జగన్ బెయిలు రద్దు పిటిషన్ విచారణార్హమే
అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బెయిలును రద్దు చేయాలని.....
ఎంపీ రఘురామ వ్యాజ్యంపై సీబీఐ కోర్టు
త్వరలో ముఖ్యమంత్రికి నోటీసులు!
ఈనాడు, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ కోర్టు కార్యాలయ అభ్యంతరాలను సీబీఐ ప్రధాన కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్కు విచారణార్హత ఉందంటూ మంగళవారం స్పష్టంచేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందోలకు సంబంధించిన భూకేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో జగన్ బెయిలును రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణరాజు మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.మధుసూదన్రావు గత వారం విచారణ చేపట్టి వాదనలు విన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి రఘురామ కృష్ణరాజు పిటిషన్ విచారణార్హమేనని, దీనికి నంబరు కేటాయించి బెంచ్ ముందుంచాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నంబరు కేటాయించాక ఇందులో ప్రధాన నిందితుడైన జగన్మోహన్రెడ్డికి నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. సాధారణంగా బెయిలు రద్దు కోసం కోర్టు తనంతటతానుగా కానీ, దర్యాప్తు సంస్థ, ఫిర్యాదుదారు, సామాన్యుడు ఎవరైనా దరఖాస్తు చేయవచ్చని, ఇదే విషయాన్ని రాతినాం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. మూడో వ్యక్తి దరఖాస్తు చేశారన్న కారణంగా తిరస్కరించరాదని, బెయిలుకు సంబంధించిన సబ్సెక్షన్లో కేవలం ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ మాత్రమే బెయిలు రద్దుకు దరఖాస్తు చేయాలని చెప్పలేదని ఇదే విషయాన్ని పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేశాయని న్యాయవాది చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తూ న్యాయ ప్రక్రియకు గండికొడుతున్నారని రఘురామ కృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. బెయిలు రద్దు విషయంలో కోర్టు మొదట కేసు ప్రత్యేకత, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితులకు కీలకమైన పదవులు కట్టబెడుతుండటంతో వారు బెదిరించి భయపెట్టడం ద్వారా సాక్షులను తారుమారు చేయడానికి అవకాశం ఉందన్నారు. సాక్షులుగా ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులే ఉన్నారని, ఈ నేపథ్యంలో నిష్పాక్షిక విచారణను ఆశించలేమని, అందుకే బెయిలు రద్దు చేయాలని విన్నవించారు. జగన్కు న్యాయ ప్రక్రియపై ఎలాంటి గౌరవం లేదని,. స్వల్ప కారణాలను పేర్కొంటూ 317 దరఖాస్తులను దాఖలు చేయడం ద్వారా గత ఏడాది కాలంగా కోర్టు ముందు విచారణకు హాజరు కావడంలేదన్నారు. బెయిలు నిమిత్తం చేసుకున్న దరఖాస్తులో దర్యాప్తునకు, విచారణకు సహకరిస్తానంటూ హామీ ఇచ్చారని, ఇప్పుడు స్వల్ప కారణాలను పేర్కొంటూ కోర్టు విచారణకు సహకరించడం లేదన్నారు. ఇది కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారని, ఈ కారణంగా బెయిలును రద్దు చేయవచ్చని న్యాయవాది వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు. -
బాణసంచా పేలుళ్లకు బెదిరి.. వృద్ధురాలిని పొడిచిన ఆవు
వైకాపా నాయకులు కాల్చిన బాణసంచా ఒక వృద్ధురాలు గాయపడటానికి కారణమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని రామాపురం సంఘం కాలనీలో కావలి ఎమ్మెల్యే సమీప బంధువు మన్నెమాల సుకుమార్రెడ్డి తన అనుచరులతో ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. -
రండి.. రండి.. ఓటేయగ తరలిరండి!
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. -
ల్యాండ్ టైటిలింగ్పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్పై సీఐడీ కేసు
తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సహా మొత్తం 10 మందిపైన ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. -
వడగాలులు తగ్గుముఖం.. వర్షాలకు అవకాశం!
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు వడగాలులు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. -
రెండు నెలలుగా జీతాలందని శాప్ కోచ్లు
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలోని శిక్షకులకు రెండు నెలలుగా జీతాల్లేవు. ఇదిగో అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. -
పింఛన్కు వెళ్లి.. వడదెబ్బతో వృద్ధుడి మృతి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన గంగదారి సుబ్బారావు(67) వడదెబ్బతో మృతి చెందారు. శనివారం ఉదయం పింఛను కోసం స్థానిక బ్యాంకు వద్దకు వెళ్లారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది.