girls dropouts:విద్యార్థినులు పాఠశాలలకు దూరం కావొద్దు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 10లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల అందించనున్నట్లు సీఎం
ఏటా 10 లక్షల మందికి ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ
చేయూత దుకాణాల్లో తక్కువ ధరకే అందరికీ అందుబాటులోకి..
‘స్వేచ్ఛ’ ప్రారంభోత్సవంలో సీఎం
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 10లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల అందించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పీఅండ్జీ, హైజీన్ అండ్ హెల్త్కేర్, నైన్ కంపెనీకి చెందిన బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లను ప్రతి విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 ఇస్తామని తెలిపారు. వేసవి సెలవులకు సరిపడా సెలవులకంటే ముందే ఒకేసారి పాఠశాలల్లోనే పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇందుకుగాను ఏడాదికి రూ.32 కోట్లు వ్యయమవుతుందన్నారు. గ్రామస్థాయిలోని మహిళలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే చేయూత దుకాణాల్లోనూ విక్రయిస్తామని చెప్పారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం స్వేచ్ఛ పోస్టరును విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. దేశంలో దాదాపు 23% మంది విద్యార్థినులు పాఠశాల మానేయడానికి రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులే కారణమని యునైటెడ్ వాటర్సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదిక చెబుతోంది. ఈ పరిస్థితి మారాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నాం. రుతుక్రమానికి సంబంధించిన అంశాలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం తప్పు అనే ఆలోచన మారాలి’ అని సూచించారు.
నెలకోసారి అవగాహన సదస్సు
‘బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయురాలు, అధ్యాపకురాలు, ఏఎన్ఎంలు 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు నెలకోసారి తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలి. మహిళా పోలీసు ఇందులో భాగస్వామ్యం కావాలి. దిశ చట్టంపై, యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే అంశాలపై మహిళా పోలీసు అవగాహన కల్పించాలి. ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లాల్లో జేసీ (ఆసరా) పర్యవేక్షించాలి’ అని సీఎం ఆదేశించారు. ‘ఈ పథకం అమలుకు ప్రతి పాఠశాల, కళాశాలలో నోడల్ అధికారిగా ఒక ఉపాధ్యాయురాలు/అధ్యాపకురాలిని నియమిస్తాం. పాఠశాల, కళాశాల స్థాయిలో అమలు బాధ్యతను నోడల్ అధికారి పర్యవేక్షిస్తారు. వినియోగించిన శానిటరీ న్యాప్కిన్స్ పర్యావరణానికి నష్టం కల్గించకుండా ఎలా పారేయాలనే (డిస్పోజ్) అంశంపై విద్యార్థినులకు ఆ నోడల్ అధికారి అవగాహన కల్పించాలి. శానిటరీ న్యాప్కిన్స్ను డిస్పోజ్ చేసి పర్యావరణ హానిరహితంగా మార్చేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 6,417 ఇన్సినరేటర్లను ఏర్పాటుచేశాం. పాఠశాలల్లోని మరుగుదొడ్లలోనూ వీటిని ఏర్పాటుచేస్తున్నాం. పురపాలక సంఘాలకు ప్రత్యేకంగా డస్ట్బిన్లను ఇస్తాం’ అని తెలిపారు.
మహిళా సాధికారతలో మనమే ముందు
‘మహిళా సాధికారతలో 28 రాష్ట్రాలకంటే మనమే ముందున్నాం. అమ్మఒడి, సంపూర్ణ పోషణ, ఆసరా, సున్నావడ్డీ రుణాలు, చేయూత, ఇళ్ల పట్టాలు.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా మహిళల కేంద్రంగానే అమలు చేస్తున్నాం’ అని జగన్ వివరించారు. అక్టోబరు, నవంబరు నెలలకు సరిపడా నిల్వలను ఇప్పటికే పాఠశాలలకు పంపించామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు.
శానిటరీ న్యాప్కిన్ పంపిణీకి ఆదేశాలు
ఈనాడు, అమరావతి: పాఠశాలల్లో శానిటరీ న్యాప్కిన్లను ఈనెల 8లోపు విద్యార్థులకు అందించాలని ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు, అక్టోబరు నెలకు సంబంధించి ఆగస్టు నెలలో అందించిన వాటిని పంపిణీ చేయాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా