి లేవు. ప్రస్తుతం విజయవాడ వీటీపీఎస్లో 1.20 లక్షల టన్నులు, ఆర్టీపీపీలో 1.40 లక్షల టన్నులు, కృష్ణపట్నంలో 40 వేల టన్నుల బొగ్గు అందుబాటులో ఉంది. కృష్ణపట్నం యార్డులో లక్ష టన్నులు, ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో మరో 1.50 లక్షల టన్నులు అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. -
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. -
గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. -
జూ.ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
పోలీసులు అమాయకులను బలిచేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లలకు పలక ఇచ్చారా?
-
విధి వంచితులకు చేయూత
అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు. -
నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్షిప్లు తోడ్పడతాయి. -
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనంతపురంలో ఎన్ఐఏ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజినీర్
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ
-
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు