Ukraine Crisis: వంటనూనె.. సలసల
విజయవాడలోని ఒక కార్పొరేట్ మాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు లీటరు పామాయిల్ ధర రూ.128 ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ.149 అయింది. అంటే రెండు గంటల్లోనే లీటరుకు రూ.21 చొప్పున పెరిగింది.
రెండు రోజుల్లోనే లీటరుకు రూ.20కి పైగా పెరుగుదల
ఉక్రెయిన్లో యుద్ధం పేరిట స్థానికంగా దోపిడీ
విజయవాడలోని ఒక కార్పొరేట్ మాల్లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు లీటరు పామాయిల్ ధర రూ.128 ఉండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి రూ.149 అయింది. అంటే రెండు గంటల్లోనే లీటరుకు రూ.21 చొప్పున పెరిగింది.
ఈనాడు, అమరావతి: వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి. లీటరుపై రూ.10 నుంచి రూ.25 వరకు పెరిగాయి. అదేమంటే అక్కడెక్కడో యుద్ధం అంటగా? అందుకే పెరిగాయనే సమాధానం వస్తోంది. ఈ పెరుగుదల ఎంతవరకో తెలియడం లేదని, కరోనా సమయంలో ధరలకు మించి పెరిగే అవకాశం ఉందంటున్నారని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల పెరుగుదల కారణంగా పేద, మధ్యతరగతి వర్గాల ఇంటి ఖర్చు మరింత పెరుగుతోంది. రోడ్డు పక్క తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల ఆదాయానికి చిల్లు పడుతోంది. యుద్ధం మొదలై రెండు రోజుల్లోనే నూనె ధరలు పెరగడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే గోదాముల్లో ఉన్న సరకుకే ధరలు పెంచేసి అమ్ముతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇష్టారాజ్యంగా ధరల పెంపు
శనివారం సాయంత్రానికి వంట నూనెల ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నాయి. సగటున వేరుసెనగ నూనె రూ.170, పొద్దుతిరుగుడు నూనె (సన్ఫ్లవర్ ఆయిల్) రూ.160, పామాయిల్ రూ.150 వరకు పలుకుతోంది. రైస్రిచ్, రైస్బ్రాన్ నూనెల ధరలూ లీటరుకు రూ.20 వరకు పెరిగాయి. విజయవాడ చిల్లర మార్కెట్లో లీటరు పామాయిల్ రూ.158, పొద్దుతిరుగుడు నూనె రూ.175, వేరుసెనగ రూ.175 చొప్పున విక్రయిస్తున్నామని వ్యాపారులు వివరించారు. కొన్నిచోట్ల వేరుసెనగనూనె లీటరు రూ.182, పొద్దుతిరుగుడు నూనె రూ.180 అని బోర్డులు పెట్టారు. హోల్సేల్ ధరల పెరుగుదల నేపథ్యంలో తామూ పెంచక తప్పలేదని వివరించారు.
* కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ వెబ్సైట్లోని సమాచారం మేరకు శనివారం దేశవ్యాప్త సగటు ధరలు పరిశీలిస్తే.. సన్ఫ్లవర్ ఆయిల్ రూ.152.30, పామోలిన్ రూ.135.78, వేరుసెనగ నూనె రూ.173.40 చొప్పున ఉంది. క్షేత్రస్థాయి ధరలకు వీటికీ పోలికే లేదు.
* గత నెల ఇదే సమయంలో ప్రధాన నౌకాశ్రయాల్లో దిగుమతి అయిన పామోలిన్ ధర లీటరు రూ.119- 120 మాత్రమే ఉంది. ఇప్పుడు లీటరుకు రూ.25 నుంచి రూ.30 పైనే పెరుగుదల నమోదైంది.
* వేరుసెనగ నూనెపై దిగుమతుల ప్రభావం అంతగా లేకున్నా.. దాని ధరలూ లీటరుకు రూ.10 నుంచి రూ.20 పైనే పెంచేయడం గమనార్హం. లీటరు ధర గరిష్ఠంగా రూ.165 నుంచి రూ.175 మధ్యకు చేరింది.
రోజుకు రూ.150 అదనపు భారం
శుక్రవారంతో పోలిస్తే శనివారం లీటరుకు రూ.30 వరకు పెరిగింది. రోజుకు 5 లీటర్ల పామోలిన్ వినియోగిస్తే రూ.150 వరకు అదనంగా ఖర్చవుతోందని చిల్లర వ్యాపారులు పేర్కొంటున్నారు. నూనె ధరలు పెరిగాయని వెంటనే తినుబండారాల ధరల్ని పెంచలేం కదా? అని కృష్ణవేణి పాఠశాల రోడ్డులో వ్యాపారం చేసే కృష్ణ వాపోయారు. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. మేమూ అల్పాహార ధరలు పెంచాల్సి వస్తుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.