Adani group: అదానీ గ్రూప్నకు సిటీ బ్యాంక్ షాక్.. కొనసాగుతున్న షేర్ల పతనం!
Adani group: స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ ఆ గ్రూప్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఏసీసీ, అంబుజా షేర్లు మినహా అన్ని షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి.
దిల్లీ: హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ (Adani group) షేర్లలో మొదలైన నష్టాల పరంపర ఇంకా కొనసాగుతోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ సహా ఆ గ్రూప్నకు చెందిన స్టాక్స్లో గురువారం అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. పూర్తిగా సబ్స్క్రైబ్ అయిన ఎఫ్పీఓను (FPO) అదానీ గ్రూప్ నిలిపివేయడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఇంకో వైపు సిటీ బ్యాంక్ గ్రూప్ సైతం అదానీ గ్రూప్నకు షాకిచ్చింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్పై తమ క్లయింట్లకు రుణాలు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఆర్బీఐ సైతం రంగ ప్రవేశం చేసినట్లు సమాచారం.
రూ.20వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ను అదానీ ఎంటర్ప్రైజెస్ బుధవారం ఉపసంహరించుకుంది. స్టాక్ మార్కెట్ ఒడుదొడుకుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాటాదారులకు సొమ్ము తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ట్రేడింగ్ సెషన్లో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో ఏకంగా 15 శాతం కుంగి రూ.1809.40 వద్ద కొనసాగుతోంది. గ్రూప్ స్టాక్స్లో సైతం నష్టాల పరంపర కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్ 14 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 10 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం, అదానీ విల్మర్ 5 శాతం, ఎన్డీటీవీ 4.99 శాతం, అదానీ పవర్ 4.98 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంబుజా, ఏసీసీ షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇప్పటి వరకు అదానీ గ్రూప్నకు చెందిన 100 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది.
సిటీ గ్రూప్ షాక్..
అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన సెక్యూరిటీస్పై తమ క్లయింట్లకు ఎలాంటి మార్జిన్ రుణాలు ఇవ్వకూడదని సిటీ గ్రూప్నకు చెందిన వెల్త్ యూనిట్ నిర్ణయించినట్లు తెలిసింది. క్రెడిట్ సూయిజ్ ఏజీ సైతం అదానీ గ్రూప్ బాండ్లపై రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. బాండ్లకు విలువను జీరోగా పేర్కొంది.
ఆర్బీఐ ఎంట్రీ..!
అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ ఆరోపణలు, స్టాక్ మార్కెట్లో ఆ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రంగ ప్రవేశం చేసినట్లు తెలిసింది. అదానీ గ్రూప్ కంపెనీలకు ఏయే బ్యాంకులు ఎంత రుణం ఇచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే, ఆర్బీఐ మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం