NASA Spacecraft: సూర్యుడిని ముద్దాడిన వ్యోమనౌక
మానవుడు సాధించిన మరో ఘన విజయమిది.. నాసా మూడేళ్లక్రితం ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక భానుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. 11 లక్షల డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతతో మండే అగ్నిగోళాన్ని శోధిస్తోంది..
భానుడిని తాకిన పార్కర్ సోలార్ ప్రోబ్
కరోనా పొరలోకి ప్రవేశించిన నాసా వ్యోమనౌక
ఖగోళ పరిశోధనల్లో కీలక మైలురాయి
మానవుడు సాధించిన మరో ఘన విజయమిది.. నాసా మూడేళ్లక్రితం ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక భానుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. 11 లక్షల డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతతో మండే అగ్నిగోళాన్ని శోధిస్తోంది..
వాషింగ్టన్: అంతరిక్షంలో అద్భుతం జరిగింది! అసాధ్యమని ఒకప్పుడు భావించిన పనిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా సుసాధ్యం చేసింది. ఆ సంస్థ ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అనే వ్యోమనౌక.. సూర్యుడి బాహ్య వాతావరణ పొర ‘కరోనా’ను తాకింది. అక్కడ ఉష్ణోగ్రత 11 లక్షల డిగ్రీల సెల్సియస్కు పైగా ఉంటుంది. దాన్నిబట్టి నాసా సాధించిన ఘనత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. సౌర వాతావరణం, విశ్వంలోని ఇతర నక్షత్రాలకు సంబంధించిన ఎన్నో చిక్కుముడులను విప్పే దిశగా ఇది కీలక ముందడుగు కానుంది.
కరోనా పొరపై ఏడేళ్లపాటు పరిశోధనలు జరపడమే ప్రాథమిక లక్ష్యంగా నాసా మూడేళ్లక్రితం పార్కర్ సోలార్ ప్రోబ్ను ప్రయోగించింది. ఏడు విన్యాసాలు చేపట్టడం ద్వారా దాన్ని 26సార్లు సూర్యుడికి అత్యంత చేరువగా (పెరీహీలియన్) తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది. అంతకుముందు ఏడుసార్లు కరోనాకు సమీపంగా వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్.. ఈ ఏడాది ఏప్రిల్లో 8వ పెరీహీలియన్తో తొలిసారి ఏకంగా కరోనా పొరలోకి ప్రవేశించింది. సంపూర్ణ సూర్యగ్రహణ సమయాల్లో కనిపించే కరోనల్ నిర్మాణాల గుండా ప్రయాణించింది. భవిష్యత్ పరిశోధనల కోసం కొన్ని రేణువులనూ సేకరించింది. అయస్కాంత క్షేత్ర డేటా, సౌరగాలుల డేటా విశ్లేషణ ద్వారా- పార్కర్ ప్రోబ్ కరోనా వలయంలోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు.
అద్భుత పురోగతి
సూర్యుడి ఉపరితలం ఘనరూపంలో ఉండదు. ఈ నక్షత్ర గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత క్షేత్రం.. ప్లాస్మాను పట్టి ఉంచలేనంత బలహీనంగా ఉన్న అంచును ‘ఆల్ఫ్వెన్’ ఉపరితలంగా పిలుస్తారు. దాన్నే సూర్యుడి సరిహద్దుగా పరిగణిస్తారు. దాని తర్వాతిభాగం నుంచి సౌరగాలులు ఉత్పత్తయి.. సౌర కుటుంబం గుండా బలంగా వీస్తాయి. ‘ఆల్ఫ్వెన్’ ఉపరితలం ఎక్కడుంది? అక్కడి వాతావరణం ఎలా ఉంది? వంటి వివరాలేవీ ప్రస్తుతం తెలియవు. దాని గుట్టువిప్పడం పార్కర్ ప్రోబ్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. సూర్యుడి కేంద్రభాగం నుంచి 10-20 సోలార్ రేడియై మధ్య భాగంలో ఆల్ఫ్వెన్ ఉంటుందని అంచనా. అంటే.. సూర్యుడి కేంద్రభాగం నుంచి దాదాపు 43 లక్షల మైళ్ల దూరంలో ప్రారంభమై.. 86 లక్షల మైళ్ల దూరం వరకు అది విస్తరించి ఉంటుంది. తాజాగా పార్కర్ 19.7 సోలార్ రేడియై వద్ద కరోనా పొరలోకి ప్రవేశించి.. ఓ దశలో 18.4 సోలార్ రేడియై (సూర్యుడి కేంద్ర భాగం నుంచి 79లక్షల మైళ్లు) దూరం వరకూ వెళ్లింది. మొత్తంగా కరోనా పొరలో దాదాపు ఐదు గంటలపాటు ఉండి.. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో హెచ్చుతగ్గులను గుర్తించింది. సౌర కుటుంబానికి గుండెకాయలాంటి ఆ ప్రాంతానికి సంబంధించి మునుపెన్నడూ అందుబాటులో లేని డేటాను శాస్త్రవేత్తల చేతికి అందించింది. ఆల్ఫ్వెన్ ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉన్నట్లు వారు గుర్తించారు. సూర్యుడికి ఇంకా దగ్గరగా వెళ్లినప్పుడు సూడోస్ట్రీమర్ అనే అయస్కాంత క్షేత్రం వ్యోమనౌకకు ఎదురైంది. చుట్టూ ఉన్నదాంతో పోలిస్తే అక్కడి వాతావరణం కాస్త నిలకడగా కనిపించింది. సౌరగాలుల అయస్కాంత క్షేత్రంలో వచ్చే ‘జడ్’ ఆకృతిలోని మెలికలు- ‘సోలార్ స్విచ్బ్యాక్’లలో కొన్ని.. దిగువ కరోనా నుంచీ వస్తుంటాయని వ్యోమనౌక తాజాగా గుర్తించింది.
మున్ముందు మరింత చేరువగా..
మున్ముందు విన్యాసాల్లో భాగంగా.. సూర్యుడి కేంద్రభాగం నుంచి 9.86 సోలార్ రేడియై దూరం వరకూ పార్కర్ వెళ్లనుంది. అంటే భానుడి గురించి ఇప్పటివరకూ ఎన్నడూ అందుబాటులో లేని మరెన్నో వివరాలు ఇకపై తెలిసే అవకాశముంది.
అంత ఉష్ణోగ్రతను ఎలా తట్టుకుంది?
నాసాతోపాటు పలు ఇతర పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పార్కర్ ప్రోబ్ను సంయుక్తంగా రూపొందించారు. అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా దానిచుట్టూ పటిష్ఠ కవచం ఉంటుంది. నమూనాలను సేకరించేందుకు ఉపయోగించేందుకు బిగించిన కప్, మరో పరికరం మాత్రం కవచం బయట ఉంటాయి. వాటిపై సూర్యకాంతి నేరుగా పడుతుంది. అవి కరిగిపోకుండా టంగ్స్టన్, నియోబియం, మాలిబ్డినమ్, సఫైర్ వంటి పదార్థాలతో వాటిని తయారుచేశారు.
* సూర్యుడి ఉపరితలం కంటే.. దాని బాహ్య వాతావరణంలోనే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రత దాదాపు 5,500 డిగ్రీల సెల్సియస్. బాహ్య వాతావరణంలో మాత్రం ఏకంగా 20 లక్షల డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతుంటుంది.
పార్కర్ ప్రోబ్ను ఎప్పుడు ప్రయోగించారు?
2018
కరోనా పొరలోకి తొలిసారి ఎప్పుడు ప్రవేశించింది?
2021 ఏప్రిల్ 28న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి