‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే సమస్యలెన్నో
వారసత్వ భూమి మ్యుటేషన్కు ఇన్ని చిక్కులా..
స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇబ్బంది పెడుతున్నారు
ఇక సామాన్యుల పరిస్థితేంటి?
విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
ఈనాడు-అమరావతి: ‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ ప్రత్యక్ష బాధితుడిని తానేనంటూ ఎక్స్లో సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. కొత్త చట్టమని ఒకసారి.. రీసర్వే అని మరోసారి.. ఎల్పీ నంబర్లని ఇంకోసారి చెబుతూ రెవెన్యూ అధికారులు ఆయన్ను సతాయిస్తుంటే సామాన్య రైతుల పరిస్థితి ఏంటన్న ఆందోళన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన రమేశ్.. వివిధ జిల్లాల్లో సబ్ కలెక్టర్, సంయుక్త కలెక్టర్, కలెక్టర్గా పనిచేశారు. పదవీ బాధ్యతల్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సమస్యలు, వివాదాల పరిష్కారానికి కృషి చేశారు. ఏపీ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అమలు సమయంలో కీలకపాత్ర పోషించారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన భూముల మ్యుటేషన్కే తహసీల్దారు పలకడం లేదు.. ఆర్డీవో కాగితాలు తిప్పి పంపుతున్నారంటే.. ఇక రైతుల గోడు పట్టించుకునేదెవరు.. జగన్ పాలనలో అది సాధ్యమా..? తమ భూమి మ్యుటేషన్ కోసం తాను పడిన అవస్థలను ఆయన ‘ఈనాడు’కు వివరించారు.
రైతులకు న్యాయం జరిగేదెలా?
‘వైకాపా నేతలు, ఆ పార్టీ మీడియా చెబుతున్నట్లు నాకు రాజకీయాలతో సంబంధం లేదు.. జగన్, చంద్రబాబు ఇద్దరివద్దా పనిచేశా. వారిద్దరి వ్యక్తిత్వాలూ నాకు తెలుసు. నేను మాట్లాడటం మొదలుపెడితే బాగుండదు’ అంటూ కొందరు వైకాపా నేతలు తనపై చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ హెచ్చరించారు. ‘మహమ్మద్ ఘోరీ పాలనలో కొత్త రాజ్యం వచ్చినప్పుడు.. కొత్త పేర్లు పెడతారు. ఇది ఆంధ్రప్రదేశ్. మద్రాసు ప్రెసిడెన్సీ సమయం నుంచి భూ చట్టాలు, విధానాలున్నాయి. వాటన్నిటినీ పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు’ అని ఆందోళన వెలిబుచ్చారు. ‘దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో మాత్రమే పార్టీ కార్యకర్తలను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. వీరు ప్రభుత్వం కోసం పనిచేస్తారా? పార్టీ కోసం పనిచేస్తారా? గ్రామ మునసబు, కరణం వ్యవస్థను తీసేయడానికి కారణ ఇదే. పెట్టుబడిదారులు, భూస్వాముల మోచేతి నీళ్లు తాగి పేదలకు అన్యాయం చేస్తున్నారని తీసేశారు. ఇప్పుడు పార్టీ వర్కర్లను తీసుకుని.. పెత్తందారీ పనులు అప్పగించారు.. దీని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ఇది ప్రజలు భయపడాల్సిన విషయమే’ అని వివరించారు. ‘గతంలో పేదలకు ప్రభుత్వం పంచిన భూములను అమ్ముకోవచ్చని వైకాపా వచ్చాక చట్టం తెచ్చారు. పండించుకుని బతకమని ఆ భూమి ఇచ్చారు. ఈ ప్రభుత్వ నిర్ణయం కారణంగా.. ఆరు నెలలుగా లక్షల ఎకరాలు భూస్వాములు, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లాయి’ అని వివరించారు.
వారసత్వంగా వచ్చిన భూమికి మ్యుటేషన్ చేయమంటే
పీవీ రమేశ్ తండ్రి సుబ్బారావుకు కృష్ణా జిల్లా విన్నకోటలో వారసత్వంగా వచ్చిన 9.50 ఎకరాలు, తల్లి పేరుతో 7.50 ఎకరాల పట్టా భూములున్నాయి. వాటికి పక్కనున్న మరికొందరు రైతుల భూములతో కలిపి సుమారు 100 ఎకరాల్లో 2003లో చేపల చెరువులు తవ్వి ఏటా లీజుకిస్తున్నారు. రమేశ్ తల్లి 2023 మే 18న, తండ్రి అక్టోబరు 20న చనిపోయారు. అనంతరం జగనన్న భూపట్టా పథకం కింద తన తండ్రి పేరుతో 9.50 ఎకరాలు, తల్లి పేరుతో 7.50 ఎకరాల భూమికి హక్కు పత్రాలిచ్చారు. ‘మా నాన్న వీలునామా ఆధారంగా.. భూములను నాకు, మా ఇద్దరు తమ్ముళ్ల పేరుతో మ్యుటేషన్ చేయాలని 2023 డిసెంబరు 12న అధికారులకు లేఖ రాశా. కొత్త చట్టం ప్రకారం రైతులకు సంబంధించిన చేపల చెరువులకు సర్వే నంబర్లు ఇవ్వడం లేదని, ఎల్పీ(ల్యాండ్ పార్సెల్) నంబర్లు ఇస్తున్నామని.. కాబట్టి మ్యుటేషన్ జరగదని తహసీల్దారు తెలియజేశారు. మీ సర్వే నంబరు చెల్లదన్నారు. ప్రత్యక్షంగా వచ్చి హద్దులు చూపాలన్నారు. చేపల చెరువులో రైతులు హద్దులెలా చూపిస్తారు’ అని రమేశ్ ప్రశ్నించారు.
‘మ్యుటేషన్ చేయనని తహసీల్దారు చెప్పడం చట్టప్రకారం తప్పని ఈ ఏడాది ఫిబ్రవరి 12న సీసీఎల్ఏకే దరఖాస్తు చేశా. ఫిబ్రవరి 22న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ను కలిసి వివరించా. 28న చేపల చెరువును జాయింట్ సర్వే చేయించాలని ఆదేశించారు. సర్వేకు రావాలంటూ అప్పటికే మరణించిన మా తల్లిదండ్రుల పేరుతో ఆర్డీవో నోటీసులిచ్చారు. చనిపోయిన వారికి నోటీసులేంటి’ అని రమేశ్ ప్రశ్నించారు. ‘మా భూమి చేపల చెరువు కింద ఉందని.. ఆ రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని ఆర్డీవోకు పత్రాలు పంపడంతోపాటు.. లేఖ రూపంలో రిజిస్టర్ పోస్టు చేశా. వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తూ తిప్పి పంపారు. కొత్తగా భూమి బదలాయింపు చట్టం అమల్లోకి రాలేదని, రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం కింద వెంటనే మ్యుటేషన్ చేయాలని సీసీఎల్ఏ మార్చి 13న ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు’ అని వివరించారు. ‘వాస్తవంగా రైతుల వారీగా భూముల్ని సర్వే చేసి కొలతలు వేసి అప్పగించాలి. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలి. అలా చేయడం లేదు. చేపల చెరువులకు పట్టా నంబరు తీసేసి.. ఎల్పీ అని పెడుతున్నారు. తర్వాత జాయింట్ సర్వే చేయించి మీ భూముల్ని మీరే రుజువు చేసుకోవాలంటున్నారు. చట్టం పూర్తిగా అమలు కాకముందే ఇంత భయంకరంగా ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. -
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
‘రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు.. ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి.. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి..’ అని ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా తెలుగులో సరికొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు స్వేచ్ఛ సంస్థ వ్యవస్థాపకులు వై.కిరణ్చంద్ర తెలిపారు. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వారంలో..
తెలంగాణ ఎప్సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ప్రారంభం
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సెషన్ ఒకటే నిర్వహించినట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె.వెంకటరెడ్డి తెలిపారు. -
ఆరు వారాల్లో తేల్చండి.. ఏపీ చెస్ అసోసియేషన్కు గుర్తింపుపై హైకోర్టు ఆగ్రహం
ఏపీ చెస్ అసోసియేషన్కు అనుబంధ గుర్తింపు ఇచ్చే వ్యవహారంలో జాతీయ క్రీడల కోడ్ నిబంధనలకు లోబడి తగిన ఉత్తర్వులు జారీచేయాలని అఖిల భారత చదరంగ సమాఖ్య కార్యదర్శిని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
‘ప్రమాదాలు ఆందోళనకరం..’ పట్టించుకోని అధికారగణం!
రాష్ట్రంలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం ఫలితంగా వందల మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఐదు రోజుల కిందట చిలకలూరిపేట వద్ద ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టడంతో మంటలు ఎగిసి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. -
స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా కళాశాలలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ కారిడార్లోకి వర్షపు నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పకడ్బందీ భద్రత ఉండాలి
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
24లోగా రబీ పంట నష్టాన్ని లెక్కించండి
రబీ కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల 24 లోగా పంటనష్టం గణన పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ ఆదేశించారు. రాజకీయ లబ్ధికి తావులేకుండా నష్టాన్ని లెక్కించాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. -
ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ
జగన్ ప్రభుత్వ కక్షపూరిత చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పౌర సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ‘ఛేంజ్.ఓఆర్జీ’లో వేల మంది సంతకాలు చేస్తున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి క్యూలైన్లో వచ్చిన భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్లు లేని భక్తులు శనివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఔటర్రింగ్ రోడ్డు, శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. -
ఉన్నత విద్యామండలి ఛైర్మన్పై గవర్నర్కు ఫిర్యాదు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డిపై గవర్నర్కు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేయగా.. చర్యల కోసం వాటిని ఉన్నత విద్యాశాఖకు పంపించారు. -
కోడ్ ఉల్లంఘన ఆరోపణలతో ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.లావణ్య దేవిని సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్