Supreme Court: అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారం.. సెబీ అభ్యర్థనకు సుప్రీం ఓకే, కానీ!
అదానీ గ్రూప్ (Adani Group) వ్యవహారంపై విచారణ జరిపేందుకు గడువు పొడిగించాలని కోరుతూ సెబీ (SEBI) దాఖలు చేసిన పిటిషనపై సుప్రీం ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. విచారణ గడువును పొడిగించేందుకు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తిం చేసింది.
దిల్లీ: అదానీ గ్రూప్ (Adani Group) వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు సెబీ (SEBI)కి గడువును పొడిగించేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) సుముఖత తెలిపింది. ఈ మేరకు సెబీ పిటిషన్పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్థీవాలాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అయితే, సెబీ కోరినట్లు ఆరు నెలల సమయం కాకుండా మూడు నెలల గడువు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. సెబీ అభ్యర్థనపై తదుపరి విచారణను మే15కు వాయిదా వేసింది. అలానే, అదానీ గ్రూప్- హిండెన్బర్గ్ వివాదంపై విచారణ జరిపేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ తన నివేదికను ధర్మాసనానికి సమర్పించింది. మే 15లోగా ఈ నివేదికలోని అంశాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రీసెర్చ్ (Hindenburg) విడుదల చేసిన నివేదిక అనంతరం, సంస్థ షేర్ల విలువ భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో షేర్ల అవకతవకలపై రెండు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెబీని సుప్రీం కోర్టు మార్చి 2న ఆదేశించింది. అయితే, ఈ విచారణకు ఆరు నెలల గడువు కావాలని కోరుతూ సుప్రీం కోర్టు వద్ద సెబీ దరఖాస్తు చేసుకుంది. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన న్యాయవాది విశాల్ తివారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలు సేకరించేందుకు సెబీ కావాల్సినంత సమయం దొరికిందని ఆయన వాదించారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మూడు నెలల గడువుకు సుముఖత వ్యక్తం చేసింది. దీనిపై మే15న మరోసారి విచారణ జరుపుతామని తెలిపింది.
కొద్దిరోజుల క్రితం అదానీ గ్రూప్కు తమ దేశంలో ఎలాంటి షెల్ కంపెనీలు లేవని మారిషస్ ప్రభుత్వం సైతం వెల్లడించింది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని మారిషస్ ఆర్థిక సేవల మంత్రి మహేన్ కుమార్ సీరుత్తన్ ఆ దేశ పార్లమెంటుకు తెలిపారు. ఓఈసీడీ విధించే తప్పనిసరి పన్ను నిబంధనలను మారిషస్ పాటిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్